‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు.
బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ
మిర్యాలగూడ, న్యూస్టుడే: మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. అన్ని సబ్జెక్టులపై సమగ్ర పట్టు సాధించేందుకు పాఠ్యపుస్తకాలు చదివినట్లు అద్విత్ కృష్ణ తెలిపారు. కళాశాలలో అధ్యాపకుల సూచనలతో ప్రతిరోజు 10 గంటలకు పైగా చదివినట్లు తెలిపారు. నీట్ సాధించి డాక్టర్ అవ్వాలనేది తన లక్ష్యమని అద్విత్ కృష్ణ తెలిపాడు.
జాహ్నవిరెడ్డికి 574 ర్యాంకు
మాడ్గులపల్లి: మండలంలోని ఇందుగుల గ్రామానికి చెందిన కల్లు జాహ్నవిరెడ్డికి టీఎస్ ఈఏపీసెట్లో 574వ ర్యాంకు లభించింది. అంతకు ముందు నిర్వహించిన జేఈఈ మెయిన్స్లో 1237వ ర్యాంకు సాధించింది. ఇదే నెలల నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు లభిస్తే ఐఐటీ లేదంటే, ఇంజినీరింగ్ విభాగంలో చేరాలనేది లక్ష్యం. ఇంటర్ నారాయణ కళాశాల హైదరాబాదులో చదివానని, తన విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని జాహ్నవిరెడ్డి తెలిపారు.
కల్లు జాహ్నవిరెడ్డి
142వ ర్యాంకు సాధించిన వెన్నెల
రామన్నపేట: వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల వెన్నెల టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ప్రతిభను చాటింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో వెన్నెల అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 142వ ర్యాంకు సాధించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కూరెళ్ల భిక్షమాచారి, కవిత దంపతుల కుమార్తె వెన్నెల. బాల్యం నుంచి చదువులో ప్రతిభను చాటుతోంది. చౌటుప్పల్లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఎస్సెస్సీ వరకు, హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ప్రతిభను చాటిన వెన్నెలను పలువురు అభినందించారు.
కూరెళ్ల వెన్నెల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి
[ 02-06-2024]
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హన్మంత్ కే జండగే మీడియా సమావేశం నిర్వహించారు. -
పదేళ్లుగా.. ఈ నేలలో..!
[ 02-06-2024]
స్వరాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దకాలం గడిచిపోయింది. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని భారాస ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు పాలించగా.. -
నకిలీ విత్తనాల విక్రయాలకు కట్టడి
[ 02-06-2024]
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసి అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
పల్లె ప్రగతిపై ఆరా..!
[ 02-06-2024]
గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరుతో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
బంధాలను అల్లుదాం.. రండి..!
[ 02-06-2024]
వేసవి సెలవులు.. పిల్లలు ఇంటి పట్టున ఉండే సమయం ఇది. సెలవుల్లో వారిని ఆటాపాటకు వదిలి పెట్టడమే సరిపోదు.. వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కోసం సమయం కేటాయించాల్సిన తరుణం ఇదేనని తల్లిదండ్రులు గుర్తించాలి. -
లక్ష్మణ్, పద్మ సమేత.. రామచిలుక
[ 02-06-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటకు చెందిన గౌటె లక్ష్మణ్, పద్మ దంపతులది ప్రత్యేకశైలి. వీరికి రామచిలుకలంటే అమితమైన భక్తి, శ్రద్ధ. ఏడేళ్లక్రితం వ్యాపారపరంగా తిరుగుతున్న క్రమంలో లక్ష్మణ్కు రంగురంగుల చిలుకలు కనిపించాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28)ని టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు డానియేల్, శ్రీనివాస్తో కలిసి టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాళ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. -
ప్రభుత్వ బడికి డిజిటల్ హంగులు
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. -
గేదెను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడి దుర్మరణం
[ 02-06-2024]
ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, మరొక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు