logo

సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు

ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్‌ పోల్స్‌ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 29 Apr 2024 05:38 IST

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్‌ పోల్స్‌ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయంత్రం వీచిన గాలులకు జనాల తోపులాటలకు లైటింగ్‌ పోల్స్‌ మీద పడి కోటబొమ్మాళి మండలం కమలనాభపురం గ్రామానికి చెందిన దువ్వారపు అప్పన్న, మద్దిల మల్లేసుకు తలలపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన బయటకు తెలియకుండా వైకాపా నేతలు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎమ్మెల్సీ నమోదు కాలేదు. వైకాపా నేతలు చెబితేనే సమావేశానికి హాజరయ్యామని బాధితులు చెబుతున్నారు. గాయాల కారణంగా కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సమావేశానికి పిలిచిన వైకాపా నేతలే సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని