ఇంటింటికీ ఇచ్చేందుకు ఇబ్బందేంటి జగన్!
సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది.
ఒకే వీధిలో ఒకరిద్దరికి ఇచ్చి.. మిగిలిన వారికి ఇవ్వకపోవడంపై అభ్యంతరం
ఓట్ల కోసం తమను అవస్థలు పెట్టడమేమిటంటూ పింఛనుదారుల ఆవేదన
సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది. గత నెలలో సచివాలయాల దగ్గరకు వెళ్లి తీసుకునేందుకే నానా అవస్థలు పడిన పింఛనుదారులను.. ఈ సారి ఏకంగా కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుల చుట్టూ తిప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఒక వీధిలో పది పింఛన్లు ఉంటే.. కేవలం ఒకరిద్దరికి ఇచ్చేందుకే సిబ్బందిని పంపిస్తోంది. పండుటాకులకు ఆసరాగా ఉండే సొమ్మును ఆలస్యం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. సరిపడా సిబ్బంది ఉన్నా.. వారికేం పనులు లేకున్నా.. ప్రతిపక్షాలపై బురద జల్లుతూ.. ఓట్ల కోసం అభాగ్యల ప్రాణాలతో వైకాపా ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.
ఈనాడు, నెల్లూరు: జిల్లాలో 768 గ్రామ, వార్డు సచివాయాలు ఉండగా- వీటి పరిధిలో మొత్తం 3.15 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో 79,734 మందికి మాత్రమే ఇంటింటికీ అందజేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో 6,800 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీరందరితో పంపిణీ చేయిస్తే.. రెండు రోజుల్లోనే అందరికీ పూర్తి చేయవచ్చు. అయినా అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. మిగిలిన వారందరికీ డీబీటీ(డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్) విధానంలో మే నెల పింఛను విడుదల చేయనున్నారు. ఆ సొమ్ము లబ్ధిదారుల ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు జమకానుంది. ఇప్పటికే డీబీటీ విధానంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సొమ్ము కొందరికి సక్రమంగా అందక.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆ క్రమంలో పింఛను సొమ్ముకు కూడా తమకు పాట్లు తప్పేలా లేవని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జమ సరే.. తీసుకోవడం ఎలా?
జిల్లాలో బ్యాంకులకు వెళ్లి.. నగదు తీసుకోవాల్సిన వారు 2.35 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ.. అవన్నీ పాతవే. కొందరివి మనుగడలో ఉన్నాయో లేదో.. చాలా మందికి తెలియదు. ఈకేవైసీ కాకపోవడం.. సున్నా నిల్వలు.. వీటిల్లో ఏ సమస్య ఉన్నా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు. పైగా ఆధార్ లింకైన బ్యాంకుకే నగదు వెళ్లే అవకాశం ఉండటంతో.. రెండు, మూడు ఖాతాలున్న వారు ఎందులో జమైందో తెలియక గందరగోళానికి గురవుతారు. నెల్లూరుకు చెందిన రహీం అనే వృద్ధుడికి మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అన్నింటికీ ఆధార్ అనుసంధానమైంది. ఏ ఖాతాలో డబ్బులు పడుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎందులో జమైందో తెలుసుకునేందుకు మళ్లీ సచివాలయానికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు.
ప్రతిపక్షాలపై నెపం నెట్టేందుకు కుట్ర
మే ఒకటో తేదీ మేడే. సెలవు కావడంతో.. అందరూ రెండో తేదీ బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారులంతా బ్యాంకులకు వెళ్లినా.. నగదు చెల్లించే అవకాశం లేదు. ఫారంలో వివరాలు నమోదు చేసి క్లర్క్కు ఇస్తే.. వాటిని ఆన్లైన్లో చెక్ చేసి.. ఆ ఖాతాలో నగదు ఉంటే చెల్లింపులు జరుగుతాయి. ప్రతి ఖాతాదారుడికి ఇచ్చేందుకు 10 నిమిషాలైనా పడుతుంది. ఈ లెక్కన ఉదయం పది గంటలకు బ్యాంకు తెరిచినా.. పనివేళలు ముగిసే సమయానికి 30 నుంచి 40 కంటే ఎక్కువ మందికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి మండల కేంద్రాల్లోని బ్యాంకుల్లోనే ఖాతాలు ఉంటాయి. వారందరికీ ఇచ్చేందుకు సరిపడా నగదు నిల్వలు అక్కడ అందుబాటులో ఉండవు. దీంతో ఒక్కో లబ్ధిదారుడు రెండు, మూడు సార్లు తిరగాల్సి వస్తుంది. వెంకటాచలం మండలంలో మొత్తం 8,916 మంది లబ్ధిదారులు ఉండగా.. 2,221 మందికి ఇళ్లకు ఇస్తున్నారు. మిగిలిన వారిలో సుమారు నాలుగు వేల మంది పింఛను సొమ్ముకు మండల కేంద్రానికి రావాల్సిందే. ఇదంతా పండుటాకులను పలుమార్లు తిప్పడంతో పాటు మండుటెండలో చిత్రహింసలు పెట్టేందుకు వైకాపా పన్నాగం పన్ని.. ఆ తప్పును ప్రతిపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
గత నెలతో పోల్చితే తగ్గుదల
ఏప్రిల్లో 3,16,492 మందికి రూ. 95 కోట్లు విడుదలైంది. మే నెలకు సంబంధించి 3,15,423 మందికే అందజేయనున్నారు. 1,069 మందికి తగ్గించారు. ఇందుకు కారణాలు తెలియలేదు.
అంత దూరమొచ్చి.. కొందరికేనా!
గుడ్లూరు: మండలంలో అత్యధిక ఆవాసాలున్న సచివాలయం చినలాటరపి పంచాయతీ. దీని పరిధిలో జానకంపేట, ఆర్సీ అగ్రహారం, పెదలాటరపి గ్రామాలు ఉండగా- పింఛన్లు 344 ఉన్నాయి. వీటిలో 181 మందికి ఇంటికి వెళ్లి ఇవ్వనున్నారు. మిగిలినవారంతా సుమారు 8 కి.మీ. దూరంలోని గుడ్లూరుకు రావాల్సి ఉంది. సచివాలయంలో మొత్తం పది మంది పనిచేస్తుండగా.. వీరికి పంపిణీ బాధ్యత అప్పగిస్తే ఒక్కొక్కరికి 34 చొప్పున వస్తాయి. ఇప్పటికే వీరిలో ఒక్కొక్కరు పది మందికి చొప్పున ఇళ్లకు ఇస్తున్నారు. అక్కడి వరకు వెళ్లిన సిబ్బంది.. మిగిలిన వారికి ఇచ్చేందుకు ఇబ్బందేమిటో అధికారులకే తెలియాలి.
ఎటు చూసినా.. 300 మీటర్లలోపే..
అల్లూరు: అల్లూరు-1 సచివాలయంలో 8 మంది సిబ్బంది ఉండగా- దీని పరిధి ఎటు చూసినా 300 మీటర్లలోపే ఉంటుంది. మొత్తం 649 మంది పింఛనుదారులు ఉండగా.. 189 మందికి ఇళ్లకు ఇస్తున్నారు. అంటే.. ఒక్కో ఉద్యోగి సగటున 23 మంది చేతికి నగదు ఇస్తున్నారు. దీన్ని పూర్తి చేయడానికి ఒక్క రోజు కూడా పట్టదు. వారు ఇంటికి వెళ్లి ఇచ్చే వారి పక్కనే పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నా.. వారికి ఇవ్వకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పక్కింటికి వచ్చి.. నాకు లేదంటే ఎలా
- వీర రాఘవులు, చినలాటరపి
నా వయసు 64 ఏళ్లు. ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. పింఛను డబ్బుకు 8 కి.మీ. వెళ్లాల్సి వస్తోంది. నాకు చరవాణి ద్వారా తెలుసుకోవడం.. తీసుకోవడం రాదు. అధికారులు ఫోన్ చేసి బ్యాంకులో వేస్తాం.. తీసుకోమని చెబుతున్నారు. మా ఇంటికి సమీపంలోని 85 ఏళ్ల వృద్ధుడికి ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు. ఆ పక్కనే కదా మా ఇల్లు, వచ్చి ఇవ్వండయ్యా! అని అడిగితే.. కుదరదని చెబుతుండటం ఎంత వరకు సబబు. ఈ వయసులో మమ్మల్ని బ్యాంకుల చుట్టూ తిప్పేందుకే ఇలా చేస్తున్నారనిపిస్తోంది.
