సందడిగా నామపత్రాల దాఖలు
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు.
సందడిగా నామపత్రాల దాఖలు
మెదక్, న్యూస్టుడే: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. నర్సాపూర్, పటాన్చెరు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మహిపాల్రెడ్డి, మెదక్ జడ్పీ అధ్యక్షురాలు హేమలత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భట్టి జగపతితో కలిసి ఒక సెట్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి మరో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకురాలు సుహాసినిరెడ్డితో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు రమేశ్, ప్రదీప్కుమార్, ఆంజనేయులు, నరహరి, భానుచందర్, యుగతులసీ పార్టీ అభ్యర్థి అనిల్ మొదటి సెట్ నామినేషన్ వేయగా, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్, విముక్తి చిరుతల కక్షి పార్టీ అభ్యర్థి ఎల్లయ్య, స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మినారాయణ, నవీన్ మరో సెట్ నామపత్రాలు సమర్పించారు.
ఆలోచించి ఓటు వేయండి: వెంకట్రామిరెడ్డి
నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలిచ్చిందని, బాండ్ పేపర్లను చెల్లని కాగితంగా చేసిందన్నారు. రైతులను రుణమాఫీ చేయడం లేదని, వరి పంటకు బోనస్ ఇవ్వకుండా మోసం చేస్తోందని విమర్శించారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నాగలి, ఎడ్లు, నిరుద్యోగభృతి అని మోసం చేసి, నేడు తిరిగి ఎంపీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు గుర్తించారని, ఈ ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
నేడు తుది గడువు
నామపత్రాల దాఖలుకు గురువారం తుది గడువు. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థి రఘునందన్రావు, భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేశారు. వీరితో పాటు ఆయా పార్టీల తరఫున పలువురు, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. వచ్చిన నామినేషన్లను ఈనెల 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉప సంహరణకు గడువు విధించారు.
వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సంతకం
నంగునూరు, న్యూస్టుడే: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా రూ.100 కోట్ల సొంత నిధులతో ట్రస్టును ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా సేవలు అందిస్తానని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారి పాదాల వద్ద నామపత్రాలు, పార్టీ బీఫాం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకాలు చేశారు. జడ్పీ ఛైర్పర్సన్ రోజాశర్మ, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..