IT Raids: ఆగని ఐటీ దాడులు.. సంచుల కొద్దీ డబ్బు
ఒడిశాలో అయిదు రోజులుగా ఆదాయం పన్ను అధికారులు నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ఒడిశాలో అయిదు రోజులుగా ఆదాయం పన్ను అధికారులు(IT Raids) నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహించి రూ.225 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ప్రజల సొమ్ము దోచుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకు చేరుస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు.
156 సంచుల నగదు వెలికితీత: శుక్రవారం రాత్రి బొలంగీర్ జిల్లా సుధారపడ ప్రాంతంలో నాటు సారా తయారుచేసే సంస్థ మేనేజర్ ఇంటిలో సోదాలు నిర్వహించి భారీగా డబ్బు వెలికితీసి 20 సంచుల్లో ఉంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ధనాన్ని 156 సంచుల్లో వేసి ఈ మొత్తాన్ని ఎస్బీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బ్యాంకులో ఉన్న నోట్ల లెక్కింపు యంత్రాలతోపాటు ఇతర బ్రాంచుల్లో ఉన్న యంత్రాలనూ తీసుకొచ్చి శనివారం లెక్కించారు.
అక్రమ నగదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ స్వాధీనం చేసుకున్నది అక్రమ నగదు అని, ఇది భారీ మొత్తంలో రికవరీ కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
రాష్ట్రంలో ప్రముఖ నాటు సారా వ్యాపారిగా గుర్తింపున్న బొలంగీర్కు చెందిన బల్దేవ్ సాహుకు సంబంధించిన సంస్థలోను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బొలంగీర్తోపాటు సంబల్పూర్, రవుర్కెలా, భువనేశ్వర్, సుందర్గఢ్ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.