సచివాలయమే దగ్గర
- కె.నరసమ్మ, కందుకూరు
పింఛన్లను ఇంటికి తెచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా.. అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. గత నెలలో సచివాలయానికి పిలిపించి ఇబ్బంది పెట్టారు. కనీస సదుపాయాలు కల్పించలేదు. ఎండలో కి.మీ. వెళ్లి.. పింఛను సొమ్ము తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సారి బ్యాంకులో వేసి.. మా కష్టాలు రెట్టింపు చేశారు. ఇప్పుడు దాదాపు 2 కి.మీ. వెళ్లాల్సి వస్తోంది. అది కూడా ఉదయం పది తర్వాత.. అక్కడ ఎంత సమయం పడుతుందో.. తలచుకుంటే భయమేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటోత్సాహం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. ఓటరులో చైతన్యం వెల్లివిరిసింది. ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు.. ఉపాధి కోసం వలస వెళ్లినవారూ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. -
సైబర్ వల.. సామాన్యులు విలవిల
[ 16-05-2024]
నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామన్నది సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ. 80వేలు లాగేశారు. -
పోలింగ్పై.. వనితల ముద్ర
[ 16-05-2024]
‘జిల్లాలో పురుషులు 9,51,065 ఉండగా- ఇందులో 7,63,894 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీన్ని బట్టి సుమారు 20,325 మంది మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
క్రీడా పండగొచ్చింది
[ 16-05-2024]
వేసవి వచ్చింది.. పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రీడా శిబిరాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి జూన్ 15 వరకు వీటిని నిర్వహించనున్నారు. నగరంలోని ఏసీ మైదానంలో అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలను వేసవి శిక్షణ శిబిరాలకు ఉపయోగించుకోనున్నారు. -
నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు
[ 16-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎండలు పెరిగినా, నీటి ఎద్దడిపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా ఇన్ఛార్జి ఎస్ఈ మర్దనాలి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను బుధవారం వివరించారు. -
ఉపాధికి ఊతం.. ఐటీఐ
[ 16-05-2024]
పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యాలు తప్పనిసరి. అవి సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులను పలు సంస్థలు కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకుంటున్నాయి. -
రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే
[ 16-05-2024]
‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చాయి.. రెండు రోజులుగా వైకాపా నేతల స్వరంలో మార్పు కనిపిస్తోంది’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. -
మూగజీవాల వేదన
[ 16-05-2024]
వైకాపా పాలనలో మూగజీవాల ఆలనాపాలన ప్రమాదంలో పడింది. తెదేపా ప్రభుత్వ పాలనలో పశువులకు అందించే వివిధ రకాల పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త పథకాలు తెచ్చిందా... అంటే అదీ లేదు. -
ఓటెత్తిన చైతన్యం.. ఎవరికో అనుకూలం
[ 16-05-2024]
నియోజకవర్గంలో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందోనని అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండున్నర శాతం పెరిగింది. -
పట్టణ ప్రజలపై పన్నుపోటు
[ 16-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక నూతనంగా తీసుకొచ్చిన ఆస్తికి మార్కెట్ విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల నెత్తిన గుదిబండలా మారింది. మార్కెట్ విలువలో నిర్దేశిత శాతం చేరుకునేంత వరకు ఏటా 15 శాతం పన్ను పెంచుతుండటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
కరేడులో యువకుల ఘర్షణ
[ 16-05-2024]
కరేడులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రెండు సామాజిక వర్గాల యువకులు గొడవపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే