logo

రైల్వేస్టేషన్లలో సమాచార కేంద్రాల ఏర్పాటు

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు  ప్రమాదం నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రయాణికులు ఉంటే, వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు శ్రీకాకుళం రోడ్‌, పలాస రైల్వేస్టేషన్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 03 Jun 2023 05:07 IST

ఇచ్ఛాపురంలో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు

ఆమదాలవలస పట్టణం, ఇచ్ఛాపురం, పలాస న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు  ప్రమాదం నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రయాణికులు ఉంటే, వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు శ్రీకాకుళం రోడ్‌, పలాస రైల్వేస్టేషన్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాణనష్టంతో పాటు చాలామంది క్షతగాత్రులు అయ్యారని వారి సమాచారం కోసం దిగువనిచ్చిన నంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని అధికారులు తెలిపారు. చాలావరకు రైళ్లు రద్దు కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని