రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది.
బిజద, కాంగ్రెస్ తరఫున ఖరారైన నవీన్, రాహుల్, రేవంత్ పర్యటన
మోదీని రంగంలోకి దింపేందుకు భాజపా నిర్ణయం
నవీన్ , రాహుల్గాంధీ
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు అగ్ర నేతలను ప్రచారం కోసం రంగంలోకి దింపుతున్నాయి. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిజద తరఫున ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల రాయగడ పర్యటన ఇప్పటికే ఖరారైంది. భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు చేస్తుండడం గమనార్హం. రాష్ట్రం నుంచి ఒకే ఒక్క సీటుని 2019 ఎన్నికల్లో గెలుచుకున్న కొరాపుట్ లోక్సభ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మే 3న రాయగడ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీతో ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మూడు నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహించనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించి ఎంపీ సప్తగిరి ఉలక పర్యవేక్షణలో ఏర్పాట్లను మొదలుపెడుతున్నారు. రాహుల్ గాంధీ పర్యటన మరుసటి రోజే (మే 4న) రాయగడ చేరుకోనున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టికిరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారని బిజద వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు దీనికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేవంత్ రెడ్డి
మూడు నియోజకవర్గాలకు 30 మంది
జిల్లాలో ఉన్న మూడు శాసనసభ నియోజకవర్గాల కోసం ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాయగడ నియోజకవర్గానికి 10 మంది పోటీలో నిలుస్తుండగా, గుణుపురంలో 12 మంది, బిసంకటక్లో ఎనిమిది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాహిత ఆత్మహత్యా యత్నం
[ 15-05-2024]
భర్త, అత్తమామల వేధింపులు భరించలేక నవ వధువురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. -
మాజీ మంత్రి డంబొరొదర ఉలక కన్నుమూత
[ 15-05-2024]
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డంబొరొదర ఉలక (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భవనేశ్వర్ లోని.... -
జగన్నాథుని ఆశీస్సులెవరికి?
[ 15-05-2024]
హరి (జగన్నాథుడు) నామస్మరణతో నిరంతర మార్మోగే పూరీ తుర్పుతీర దివ్యధామంలో ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. -
స్ట్రాంగ్రూంలో ఈవీఎంల భద్రత
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగు జరిగింది. -
రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్
[ 15-05-2024]
తొలిదశలో సోమవారం జరిగిన ఎన్నికల్లో రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్ జరిగింది. మూడు నియోజకవర్గాలున్న జిల్లాలో బిసంకటక్ శాసనసభ స్థానంలో అత్యధికంగా 77.93 శాతం పోలింగ్ నమోదైంది. -
కోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ప్రచారం ముమ్మరం
[ 15-05-2024]
ఉత్తరకోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ఈ నెల 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుండగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది -
తెలుగు ఓటర్లవైపు పార్టీల చూపు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి తృణమూల్ కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీల కూటమి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి -
నేడు కటక్లో అమిత్షా రోడ్షో
[ 15-05-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా బుధవారం సాయంత్రం కటక్ వస్తున్నారు. భాజపా నగరశాఖ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ మంగళవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఇలా వస్తానని... అలా మాయమైంది
[ 15-05-2024]
ఇప్పుడే వస్తానని తోటి మహిళను నమ్మించి, ఆమె చేతిలో శిశువును పెట్టి ఓ మాతృమూర్తి పరారైంది. -
చకచకా రథ చక్రాల పనులు
[ 15-05-2024]
తెల్లవారక ముందే స్నానం, తర్వాత పురుషోత్తమ దర్శనం... స్వామి తీర్థ ప్రసాదాల ఆరగింత... అనంతరం శ్రీక్షేత్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటైన చలవ పందిరికి చేరుకుని రథచక్రాల పనులు.. ఇవీ ప్రస్తుతం శ్రీక్షేత్రం ఆవరణలో మహరణా (వడ్రంగి) సేవాయత్ల నిత్యకృత్యాలు. జులై 7న ఇక్కడ విశ్వప్రసిద్ధ రథయాత్ర నిర్వహించనున్నారు. -
బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్పై దాడి
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు దాస్) సోమవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
సామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ను ఓడించిన పంజాబ్
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్