logo

‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు.

Published : 19 Apr 2024 05:32 IST

 సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

ధర్మారం, ధర్మపురి, న్యూస్‌టుడే : ‘నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం ధర్మపురిలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. ‘పెద్దపల్లి నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వాళ్లే ఉన్నారు. ఇక్కడ వంశీకృష్ణ గెలుపు నల్లేరుమీద నడకే. నేను వయసు పైబడిన వాడిని. కేవలం పెద్దపల్లి మాత్రమే కాకుండా పక్కనున్న నా వైపూ చూడండి. నిజామాబాద్‌ నుంచి నన్ను గెలిపిస్తేనే మిమ్మల్ని జగిత్యాలకు రానిస్తా’మంటూ నవ్వుతూ అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. నిజామాబాద్‌ నియోజకవర్గంలోని చుట్టాలు, మిత్రులకు చెప్పి జీవన్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి పని చేసిన కార్యకర్తలకే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలిస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఈ ప్రాంతాభివృద్ధికి రాష్ట్రం, కేంద్రం నుంచి విరివిగా నిధులు వస్తాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని