జీవితంలో పాస్ అవుదాం..!
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో..
వైద్యారోగ్యశాఖ అధికారులు రూపొందించిన ఆత్మహత్యల నివారణ కరపత్రం నమూనా
- అక్షరం చదవని పుల్లారెడ్డి ‘పుల్లారెడ్డి నేతి మిఠాయిల’ పేరుతో వ్యాపారం ప్రారంభించి దేశవిదేశాల్లో గొప్ప పేరు సాధించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
- ఇంటర్లో ఫెయిలై ఏడాది ఖాళీగా ఉండి ఆ తరువాత కష్టపడి చదివి పోలీసుశాఖలో చేరి డీఎస్పీగా పనిచేశారు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి.
- ఆంగ్లంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పదేళ్లు హైదరాబాద్లో ఆటోనడిపి.. ఆ తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించారు మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి.
మిర్యాలగూడ, న్యూస్టుడే: పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ‘జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం’ ప్రారంభించారు. విద్యార్థులకు పరీక్షల ఫలితాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపడుతున్నారు. మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారు నేరుగా టోల్ఫ్రీ నెంబరు 14416కు ఫోన్ చేస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య అధికారులు, కౌన్సిలర్లు వారిలో ఆత్మస్థైర్యం కల్పించి మనోధైర్యం పెంపొందేలా చూస్తున్నారు. ‘ చదువే జీవితం కాదు.. జీవితమే శాశ్వతం’ అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తూ ‘పరీక్షల్లో పాస్ కావడం కాదు.. జీవితంలో పాస్ అవ్వాలి’ అంటూ తెలియజేస్తారు.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమంపై కరపత్రాలు రూపొందించి ప్రచారం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని పరీక్షల్లో మార్కులు, గ్రేడ్ల పేరిట మానసిక ఒత్తిడికి గురిచేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అవుతారని విద్యార్థులను భయపెట్టరాదని, ఓటమి గెలుపునకు తొలిమెట్టు అవుతుందని ధైర్యం చెప్పాలని తెలియజేస్తున్నారు.
మార్కులే కొలమానం కాదు..
కల్యాణ్చక్రవర్తి, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి, సూర్యాపేట
విద్యార్థులకు పరీక్షల్లో మార్కులు, ఫలితాలే కొలమానంగా తల్లిదండ్రులు భావించరాదు. పదోతరగతి, ఇంటర్ ఫెయిలై గొప్పస్థాయికి చేరుకున్న వారి గురించి తమ పిల్లలకు వివరించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఆత్మహత్య ఆలోచనలు వారి మనసులోంచి తొలగుతాయి. ప్రత్యేకంగా కరపత్రాలతో ప్రచారం చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..