సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
టెక్కలి పట్టణం, న్యూస్టుడే : ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయంత్రం వీచిన గాలులకు జనాల తోపులాటలకు లైటింగ్ పోల్స్ మీద పడి కోటబొమ్మాళి మండలం కమలనాభపురం గ్రామానికి చెందిన దువ్వారపు అప్పన్న, మద్దిల మల్లేసుకు తలలపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన బయటకు తెలియకుండా వైకాపా నేతలు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎమ్మెల్సీ నమోదు కాలేదు. వైకాపా నేతలు చెబితేనే సమావేశానికి హాజరయ్యామని బాధితులు చెబుతున్నారు. గాయాల కారణంగా కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సమావేశానికి పిలిచిన వైకాపా నేతలే సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పకూలిన వంతెన... ఏడాదిగా యాతన..!
[ 16-05-2024]
మిగిలిన వాటిని బెల్లుపడ గ్రామం మీదుగా జాతీయ రహదారికి పంపుతున్నారు. దీంతో సమీప గ్రామాలకు చేరుకోవాల్సిన వారికి చుట్టూ తిరిగి వెళ్లాలంటే మరో మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. -
అచ్చెన్నకు ముందస్తు శుభాకాంక్షలు
[ 16-05-2024]
తెెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసేందుకు వచ్చిన తెదేపా నాయకులతో బుధవారం నిమ్మాడలో సందడి నెలకొంది. -
ఒత్తిడిని అధిగమిస్తే.. ఉత్తమ ర్యాంకు మీదే..!
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్కు సమయం ఆసన్నమైంది. -
ఏకలవ్య.. అందుబాటులోకి ఎప్పుడయ్యా..?
[ 16-05-2024]
జిల్లాలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో 2014లో అప్పటి ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే