నితీష్ గమ్యం ఎటువైపు?
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.
మద్దతు భార్యకా? భాజపాకా?
భువనేశ్వర్, న్యూస్టుడే
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. దేవ్గఢ్ రాజు నితీష్ గంగదేవ్ భాజపాలో అగ్రనేత. పశ్చిమ ఒడిశాలో ఆయనకు ఆదరణ ఉంది. గతసారి ఆయన సంబల్పూర్ నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఈసారి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సంబల్పూర్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ప్రచారం ముమ్మరమైనా నితీష్ ఎక్కడా కనిపించడం లేదు. రాజపరివారంలో కలతలు నెలకొన్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. భార్య అరుంధతీ దేవితో ఆయనకు సత్సంబంధాలు లేవన్న చర్చ నడుస్తోంది. మరోవైపు పశ్చిమంలో పుంజుకుంటున్న భాజపాను ఎదుర్కోవడానికి నవీన్ సరికొత్త ఎత్తుగడ వేశారు. నితీష్ భార్య అరుంధతీ దేవిని దేవ్గఢ్ అసెంబ్లీ అభ్యర్థిగా నిలిపారు. దీంతో సంబల్పూర్ రాజకీయాలు వేడెక్కాయి. దేవ్గఢ్ అసెంబ్లీ సెగ్మెంటు సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
కలతలు లేవ్
తమ కుటుంబంలో కలతలు లేవనే వ్యాఖ్యలను అరుంధతీ కొట్టిపారేశారు. తన భర్త నితీష్ అస్వస్థతకు గురైనందున క్రియాశీలకంగా లేరని భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. తన తరఫున ఆయన ప్రచారం చేస్తారని వివరించారు.
ఆయన మద్దతు మాకే
మరోవైపు దేవ్గఢ్ సిటింగ్ ఎమ్మెల్యే, భాజపా అభ్యర్థి సుభాష్చంద్ర పాణిగ్రహి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... నితీష్గంగదేవ్ భాజపాలో ఉన్నారని, ఆయన మద్దతు తమకే ఉందని చెప్పారు. రాణి అరుంధతీకి భాజపాలో సభ్యత్వం లేదని, ఆమె బిజద అభ్యర్థి అయినా ప్రభావం ఉండదని, దేవ్గఢ్వాసులు కమలానికి అనుకూలంగా ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నితీష్ వైఖరి ఎలా ఉండబోతోందన్న చర్చ సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.