logo

పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు

భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ  సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు.

Published : 29 Apr 2024 13:49 IST

భువనగిరి: భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ  సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. పోటీలో ఉండి కమ్యూనిస్టుల సత్తా ఏంటో చాటుతామని ఆయన స్పష్టం చేశారు. తమ ఏకైక లక్ష్యం మతతత్వ భాజపా పార్టీని ఓడించడమే అన్నారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ఒత్తిడి తెస్తామన్నారు. మిగిలిన 16 లోకసభ స్థానాలలో ఇండియా కూటమి సభ్యులకు మద్దతు ఇస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హామీలను ప్రజలకు పట్టుబట్టి అందించేందుకు కమ్యూనిస్టులుగా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ప్రజల కోసం పోరాటం చేసి పార్టీ సీపీఎం పార్టీ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని