కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు రూ.3.8 కోట్లు స్వాధీనం
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 15న ధారూర్లో పత్రాలు, ఆధారాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న 29 తులాల బంగారం, 3 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఇవే కాదు.. ఇలాంటివి తరచూ వెలుగుచూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16 నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిబంధనలు పక్కాగా అమలుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. అక్రమంగా మద్యం, నగదు వివిధ ప్రాంతాలకు చేరకుండా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చి కట్టడికి అడుగేశారు. ఎన్నికలు పారదర్శకంగా సాగేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
న్యూస్టుడే, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి అర్బన్, సంగారెడ్డి టౌన్, వికారాబాద్: ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి. ఆయా చోట్ల పోలీసులు ప్రతి వాహనాన్ని పరిశీలించి పంపిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. వాటిని కలెక్టరేట్కు అనుసంధానం చేశారు. తద్వారా పర్యవేక్షణ సులభమవుతోంది.
రూ.50 వేలకు మించొద్దు
నిబంధనల ప్రకారం రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దు. అంతకుమించితే కచ్చితంగా రసీదులు, పత్రాలు కలిగిఉండాలి. లేదంటే స్వాధీనం చేసుకుంటారు. రూ.10 లక్షలకు పైగా ఉంటే ఆర్వోకు సమాచారం ఇస్తారు. ఆదాయపు పన్ను శాఖకు విషయం చేరుతుంది. ఆధారాలు లేనిపక్షంలో తర్వాత నగదు తిరిగి పొందాలనుకుంటే ఎంసీఎంసీ కమిటీని ఆశ్రయించాలి.
ఒప్పంద పత్రాలు
భూముల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తనిఖీ అధికారులకు రిజిస్ట్రేషన్, ఒప్పంద పత్రాలు చూపించాల్సి ఉంటుంది. కుటుంబంలో వివాహం, వైద్యం, వ్యవసాయం, ఇతర అవసరాల నిమిత్తం నిర్దేశిత మొత్తం దాటితే సంబంధిత వివరాలు, బిల్లులు చూపాలి. పెద్దమొత్తమైతే ఆదాయ పన్ను శాఖ అడిగిన పత్రాలు సమర్పించాలి.
మద్యం సరఫరా చేసినా..
ఓ వ్యక్తి ఆరు 750 ఎంఎల్ పరిమాణం కలిగిన మద్యం సీసాలు లేదంటే 12 ఆఫ్ బాటిళ్లు లేదా 24 క్వార్టర్లు తీసుకెళ్లవచ్చు. 30 ఎంఎల్ మద్యం సీసాలైతే 48 సీసాల వరకు ఫర్వాలేదు. ఆయా వాటితో పాటు 12 బీర్లను తీసుకెళ్లేందుకు అభ్యంతరాలు ఉండవు. అధికారులు ఆరా తీసినప్పుడు తగిన కారణం చెప్పాల్సి ఉంటుంది. అంతకుమించితే ఆబ్కారీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. మద్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. విదేశాల నుంచి వచ్చే వారైతే రెండు లీటర్ల వరకు అనుమతి ఉంటుంది. దానికి రసీదు తప్పనిసరి. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క సీసా అనుమతి ఉండదు.
గ్రీవెన్స్ కమిటీ..
రైతులు ధాన్యం, జొన్నలు, వివాహాలు, ఇతర అవసరాలకు డబ్బు తరలించినప్పుడు సరైన పత్రాలు ఉండాలి. లేదంటే అధికారులకు అప్పగిస్తారు. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నాలుగు జిల్లాల్లోని కలెక్టరేట్లలో గ్రీవెన్స్ కమిటీలను నియమించారు. బాధితులు 24 గంటల్లోపు ఆ కమిటీకి సరైన పత్రాలు సమర్పిస్తే వాటిని పరిశీలించి 48 గంటల్లోగా తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 60 కేసులు నమోదవగా, 44 మందికి రూ.99 లక్షల మేర తిరిగి చెల్లించేశారు.
పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద తనిఖీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!