లిఖిత హామీ ఇస్తేనే ఓట్లేస్తాం
ఉత్తరాముఖి ప్రాంతంలో సుమారు 172 కుటుంబాలున్నాయి. అక్కడ అంగన్వాడీ, ప్రజారోగ్య కేంద్రం, కల్యాణ మండపం లేవు. ప్రస్తుతం బిజద అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్చంద్రచ్యవు పట్నాయక్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానికుల డిమాండ్లు
ఉత్తరాముఖి ప్రాంతవాసుల అసంతృప్తి
బ్రహ్మపుర బజారు, న్యూస్టుడే
నగరశివారున ఉత్తరాముఖి ప్రాంతం
ఎన్నాళ్ల నుంచో ఇక్కడ ఉంటున్నాం. ఇప్పటికీ పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఎవరు లిఖితపూర్వక హామీ ఇస్తారో వారికే ఈసారి ఓట్టేస్తాం
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) ఒకటో వార్డులోని ఉత్తరాముఖి ప్రాంత ప్రజలు
ఉత్తరాముఖి ప్రాంతంలో సుమారు 172 కుటుంబాలున్నాయి. అక్కడ అంగన్వాడీ, ప్రజారోగ్య కేంద్రం, కల్యాణ మండపం లేవు. ప్రస్తుతం బిజద అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్చంద్రచ్యవు పట్నాయక్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానికుల డిమాండ్లు పరిష్కరిస్తానని అప్పట్లో హామీ ఇచ్చి తర్వాత విస్మరించారు. ఇప్పుడు మళ్లీ ఆయన పోటీ చేస్తున్నారు. ఈసారి చ్యవు పట్నాయక్కు ఓటేసేదే లేదని ఆ ప్రాంతవాసులు గట్టిగా చెబుతున్నారు. 172 కుటుంబాలలో 100 మందికి భూమి హక్కు పత్రాలు బీఈఎంసీ ఇచ్చిందని, మిగిలిన వారికి ఇవ్వలేదని చెప్పారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకుంటామని, ఇందుకు సహకరించమని విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని, ఈసారి లిఖిత పూర్వకంగా మా డిమాండ్లు పరిష్కరిస్తామని ఇవ్వాలని, అప్పుడే ఓటేస్తామని వారంటున్నారు.
కల్యాణ మండపం నిర్మించాలి: మలాసి రెడ్డి
ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచిన తరువాత ఇటువైపే రావడంలేదు. కార్పొరేటరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మామూలైపోయింది. ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి కల్యాణ మండపం లేదు. సామాజిక భవనం లేదు. ఈసారి అభివృద్ధి పనులు చేస్తామని, డిమాండ్లు నెరవేరుస్తామని రాసిచ్చిన వారికే ఓటు వేస్తాం.
స్వయం సహాయ బృందాలకు సహకరించాలి: కురెయి రెడ్డి
బీఈఎంసీ ఇతర వార్డులలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ లేవు. స్వయం సహాయ బృందాలు (ఎస్హెచ్జీ) ఏర్పాటు చేసుకుంటామని పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఇతర వార్డులలో ఎస్హెచ్జీలున్నాయి. ఉత్తరాముఖిలో మాత్రం ఇప్పటికీ ఎస్హెచ్జీల్లేవు. ఇందుకు అనుమతి ఇవ్వాలని, రుణాలు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు విన్నవించినా సమాధానంలేదు. ఈసారి మా సమస్యలు తీర్చిన వారికే ఓటేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజులకి ఆదరణ.. బిజద, కాంగ్రెస్లు నిలువరించేనా?
[ 16-05-2024]
మూడుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన రాణి సంగీతాకు జనాదరణ కనిపిస్తోంది. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
నవీన్ 25 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి
[ 16-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి శాపమని, అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఒడియాయేతరులైన అధికారుల చేతికి పాలనా పగ్గాలు అప్పగించి ప్రజలకు సీఎం నిరాశ మిగిల్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. -
జులై నుంచి ఉచిత విద్యుత్తు
[ 16-05-2024]
రానున్న జులై నుంచి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని, 90 శాతం ప్రజలకు బిల్లులు రావని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
రెండో విడతలో 95 మంది కోటీశ్వరులు
[ 16-05-2024]
ఈ నెల 20న రెండో విడతలో 5 లోక్సభ, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 265 మంది శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. వీరిలో 87 మంది నేరచరితులున్నారు. -
అస్కా లోక్సభ స్థానం ఎవరికి దక్కేనో..?
[ 16-05-2024]
గంజాం జిల్లాలోని లోక్సభ స్థానాల్లో అస్కా కీలకమైంది. ఈ స్థానంలో పట్టు సాధించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
మాజీ మంత్రి డొంబురధర కన్నుమూత
[ 16-05-2024]
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొంబురధర ఉలక (87) మంగళవారం అర్ధరాత్రి భువనేశ్వర్లోని ప్రవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. -
ఒడిశాలో కాంగ్రెస్ అధికారానికొస్తుంది: రాహుల్
[ 16-05-2024]
ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. బుధవారం బొలంగీర్ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. -
రాష్ట్రానికి భాజపా అగ్రనేతలు
[ 16-05-2024]
ఒడిశాలో అధికారం దక్కించుకోవాలన్న భాజపా నాయకత్వం ఈ దిశగా సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉన్నందున అగ్రనేతలంతా ప్రచారానికి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ బుధవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
రోజు కూలీ.. రాజ మేస్త్రీల ప్రచారం
[ 16-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అస్కా, భంజనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ అభ్యర్థులుగా రోజు కూలీ టునా మల్లిక్, రాజ మేస్త్రీ రామచంద్ర బడత్యాలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
గుక్కెడు నీటికి కడివెడు కష్టం
[ 16-05-2024]
కొరాపుట్ జిల్లాలో వేసవి ప్రారంభం నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీటికోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి అన్వేషణతోనే రోజు మొదలవుతుంది. -
ప్రదీప్ పాణిగ్రహిపై దాడి వెనుక కుట్ర కోణముంది
[ 16-05-2024]
బ్రహ్మపుర గుసానినువాగాం పోలింగు కేంద్రం సమీపాన ఎన్నికల రోజున రాత్రి బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు) దాడి చేయడం వెనుక కుట్ర కోణముందని భాజపా నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. -
గోశాల కాదు.. కొరాపుట్ బస్టాండ్
[ 16-05-2024]
జిల్లాకేంద్రం కొరాపుట్ బస్టాండ్లో ఎక్కువగా పశువులు తిరుగుతుండడంతో గోశాలను తలపిస్తోంది. బస్స్టాండ్ భవనం ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లు ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే