నేనండి..ఈవీఎంని
ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం.
మీ ఓటు భద్రమే.. నన్ను నమ్మండి
మే 13న పోలింగ్ కేంద్రాలకు తరలిరôడి
న్యూస్టుడే, కమ్మర్పల్లి : ఓటరు మహాశయులకు నమస్కారాలు.. నేనండీ.. మీ ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్))ని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలొచ్చిన ప్రతిసారి మీ ముందుకొస్తుంటాను కదా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా మళ్లీ మనం కలవబోతున్నాం. మీరేసిన ఓట్లతో అభ్యర్థుల విజయావకాశాలు నిర్ణయిస్తాను నేను. ఈవీఎంలలో రిగ్గింగ్, ట్యాంపరింగ్కు అవకాశముందని నాపై ఆరోపణలు వచ్చాయి. అవన్నీ అపోహలేనని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో నాలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వందశాతం సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లనూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్లిప్పుల లెక్కింపు అసాధ్యమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరిస్తూ నాపై విశ్వాసం ఉంచింది. ఇప్పటికైనా నన్ను నమ్మండి.. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మే 13న పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓటేయండి.. మీరు గెలిచి.. నన్నూ గెలిపించండి.
నా నిర్మాణం ఇలా..
నేను విద్యుత్తు లేదా బ్యాటరీ సహాయంతో పని చేస్తాను. నాలో అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో బ్యాలెట్ను ఫీడ్ చేస్తారు. నాలో నోటాతో కలిపి 16 మీటలుంటాయి. 15 నేతల భవితను నిర్ణయిస్తాయి. మీకు ఎవరూ నచ్చకపోతే నోటాను ఎంచుకోండి. ఓటింగ్కు ముందు, పూర్తయ్యాక అధికారులు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రపరుస్తారు. ఆ చోటునే స్ట్రాంగ్ రూం అంటారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుతారు.
నమూనా పోలింగ్
పోలింగ్ ప్రారంభానికి అరగంట ముందు ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. వారితో ఓట్లేయించి అభ్యర్థుల వారీగా నమోదైన స్లిప్పులు చూపించి వాటిని తొలగిస్తారు. తర్వాత పోలింగ్ పూర్తయ్యాక ఓటర్ల నుంచి తీసుకున్న సంతకాల సంఖ్యను నాలో పోలైన ఓట్లతో సరి చూసుకుంటారు. అవి సరిపోతే స్టాప్ మీట నొక్కేస్తారు. ఆ తర్వాత ఓట్లు వేయరాదు. అనంతరం నాకు సీలు వేస్తారు.
ఎప్పుడు పరిచయం చేశారంటే..
1977లో నన్ను ప్రతిపాదించగా.. 1979లో ఒక వర్కింగ్ మోడల్గా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారుచేసింది. 1980లో రాజకీయపార్టీల ఎదుట నన్ను ప్రదర్శించారు. 1982లో కేరళలోని పరవూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలు చేశారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 1998లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మే 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉపయోగించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో వినియోగించారు. 2014లో నాపై అనుమానాలను తొలగించడానికి వీవీప్యాట్ స్లిప్పులతో, 2019లో తీర్పు తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 ఈవీఎంలను ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు.
ఇలా పనిచేస్తాను..
- సాధారణ బ్యాలెట్ మాదిరిగానే నా(ఈవీఎం) పలక మీద బ్యాలెట్ ఉంటుంది. అభ్యర్థి పేరు గుర్తు పక్కనే ఎరువు రంగులో బాణం, దాని పక్కన ఓటరు నొక్కాల్సిన నీలం రంగు మీట ఉంటుంది.
- కంట్రోల్ యూనిట్ వద్ద ఉండే అధికారి నన్ను సిద్ధం చేశాక పచ్చలైటు వెలుగుతుంది.. అప్పుడే ఓటేయొచ్చు.
- ఓటరు మీట నొక్కగానే శబ్దం వస్తుంది. తర్వాత మళ్లీ నొక్కినా ఓటు పడదు.
- ఒకేసారి రెండు మీటలు నొక్కితే ఎక్కువ బలం దేనిపై పెడితే ఆ గుర్తుకు ఓటు నమోదవుతుంది. దీంతో రిగ్గింగ్కు ఆస్కారం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4,78,734 మంది ఓటుకు దూరం
[ 16-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారు చాలా మంది ఉన్నారు. -
వైద్యశాఖలో లైంగిక వేధింపుల కలకలం
[ 16-05-2024]
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్సింగ్పై బుధవారం విచారణ చేపట్టారు. -
తెవివి వీసీ పదవి ఎవరికి దక్కేనో..!
[ 16-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్(వీసీ) పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ సాగుతోంది. -
అభివృద్ధి పనులకు ఆటంకం
[ 16-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు పోలింగ్ సోమవారం ముగిసింది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఆదర్శంగా ఓటేశారు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళా, యువ, దివ్యాంగ, ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఓటింగ్లో మహిళలదే పైచేయి
[ 16-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సీఎంసీలో అభ్యర్థుల భవితవ్యం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. -
పండించిన పంట తిరిగి ఇచ్చేయండి!
[ 16-05-2024]
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులతో పండించిన సెనగ పంట ధర చెల్లింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుంచి పదిహేను రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నారు. -
ఉపాధ్యాయురాలికి నోటీసు జారీ
[ 16-05-2024]
విద్యాశాఖ నుంచి అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయురాలు సుహాసినికి తుది షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో రాజు బుధవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే