పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.
రెండు రోజుల పాటు జిల్లాలో చంద్రబాబు పర్యటన
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించనున్న ప్రజాగళం సభలకు ఆయన హాజరుకానున్నారు. 23న మధ్యాహ్నం 2.10 గంటలకు విజయనగరం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 2.40 గంటలకు పాతపట్నంలోని నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.55 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 2.55కి బస్టాండ్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని 4.30 వరకు ప్రసంగిస్తారు. అనంతరం 4.50కు ఆమదాలవలస బయలుదేరతారు. 5.05 గంటలకు తిమ్మాపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగి.. 5.15 గంటలకు కృష్ణాపురం కూడలికి చేరుకుంటారు. 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత 7.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8.10 గంటలకు శ్రీకాకుళం నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయానికి వెళ్లి.. రాత్రి అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో మహిళలతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో మాడిస్తే.. మీ కళ్లు చల్లబడ్డాయా?
[ 03-05-2024]
మాది గార మండలం తూలుగు పంచాయతీ జాఫ్రాబాదు గ్రామం. ఆటోలో 7 కి.మీ. ప్రయాణించి ఎండలో గార మండల కేంద్రానికి వచ్చాం. బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. -
పసుపు దండు ఉత్సాహం
[ 03-05-2024]
పాతపట్నం నియోజకవర్గంలో పసుపుదండు ఉత్సాహం ఉరకలెత్తింది.. ఏ దారి చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. -
దేవుడా.. ఇదేం పాలన..?
[ 03-05-2024]
నోరెత్తితే దేవుడి పేరు పలికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో ఆ భగవంతుడి ఆలనాపాలన సైతం పట్టించుకోలేదు.. -
మన్యం మౌన రోదన.. వినిపించలేదా జగనన్న..!
[ 03-05-2024]
అత్యవసరమైతే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేయాల్సిందే. ఇదీ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఆయా ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం. -
ఏళ్లుగా అదే పరిస్థితి.. సాగు నీరందని దుస్థితి
[ 03-05-2024]
వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలను కలిపి ఉన్న వంశధార 60 ఆర్ఎల్ కాలువపై పలు చోట్ల సిమెంట్ పనులు పాడై కనీస మరమ్మత్తులకు నోచుకోవడంలేదు. -
కిడ్నీ రోగుల కుటుంబాలకు అండగా నిలవండి
[ 03-05-2024]
ఉద్దానంలో మూత్రపిండాల రోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అండగా నిలవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు విజ్ఞప్తి చేశారు. -
చంద్రన్నతోనే సంక్షేమం
[ 03-05-2024]
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, వైకాపా పాలనలో విధ్వంసం చోటు చేసుకుందని తెదేపా నాయకులు తెలిపారు. -
ఒక్క రోడ్డయినా వేసినపాపాన పోలేదు
[ 03-05-2024]
ఇచ్ఛాపురం, పలాస పట్టణాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కీలక మార్గాలు ఛిద్రమై, గోతులతో నిండి ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
ఇసుక మూటలే.. కాంక్రీట్ గోడ..!
[ 03-05-2024]
ఎల్ఎన్పేట మండలంలో వంశధార నది వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం బావుల నుంచి నీరు సరఫరా చేసే వంతెన శిథిలమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం