వైకాపా ‘మందు’చూపు
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది..
కాకాణి గోవర్ధన్రెడ్డి ఇలాకాలో భారీగా మద్యం డంపులు
అక్రమంగా దాచిపెట్టి.. అడ్డంగా దొరికిన అధికార పార్టీ నాయకులు
విరువూరులోని వైకాపా నాయకుడి రైస్మిల్లు నుంచి మద్యం పెట్టెలు స్వాధీనం చేసుకుంటున్న సెబ్, పోలీసు అధికారులు
ఈనాడు, నెల్లూరు : నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. వేలాది మద్యం సీసాలు ఒకే చోట ఎలా డంప్ చేస్తున్నారు? అవి ఎక్కడి నుంచి వచ్చాయ్? అసలు ఆ సీసాల్లో ఉన్నది నిజమైన మద్యమేనా? ఒకటి, రెండు సీసాలు దొరికితేనే హడావుడి చేసే పోలీసులు, సెబ్ అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారు? ఫిర్యాదు అందుకుని ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అక్కడికి వెళ్లేలోపే వారికి సమాచారం ఎవరిస్తున్నారు? రూ. లక్షల విలువైన సరకు ఒక చోట దొరికితే కనీస విచారణ చేయకుండా.. కేసులు కట్టి చేతులు దులుపుకోవడంలోఆంతర్యమేమిటి? ఇవీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నియోజకవర్గంలో భారీగా లభ్యమైన మద్యం సీసాల గుట్టు విప్పకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తలెత్తుతున్న ప్రశ్నలు..
వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. దాంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సామదాన దండోపాయాలు వినియోగిస్తున్నారు. ఓ వైపు నోట్ల కట్టలను సిద్ధం చేస్తూనే.. మరోవైపు మద్యం సీసాలు డంప్ చేస్తున్నారు. అయిదేళ్లలో అక్రమంగా దోచుకున్న సొమ్మును.. మళ్లీ అధికారం సాధించడం కోసం విచ్చవిడిగా ఖర్చు చేసేందుకు సంసిద్ధులయ్యారు. ఎన్నికల సమయంలో అనుచరులతో పాటు ఓటర్లు, ప్రచార కూలీలకు మద్యం ఎరగా వేయడానికి ఉర్రూతలూగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో అడపాదడపా దొరికే సీసాలు ఒక ఎత్తయితే.. వారం రోజుల వ్యవధిలో సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమైన భారీ డంప్లే అధికార పార్టీ నాయకుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి తెచ్చిన సరకును ఇలా దాచిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తుండగా.. నేరుగా డిపోల నుంచి కూడా తెచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
విచారిస్తేనా? నిగ్గుతేల్చేనా?
2014 ఎన్నికల సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు కల్తీ మద్యం సరఫరా చేశారు. దాని కాటుకు ఏడుగురు చనిపోగా- పలువురు ఆసుపత్రుల పాలయ్యారు. ఆ కేసుల్లో నిందితులు.. ఇప్పుడూ బరిలో ఉన్నారు. ఆ నేపథ్యంలో భారీగా మద్యం సీసాలు దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పంటపాళెంలో 4,232, బుధవారం విరువూరులో లభ్యమైన 2,649 సీసాలు వైకాపా నాయకులైన సుధాకర్రెడ్డి, రాజగోపాల్రెడ్డిల దగ్గరే దొరికాయి. ఇదంతా సరేలే అనుకున్నా.. అసలు ఆ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో నిజానిజాలు వెలికి తీయలేకపోతున్నారు. ఆ సీసాలపై ఉన్న కోడ్ను స్కాన్ చేస్తే.. దాని చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. సంబంధిత అధికారులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో ఆ సీసాల్లో ఉన్నది కల్తీదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు, సెబ్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే సూత్రధారులను తప్పించేందుకు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం దృష్టిసారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రజల కోరుతున్నారు.
దుకాణాల్లో.. విధేయులే!
జిల్లాలో మొత్తం 193 మద్యం దుకాణాలు ఉండగా- ఒక్కో చోట సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మెన్లు పనిచేస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ శాతం వైకాపా విధేయులే కావడం గమనార్హం. గతంలో వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారినే ఆబ్కారీశాఖ అధికారులు ఎంపిక చేశారు. ఆ నేపథ్యంలోనే కొందరు సూపర్ వైజర్లు, సేల్స్మెన్లు కృతజ్ఞతాభావంతో వైకాపా నాయకులకు పరిమితికి మించి విక్రయిస్తున్నారు. దుకాణాల వద్దకు వచ్చే మందుబాబులకు స్టాక్లేదని చెప్పి వెనక్కు పంపుతున్నారు. అధికార పార్టీ నాయకుల జోక్యంతో.. ఆబ్కారీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయకేతన.. జయదీవెన
[ 04-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్కల్యాణ్లు నిర్వహించిన రోడ్షో, ప్రజాగళం సభకు ప్రజలు పోటెత్తారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ అధినేతలకు ఘనస్వాగతం పలికారు. -
అయిదేళ్ల పాలన.. మూడుసార్లు వడ్డన!
[ 04-05-2024]
నేనున్నాను.. నే విన్నానని పదేపదే చెప్పి.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఆర్టీసీ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. గత ప్రభుత్వంపై నానా యాగీ చేసి పీఠమెక్కిన ముఖ్యమంత్రి.. వైకాపా అయిదేళ్ల పాలనలో మూడుసార్లు ఛార్జీలు పెంచారు. -
అదేతీరు.. పండుటాకుల కన్నీరు
[ 04-05-2024]
బ్యాంకుకు వెళ్లిన తర్వాత పాన్కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకొస్తే నగదు డ్రా చేసుకోవచ్చన్నారు. ఎండలో నకలు కాపీల కోసం ప్రదక్షిణలు చేశాం. నాలుగేళ్లుగా ఖాతా లావాదేవీలు నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెప్పారు. పింఛను అందక నిరాశ చెందా. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 85 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. -
నేడు సీఎం జగన్ పర్యటన
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ శనివారం నెల్లూరుకు రానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చాపర్లో వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకుని.. 3.10 గంటలకు రోడ్షో నిర్వహించనున్నారు. -
మాటల్లో ప్రేమ.. చేతల్లో ఏదయ!
[ 04-05-2024]
ఎస్సీ.. ఎస్టీలపై ప్రేమ ఒలకబోసిన జగన్.. ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతిపై విషం కక్కారు. తెదేపా పాలనలో వెలుగు వెలిగిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. అయిదేళ్ల పాలనలో కార్పొరేషన్కు పైసా విదల్చని జగన్.. ఎన్నికల వేళ ఆయా సామాజిక వర్గాల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. -
సోమశిల నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకొస్తాం
[ 04-05-2024]
రాళ్లపాడు జలాశయానికి సోమశిల ప్రాజెక్టు నుంచి ఏటా రావాల్సిన 1.5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి అన్నదాతను ఆదుకుంటామని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. -
వైకాపా ప్రచారంలో వీవోఏ, ఉపాధ్యాయుడు
[ 04-05-2024]
వరికుంటపాడు మండలం ధర్మవరంలో శుక్రవారం వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ప్రచారంలో నార్తుకొండాయపాలెం వీవోఏ జె.అనూష పాల్గొన్నారు. అభ్యర్థికి గజమాల వేసి ప్రచారంలో పాల్గొన్నారు. -
జగన్ పాలన.. వేతన జీవులకు వెత
[ 04-05-2024]
జగన్ పాలనలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ప్రతి నెలా జీతం సకాలంలో అందక ఆర్థికంగా అవస్థ పడుతున్నారు. జీతం ఎప్పుడొస్తుందోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్
[ 04-05-2024]
పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో శుక్రవారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్స్ నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణను పరిశీలించారు. -
అభి సుజుకి నూతన షోరూం ప్రారంభం
[ 04-05-2024]
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో అభి సుజుకి రెండో షోరూంను శుక్రవారం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ జోనల్ సర్వీస్ మేనేజర్ వెంకటేషన్ ప్రారంభించారు. -
రైతు నేస్తమన్నావ్.. కన్నీరు నింపావ్!
[ 04-05-2024]
రైతు నేస్తమన్నావు.. అండగా నిలుస్తానన్నావ్.. వారి క్షేమమే ప్రాధాన్యమని ముఖ్యమంత్రి జగన్ నమ్మించారు. వారి కష్టాలు మాత్రం పట్టించుకోలేదు. పంటలు పండించే మార్గాలను గాలికొదిలేశారు. పొలాలకు నీరు అందించే కాలువల నిర్వహణ అయిదేళ్లుగా మరిచిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..