ఓటరు తీర్పు విభిన్నం..
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు.
ముందు మెదక్..తర్వాత జహీరాబాద్
అన్ని పార్టీలకు అవకాశం
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్: కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు 2008 వరకు మెదక్ లోక్సభ స్థానం పరిధిలోనే ఉండేవి. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఆవిర్భవించిన జహీరాబాద్ లోక్సభ స్థానంలో కామారెడ్డి, ఎల్లారెడ్డితోపాటు బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలను జహీరాబాద్లో విలీనం చేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించారు.
బరిలో ఇందిరాగాంధీ..
మెదక్ లోక్సభ ఆవిర్భవించినప్పటి నుంచి 2008 వరకు ఇక్కడ 15 మార్లు ఎన్నికలు నిర్వహించగా 12 మార్లు కాంగ్రెస్పార్టీ అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఇందిరాగాంధీ(కాంగ్రెస్)పై జైపాల్రెడ్డి(జనతాపార్టీ) పోటీ చేశారు. అయితే ఇందిరాగాంధీకి ఇక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 3,01,577 ఓట్లు రాగా.. జైపాల్రెడ్డికి 82,433 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 68 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు. అంతేకాదు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నప్పుడే ఆమె హత్యకు గురయ్యారు. ఆ తర్వాత బాగారెడ్డి ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1989 నుంచి 1998 వరకు వరుసగా నాలుగుసార్లు ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు.
తెదేపా.. భాజపాలకు సైతం..
1984లో తెదేపా అభ్యర్థి మాణిక్రెడ్డికి 2,63,524 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి 2,61,702 ఓట్లు వచ్చాయి. 1,822 ఓట్ల స్వల్ప మెజార్టీతో మాణిక్రెడ్డి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఆలే నరేంద్ర 1,23,766 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్థి ఎంపిక
2009లో జహీరాబాద్ లోక్సభ స్థానానికి తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు. అయితే అప్పుడు తెదేపా, తెరాస పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జహీరాబాద్ స్థానం తెరాసకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో అప్పటికే కామారెడ్డి ఎమ్మెల్యే టికెట్ రేసులో గంప గోవర్ధన్, సయ్యద్ యూసుఫ్ అలీలు పోటీ పడుతున్నారు. తెదేపా అధిష్ఠానం గంప గోవర్ధన్కే టికెట్ ఇచ్చింది. దీంతో తెదేపాలో కొనసాగుతున్న యూసుఫ్అలీకి రాత్రికి రాత్రే తెరాస అభ్యర్థిగా ఖరారు చేసి పోటీకి దింపారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి యూసుఫ్అలీకి 3,78,360 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్కు 3,95,767 ఓట్లు వచ్చాయి. దీంతో 17,407 ఓట్లతో షెట్కార్ విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటి సరఫరాకు అంతరాయం తలెత్తొద్దు
[ 04-05-2024]
వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్ తెలిపారు. -
ప్రాంగణాలు.. బేజారు..!
[ 04-05-2024]
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా భావించే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మాత్రం మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. -
మాతృభాషలో తడబాటు
[ 04-05-2024]
తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఏ భాష వింటూ, ఇబ్బంది లేకుండా తన్మయత్వంతో నేర్చుకుంటున్నారో అందులోనే మందగమనం మొదలైంది. -
వజ్రాయుధాన్ని వదులుకోవద్దు!
[ 04-05-2024]
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల అధికారులు ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
అర్బన్ నియోజకవర్గంలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఓటు వేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
‘చక్కెర పరిశ్రమపై హస్తం పార్టీ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 04-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. -
‘భాజపాతోనే అభివృద్ధి సాధ్యం’
[ 04-05-2024]
ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
‘పదేళ్లలో చేసిందేమీ లేదు’
[ 04-05-2024]
పదేళ్లలో ఎంపీ బీబీపాటిల్ బాన్సువాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. -
నిర్భయంగా ఓటేయాలి
[ 04-05-2024]
నిర్భయంగా ఓటేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలోని సెల్ఫీపాయింట్ వద్ద శుక్రవారం స్వీయ చిత్రం దిగారు. -
ఎవరికెంత మెజార్టీ అంటే..!
[ 04-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 ఎన్నికలు జరిగాయి. -
ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు
[ 04-05-2024]
కాస్బాగ్ తండా వెనుక ప్రాంతంలో ఉన్న పోతుల మోరి వాగు చెక్డ్యామ్ వద్ద ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేసి వ్యాపారులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. -
‘భాజపాను గద్దెదించాలి’
[ 04-05-2024]
ప్రజా సంక్షేమం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న భాజపాను గద్దెదించాలని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. -
‘గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు అర్వింద్ సమాధానాలు ఇవ్వాలి’
[ 04-05-2024]
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగేముందు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి డిమాండ్ చేశారు. -
పురపాలికలకు ముందస్తు ఆదాయం
[ 04-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పురపాలికలకు ‘ముందస్తు’ ఆదాయం వచ్చింది. -
ఓట్లతోనే జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు
[ 04-05-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలు అని తరచూ వింటూ ఉంటాం. జాతీయ పార్టీలు దిల్లీ కేంద్రంగా, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల రాజధానుల కేంద్రంగా పనిచేస్తాయి. -
ఎన్నికల సహాయకేంద్రంలో సీసీ వీరంగం..!
[ 04-05-2024]
కలెక్టరేట్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న వ్యక్తి గురువారం రాత్రి కలెక్టరేట్లో వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..