logo

‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్‌ పోటీ’

తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్‌ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు విమర్శించారు.

Updated : 19 Apr 2024 06:20 IST

ఈనాడు, కామారెడ్డి: తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్‌ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు విమర్శించారు. జిల్లాకేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు ఎంపీగా ఉండి నియోజకవర్గానికి ఎటువంటి మేలు చేయలేదని ఆరోపించారు. వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు భారాసతో పని అయిపోగానే భాజపాతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడని ఎద్దేవా చేశారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేయలేదన్నారు. ఎల్లారెడ్డితో పాటు పార్లమెంటు నియోజకవర్గంలోని యువత క్యాబ్‌ డ్రైవర్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిని పరామర్శించేందుకు బీబీపాటిల్‌ రాలేదన్నారు. కామారెడ్డి పట్టణ మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం బాట పడితే మౌనంగా ఉండి అక్రమార్కులతో జతకట్టాడని విమర్శించారు. ఓటు వేసే ముందు యువత, రైతులు ఆలోచించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మేధావులు, రైతులు, యువకులు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని