logo

పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 23 Apr 2024 03:46 IST

రెండు రోజుల పాటు జిల్లాలో చంద్రబాబు పర్యటన

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించనున్న ప్రజాగళం సభలకు ఆయన హాజరుకానున్నారు. 23న మధ్యాహ్నం 2.10 గంటలకు విజయనగరం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 2.40 గంటలకు పాతపట్నంలోని నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 2.55 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 2.55కి బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని 4.30 వరకు ప్రసంగిస్తారు. అనంతరం 4.50కు ఆమదాలవలస బయలుదేరతారు. 5.05 గంటలకు తిమ్మాపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద దిగి.. 5.15 గంటలకు కృష్ణాపురం కూడలికి చేరుకుంటారు. 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత 7.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8.10 గంటలకు శ్రీకాకుళం నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయానికి వెళ్లి.. రాత్రి అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో మహిళలతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు