బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి.
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ
న్యూస్టుడే, ఆదోని క్రీడలు
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. ఆదోని పట్టణానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారులు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. కోచ్ కేశవ్ ఆధ్వర్యంలో బాక్సింగ్ క్రీడలో కఠిన సాధన చేస్తున్నారు.
గోవాలో జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్-2024 పోటీల్లో ప్రతిభ చాటిన ఆదోని బాక్సర్లు
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రత్యర్థులపై తమ పంచ్ పవర్ రుచి చూపించి పతకాల కైవసం చేసుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్-2024 పోటీలో రాణించిన ఆదోని పట్టణానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారుల గురించి తెలుసుకుందామా..
విష్ణు విశ్వరూపం
ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు దంపతుల కుమారుడు విష్ణువర్దన్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. రెండేళ్లుగా బాక్సింగ్ నేర్చుకుటున్నాడు. ముఖ్యంగా ఫేస్పంచ్, స్ట్రైట్ పంచ్, లోయర్ పంచ్ వంటి పంచ్లపై ప్రత్యేకంగా మెలకువలు నేర్చుకుంటున్నాడు. చురుకుదనంతో ప్రత్యర్థులపై తన పంచ్ల వర్షం కురిపిస్తూ.. అపజయాలు రుచిచూపిస్తున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో అండర్-60 కేటగిరీ విభాగంలో బరిలో దిగి ప్రత్యర్థులను ఇంటిదారిపట్టించాడు. బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
రఘు పంచ్తంత్రం
ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన రైతు రాజు, సుజాత దంపతుల కుమారుడు యు.రఘు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాక్సింగ్ క్రీడపై మక్కువతో ఆదోని పట్టణంలోని మాస్టర్ కేశవ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. చదువుతూనే మరో వైపు ఉదయం, సాయంత్రం బాక్సింగ్ క్రీడలో సాధన చేస్తూ పట్టు సాధిస్తున్నాడు. ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపిస్తాడు. పంచ్ తప్పించుకోవడంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో అండర్-45 కేటగిరీలో పాల్గొని తన క్రాస్ పంచ్ పవర్తో ప్రత్యర్థిపై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. బాగా చదవడంతో పాటు బాక్సింగ్లో రాణించాలని ఉందని చెబుతున్నాడు రఘు.
రింగ్లో శివతాండవం
ఆదోని పట్టణం విక్టోరియాపేటకు చెందిన మల్లికార్జున, పార్వతి దంపతుల కుమారుడు బి.శివకుమార్ బీఏ డిగ్రీ చదువుతున్నాడు. రెండేళ్లుగా బాక్సింగ్ సాధన చేస్తున్నాడు. రోజూ బాక్సింగ్లో సాధన చేస్తూనే పౌష్టికాహారం తీసుకుంటూ.. అవసరమైన వ్యాయామం చేస్తున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో శివకుమార్ అండర్-80 విభాగంలో ప్రాతినిధ్యం వహించి ఫైనల్స్ వరకు దూసుకెళ్లి వెండి పతకం కైవసం చేసుకున్నాడు. బాక్సింగ్ క్రీడలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నాడు క్రీడాకారుడు శివకుమార్.
విజయాల చిరునామా
ఆదోని పట్టణం మహాత్మాగాంధీనగర్కు చెందిన వీరేశ్, పార్వతి దంపతుల కుమారుడు కె.విజయ్ పదో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు బాక్సింగ్ క్రీడలో రాణిస్తున్నాడు. కోచ్ కేశవ్ వద్ద గత ఏడాది నుంచి బాక్సింగ్లో సాధన చేస్తున్నాడు. ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపించడంతో పాటు ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి.. శక్తి ఎలా కూడగట్టుకోవాలి.. అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఫైనల్ పోటీ వరకు వెళ్లి వెండి పతకం సాధించి సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యమని చెబుతున్నాడు క్రీడాకారుడు విజయ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల ఓటు..గెలుపు మలుపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితం రెండు రోజుల్లో తేలనుంది.. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
దారికాచిన మృత్యువు
[ 02-06-2024]
అప్పటి వరకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో విషాదం నెలకొంది.. బావమరిది పెళ్లి కోసం భాగ్యనగరం నుంచి ఆళ్లగడ్డకు వచ్చారు.. వారం రోజులు ఆనందంగా గడిపారు. -
రమణీయం.. గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం
[ 02-06-2024]
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కోడుమూరు మండలంలోని వెంకటగిరిలో గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. -
ఫలితాలపై పందేల జోరు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పందేలు తారస్థాయికి చేరాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో పందేలు జోరందుకున్నాయి. -
రైలు ప్రయాణంలో సమస్యా..139కి ఫోన్ చేయండి
[ 02-06-2024]
ఇలా... రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు వచ్చినా....విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నా, ఇతరుల వల్ల ఇబ్బందులు కలిగినా... మనోవేదనకు గురికాకుండా అత్యవసర నంబరు 139కు ఫోన్చేస్తే చాలు. -
కుదరని సరిహద్దు సయో
[ 02-06-2024]
మల్లన్న క్షేత్రంలో ‘భూ’ పంచాయతీ రాజుకుంది. హద్దులకు సంబంధించి ఆలయ, అటవీ శాఖ అధికారుల మధ్య గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. -
మూడెకరాలు హాంఫట్
[ 02-06-2024]
ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కాజేద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. పోరంబోకు భూములు, వంకలు, చెరువులను యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నా...సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. -
ప్రభుత్వ కళాశాలలో 60 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 60 మంది విద్యార్థులకు అధ్యాపకులు రుసుము చెల్లించి ఆదర్శంగా నిలవనున్నారు. -
ఏఎంసీలో మరణాల శాతం తగ్గించేలా చర్యలు
[ 02-06-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో మరణాల శాతం తగ్గించడమే వైద్యుల లక్ష్యం కావాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. -
డిగ్రీ పరీక్షలో 26 మంది డిబార్
[ 02-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన 26 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు వీసీ సుధీర్ ప్రేమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..