గాడితప్పిన గస్తీ
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.
పెరిగిన చోరీలు.. భయాందోళనలో ప్రజలు
రాయగిరిలో గొలుసు దొంగతనంపై పోలీసుల విచారణ
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు చైన్స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తుండటంతో జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో మూడు డివిజన్లు, పదిహేడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. చోరులను పట్టుకునేందుకు జిల్లా కేంద్రంగా సీసీఎస్ పోలీస్ స్టేషన్, భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సొత్తు కేసుల ఛేదనకు ప్రత్యేక క్రైం, క్లూస్ బృందాలు ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో గస్తీ కోసం పెట్రో మొబైల్, బ్లూకోల్ట్స్ బృందాలు ఉన్నా చోరీలు ఆగడం లేదు. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో జిల్లాలో చెక్పోస్టులు వద్ద పోలీసుల పహారాకు చిక్కకుండా వెళ్తున్నారు.
దొరకకుండా..ఆధారం చిక్కకుండా..
గొలుసు దొంగతనాల్లో పెద్దగా ఆధారాలు లభ్యం కావడం లేదు. ఘటన ప్రాంతాల్లో కీలకమైన ఆధారాలు, వస్తువులు లభించడం లేదు. చైన్స్నాచింగ్కు పాల్పడుతున్న దొంగతనాల్లో కొత్త ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన చోరులకు సంబంధించిన వివరాలను సేకరించి దొరికిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో కొంతమంది పాతనేరస్థుల పాత్రపై విచారణ చేసినా వారు కాదని తేలింది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలపై పోలీసులు ఆధారపడ్డారు. చాలా చోట్ల సీసీ కెమెరాల నిర్వహణ లేకపోవడంతో పోలీసులు కేసులు ఛేదించలేకపోతున్నారు. నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టతరంగా మారింది. కొన్ని కేసుల్లో నిందితులను గుర్తించి పక్కా ఆధారాలు సేకరించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
రాత్రి వేళలో నిఘా పటిష్ఠం చేశాం
-ఎం.రాజేష్చంద్ర, డీసీపీ, యాదాద్రిభువనగిరి
చోరీల నియంత్రణకు రాత్రి వేళలో నిఘా బృందాలను పటిష్ఠం చేశాం. నమోదైన కేసులను ఛేదించేందుకు దొరికిన ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు బృందాలు పనిచేస్తున్నాయి. ప్రజల పోలీసులకు సహకరించాలి. రాత్రి వేళలో ఆరుబయట నిద్రించేవారు నిర్లక్ష్యంగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులు స్వచ్ఛందంగా తమ గ్రామాల భద్రతపై బాధ్యతగా వ్యవహరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.