మా ట్రాక్టర్ను పట్టుకోవడానికి ఎన్ని గుండెలు ?
మా ఇలాకాలోకి వచ్చి మా ట్రాక్టరునే పట్టుకుంటారా మీ కెంత ధైర్యం.. ఇది మా అడ్డా మీ పెత్తనం ఏంటంటూ కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ వైకాపా నేత ప్రైవేట్ విజిలెన్స్ సంస్థ ప్రతినిధిపై బెదిరింపులకు దిగిన ఘటన శనివారం పత్తికొండలో చోటు చేసుకుంది.
ప్రైవేటు సంస్థ విజిలెన్స్ ప్రతినిధులపై వైకాపా నాయకుడి బెదిరింపులు
సంస్థ ప్రతినిధులతో వాదనకు దిగిన వైకాపా నాయకులు
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: మా ఇలాకాలోకి వచ్చి మా ట్రాక్టరునే పట్టుకుంటారా మీ కెంత ధైర్యం.. ఇది మా అడ్డా మీ పెత్తనం ఏంటంటూ కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ వైకాపా నేత ప్రైవేట్ విజిలెన్స్ సంస్థ ప్రతినిధిపై బెదిరింపులకు దిగిన ఘటన శనివారం పత్తికొండలో చోటు చేసుకుంది. పత్తికొండ మండలం కనకదిన్నె, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లోని వాగులు, వంకల నుంచి అధికార పార్టీ నాయకులు, వారి అండ దండ కలిగిన ట్రాక్టర్ యజమానులు గత కొంత కాలంగా ఇసుకను అక్రమంగా తవ్వి తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇసుకను తవ్వుకొని విక్రయించేందుకు జేపీ పవర్ ఇన్ఫ్రా ప్రైవేటు సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. అయినా పత్తికొండ ప్రాంతంలోని ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు కొందరు ప్రతినిధుల కళ్లు గప్పి ఇసుకను తరలిస్తున్నారు. శనివారం కనకదిన్నె వాగు వైపు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టరును ఆ సంస్థ విజిలెన్స్ ప్రతినిధి విజయ్భాస్కర్ ఆధ్వర్యంలో పట్టుకొని స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న కోతిరాళ్ల గ్రామ వైకాపా ఎంపీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో కలసి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకొని సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. మా ప్రాంతంలో మేం తప్ప మరెవరు ఇసుక తరలించడానికి వీల్లేదంటూ హల్చల్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడా అంటివి.. యాడుంది ప్రగతి జాడ
[ 11-05-2024]
కరవు కాటకాలు, వలసలతో విలవిలలాడే కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ తెరపైకి తీసుకొచ్చిన ‘ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ (ఆడా)ను ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది -
రాష్ట్రాన్ని జగన్ ఎడారిగా మార్చారు
[ 11-05-2024]
జిల్లా ప్రజలకు ఏమి చేస్తామో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పలేకపోయారని.. పచ్చని చెట్లను నరికించి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చదువులమ్మ వాకిట అవస్థల పాఠం
[ 11-05-2024]
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ.. విద్యనందిస్తున్నామని చెబుతోంది జగన్ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. -
ప్రగతి నినాదం (ఏది కావాలో ఎంచుకో) విధ్వంస విధానం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకొచ్చింది.. నేటితో ప్రచారం ముగియనుంది.. ‘తెర’ వెనక మంతనాలు మొదలు కానున్నాయి.. మహిళా సంఘాలకు ఎర వేస్తారు.. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలను ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.. -
సాయంత్రం 6 వరకు పోలింగ్
[ 11-05-2024]
‘సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్కు ముందు 72 గంటలు అత్యంత కీలకం. -
సీమంతైనా మేలు చేయని జగన్
[ 11-05-2024]
కృష్ణా వెనుక జలాల ఆధారంగా నిర్మించిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన జల వనరులను గాలికొదిలేసింది. -
అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందే: తెదేపా
[ 11-05-2024]
మే 13న జరిగే పోలింగ్తో రాష్ట్రంలో వైకాపా అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందేనని డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. -
అవుకు అధికారంలో అలజడి
[ 11-05-2024]
నంద్యాల జిల్లా అవుకులో వైకాపా నాయకులు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ రసాబాసగా మారడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. వైకాపా నాయకుల మధ్య ఆధిపత్యపు పోరే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. -
యువకుడి ఆత్మహత్య
[ 11-05-2024]
కర్నూలులోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన గుండ్రెడ్డి జయచంద్రారెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మహేశ్వరరెడ్డి, మాధవి దంపతులు తమ పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చారు. -
పతాకస్థాయికి ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు ప్రలోభాల ప్రక్రియకు తెరతీశారు. రాత్రి వేళల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటరు స్లిప్పులు పరిశీలించి డబ్బులు అందజేస్తున్నారు. -
ఎన్నికల నిర్వహణకు పంచాయతీ నిధులు
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో పంచాయతీ నిధులన్నీ పక్కదారి పట్టాయి. గ్రామాల్లో కనీసం వసతులు కల్పించేందుకు వీలులేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో సర్పంచులు అప్పులు చేసి పనులు చేయించారు. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలు ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు