ప్రత్యర్థులపై కేసులు: కృష్ణారెడ్డి
ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తన ప్రత్యర్థులిద్దరిపై పలు కేసులున్నాయని తెదేపా కావలి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి వెల్లడించారు.
కొండాపురం: మహిళలను ఓటు అడుగుతున్న సురేష్
కావలి, న్యూస్టుడే: ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తన ప్రత్యర్థులిద్దరిపై పలు కేసులున్నాయని తెదేపా కావలి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అఫిడవిట్ ప్రతులను అందజేశారు. నకిలీ మద్యంతోపాటు మోసం, కుట్ర తదితర ఏడు కేసులు ఎమ్మెల్యేపై ఉన్నాయన్నారు. స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్పై ఎనిమిది కేసులున్నాయన్నారు.భాజపా నాయకులు కందుకూరి సత్యనారాయణ, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, మండల కమిటీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెదేపా దివ్యాంగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. వెంకట్రావు కావలి మండలంలోని కొత్తసత్రంలో ప్రచారం నిర్వహించారు.
ఉదయగిరి అభివృద్ధికి ప్రాధాన్యం: కాకర్ల సురేష్
కొండాపురం : తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. మండలలోని గరిమెనపెంట, ఇస్కదామెర్ల, తూర్పుఎర్రబల్లి, చింతలదేవి పంచాయతీల్లో శనివారం ప్రచారం చేశారు. కంభం విజయరామిరెడ్డి, యారవ కృష్ణయ్య, మామిళ్లపల్లి ఓంకార్, కామేపల్లి సుబ్బారావు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడును తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.చెంచలబాబుయాదవ్ శనివారం కలిశారు. ఆత్మకూరు వచ్చిన చంద్రబాబునాయుడుని హెలిప్యాడ్ వద్ద కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. దుత్తలూరు: దుత్తలూరులో బొందల రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంభం విజయరామిరెడ్డి, అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరాయి.
తెదేపాలో చేరికలు
పార్టీలో చేరిన హ్యాపీబాషా తదితరులతో ఇంటూరి
కందుకూరుపట్టణం: పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు షేక్ హ్యాపీబాషాతోపాటు మరికొందరు ముస్లింలు, బృందావనం కాలనీకి చెందిన పలువురు వైకాపా నేతలు పార్టీలో చేరారు. వైకాపా జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి సుదర్శి శ్యామ్, జంగాల వెంకట్రావు, పాలేటి కరుణాకర్, సత్యనారాయణ, కట్టా వెంకటనారాయణ, సురేష్, అజయ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎం. మురళీ, పెట్లూరి సుబ్బారావు, ఆర్.వెంకటేశ్వర్లు, ఎన్.రాధాకృష్ణ, పి.వెంకట్రావు పాల్గొన్నారు.
గుడ్లూరు : మండలంలోని దప్పళంపాడు, మొగళ్లూరు, చినలాటరపిలో తెదేపా నియోజకవర్గ అభ్యర్థి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. కందుకూరు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో గోడపత్రాలను ఆవిష్కరించారు. వింగ్ నియోజకవర్గ బాధ్యురాలు పువ్వాడి మౌనిక, సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల బాధ్యులు నాగరాజు, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, సూర్యం, హరిబాబు, బుల్లెయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపై జగన్ బాదుడు!
[ 11-05-2024]
ప్రతిపక్ష హోదాలో ఊరూరా తిరుగుతూ.. ధరలు, పన్నులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే వాటిని రెట్టింపు చేశారు. -
పేదల జాగాల్లో భూచోళ్లు
[ 11-05-2024]
వెంకటాచలం మండలం చౌటపాళెం పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 1062, 1063లో యర్రగుంట వద్ద వేసిన లేఅవుట్లో తొలుత యర్రగుంట, చౌటపాళెం గ్రామాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో భయం భయం!
[ 11-05-2024]
జిల్లాలో కీలక సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, తదితర భవనాల నిర్వహణను యంత్రాంగం పూర్తిగా గాలికొదిలేసింది. -
గుంతలు.. గంతలు
[ 11-05-2024]
రహదారులు అభివృద్ధి చేశామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. అయిదేళ్లలో చాలావరకు కనీసం మరమ్మతులు చేపట్టలేదు. కొన్నింటికి తట్టమట్టి పోసిన దాఖలాలు లేవు. -
రంగు మార్తాండ.. ప్రచార యావ
[ 11-05-2024]
గ్రామాల్లో సక్రమంగా మురుగు కాలువలు లేవు. వాటిని శుభ్రం చేయించడానికి సొమ్ములు లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. -
ఇచ్చేది గోరంత... వసూలు కొండంత
[ 11-05-2024]
‘అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని జగన్ చెప్పిన మాటలను నమ్మినందుకు నట్టేట ముంచారు. నవరత్నాలు కాదు.. -
ముస్లిం రిజర్వేషన్లు ఆపాలని యత్నించారు: ఆనం
[ 11-05-2024]
ముస్లిం రిజర్వేషన్లు ఆపాలంటూ కోర్టుకెళ్లిన ఆర్.కృష్ణయ్యని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎం.పి.గా చేశారని ఆత్మకూరు తెదేపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. -
మూడు రోజుల్లో సర్వేపల్లికి కాకాణి నుంచి విముక్తి
[ 11-05-2024]
మరో మూడు రోజుల్లో మంత్రి కాకాణి అరాచక పాలన నుంచి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు విముక్తి పొందనున్నారని తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 11-05-2024]
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని తెదేపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. -
12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
[ 11-05-2024]
ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వరి ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు