అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం.
బితరకనికలో అదనంగా 39 మడ అడవి పక్షుల గుర్తింపు
మడ అడవి పక్షి
రాయగడ పట్టణం, న్యూస్టుడే: కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. ఈమేరకు గణాంకాల నివేదికను అటవీశాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. వాటి ప్రకారం.. 2023లో బితర్కనికలో 179 మడ అడవి పక్షులను గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 218కి చేరుకుంది. 80మంది అటవీ శాఖ సిబ్బంది పాల్గొని ఆదివారం వీటి గణన చేపట్టారు. రాజ్నగర్, డంగముల, మహాకల్పద, గహిర్మెట్ట, కుజంగ్ అటవీ రేంజ్ అధికారుల పర్యవేక్షణలో వీరంతా ఉద్యానవనంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యానవన అటవీ సంరక్షణ సహాయక ఛీప్ (ఏసీఎఫ్) మానస దాస్ మాట్లాడుతూ బితరకనికలో ఉన్న మడ అడవులు, అన్ని నీటి వనరులను జల్లెడ పట్టి వీటి లెక్కింపు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఆకర్షణీయం.. వీటి ప్రత్యేకం: వివిధ రంగులతో చిన్న పరిమాణంలో ఉన్న ఈ పక్షులు ఆకర్షణీయంగా కనిపించడమే వీటి ప్రత్యేకత. తల ఊదా రంగులో ఉండి, నలుపు ముక్కు, తెల్లని రంగు మెడ, పచ్చ, నీలం రంగులు కలిసిన రెక్కలు, పసుపు రంగు పొట్ట, ఎరుపు రంగుతో కూడిన కాళ్ల పైభాగంతో ఈ పక్షి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. చిన్న చిన్న కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయని వీటి పరిశోధకురాలు శుభదర్శిని ప్రధాన్ పేర్కొన్నారు. ఈ వలస పక్షి శాస్త్రీయ నామం మేఘారించ పిట్ట అని ఆమె వెల్లడించారు. వీటి సంతతి వృద్ధికి ఏప్రిల్-ఆగస్టు అనువైన కాలంగా ప్రధాన్ స్పష్టం చేశారు. మానవ ఆవాసాలకు దూరంగా ఉండడంతోపాటు ఉద్యానవనంలో సమృద్ధిగా ఆహారం లభించడం వీటి సంతతి పెరుగుదలకు కారణాలుగా నిలుస్తున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..