Priyanka Gandhi: ఇందిరమ్మను తలపించె.. మాటలతో మురిపించె..!
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం భువనగిరిలో నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నిండింది.
సభలో అభివాదం చేస్తున్న ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం భువనగిరిలో నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నిండింది. ప్రియాంకగాంధీని చూసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మహిళలు, ప్రజలు తరలివచ్చారు. ప్రియాంకగాంధీ జై బోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దొరల పాలనకు స్వస్తిపలికి, ప్రజల పాలన కోసం కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను భారాస మోసం చేస్తూ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి ఆరు గ్యారంటీలను ప్రకటించామని, తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఆరు గ్యారంటీలు అమలు పరుస్తున్నామన్నారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఎన్నడూ నోరు విప్పలేదని అన్నారు. కుంభం అనిల్కుమార్రెడ్డి ట్రిపుల్ఆర్ బాధిత రైతుల పక్షాన, బస్వాపురం భూనిర్వాసితుల పక్షాన పోరాటం చేశారని గుర్తుచేశారు. పోల్ మేనేజ్మెంట్లో భాగంగా భారాస ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని, తెలంగాణ ప్రజలు ఎన్నడూ అమ్ముడు పోరని, ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడుతారన్నారు. సభలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి, కర్ణాటక మంత్రి టి.శివరాజ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్కుమార్, సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్, నాయకులు బర్రె జహంగీర్, బెండె శ్రీకాంత్, మహ్మద్ రఫియెద్దీన్, డాక్టర్ నగేష్, పిట్టల బాలరాజు, పడిగెల ప్రదీప్, గ్యాస్ చిన్న, కీర్తిరెడ్డి, వలిగొండ, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆలస్యమైనా నిరీక్షించిన ప్రజలు
ప్రియాంకగాంధీ సభాస్థలికి గంట 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినప్పటికి ప్రజలు ఓపికగా నిరీక్షించారు. హెలిప్యాడ్కు మధ్యాహ్నం 12.38కి చేరుకున్న ప్రియాంక నేరుగా 12.43 గంటలకు సభావేదికకు చేరుకున్నారు. 37 నిమిషాల పాటు ఆమె సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఆమె ప్రసంగాన్ని పార్టీ అనుబంధ కమిటీ కన్వీనర్ పవన్ మల్లాది అనువాదం చేశారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అని నినదించిన ప్రియాంకను సభా స్థలిలోని జనం అనుకరించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రజలతో సభాస్థలి కిటకిటలాడింది. స్థలం చాలక పలు మార్గాల్లో వస్తున్న ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. మహిళలు నృత్యాలు, పార్టీ జెండాల రెపరెపలతో సభాస్థలి సందడిగా మారింది. ఇందిరమ్మ మనవరాలు అంటూ ప్రియాంకను వృద్ధులు ఆసక్తిగా చూశారు.
సభకు హాజరైన ప్రజలు
రైతులకు సంకెళ్లు వేసిన భారాస ప్రభుత్వం
కుంభం అనిల్కుమార్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి
ట్రిపుల్ఆర్ బాధితులకు భారాస ప్రభుత్వం సంకెళ్లు వేసింది. బస్వాపూర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు, కరోనా బాధితులకు కాంగ్రెస్ పక్షాన అండగా నిలిచాను. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాను. ఓటర్లను డబ్బులతో కొనేందుకు భారాస ప్రయత్నిస్తోంది. డబ్బులు తీసుకుని తనకు ఓటు వేసి గెలిపించండి. పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మూసీ కాలుష్యం నియంత్రణకు, మూసీనదిపై రాకపోకలకు జూలూరు, సంగెం, ఇంద్రియాలలో వంతెనలు నిర్మిస్తాం. భువనగిరిలో డిగ్రీ కళాశాల, బస్సులు భువనగిరి బస్టేషన్ నుంచి ప్రయాణించే విధంగా చర్యలు చేపడ్తా. సాగునీటి కాలువలను పూర్తి చేస్తాం. పోరాటాల, చైతన్యం కలిగిన భువనగిరి గడ్డ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?