logo

భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట

ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొంది.

Published : 24 Apr 2024 02:40 IST

తొర్రూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొర్రూరు డిపోకు చెందిన ఎక్స్‌స్రెస్‌ బస్సు తొర్రూరు నుంచి ఉప్పల్‌ క్రాస్‌రోడ్డుకు వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌లో సాయంత్రం ప్లాట్ఫారంపై ఉంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్లు ఆపుకున్న వారు బస్సులోకి ఎక్కాక వేరే ప్రయాణికులు కూర్చోవడంతో సీటు మేము ఆపామంటే మేము ఆపామని మహిళా ప్రయాణికులు ఇద్దరు గొడవకు దిగారు. ఇది గమనించిన వారి భర్తలు ఒకరిపై ఒకరు చెప్పులతో బస్సులోనే దాడి చేసుకున్నారు. భయబ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు వారి ఇరువురిని కిందకు దింపారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది 100కు డయల్‌ చేయడంతో పోలీసులు వచ్చి ఇరువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఘటనపై డిపో ఎస్టీఐ రజితను వివరణ కోరగా సంఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. చిన్నచిన్న విషయాలకు ప్రయాణికులు గొడవ పడటం విచారకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని