రాజకీయ చట్రంలో రక్షణ గోడ
రైల్వేకోడూరు పట్టణంలో గుంజనేటి ఒడ్డున ఉన్న నరసరాంపేటలో వర్షం కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతోంది. 2005, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇక్కడి ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి మంత్రులు, నాయకులు ఇక్కడ స్వయంగా పర్యటించి ఈ ప్రాంతానికి రక్షణ గోడ అవసరమని నిర్ధారించారు.
నిర్మించకుండా విమర్శలతోనే కాలయాపన
కూలిన ఇల్లు
-న్యూస్టుడే, రైల్వేకోడూరు రైల్వేకోడూరు పట్టణంలో గుంజనేటి ఒడ్డున ఉన్న నరసరాంపేటలో వర్షం కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతోంది. 2005, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇక్కడి ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి మంత్రులు, నాయకులు ఇక్కడ స్వయంగా పర్యటించి ఈ ప్రాంతానికి రక్షణ గోడ అవసరమని నిర్ధారించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. శేషాచలం అడవుల నుంచి వరద పోటెత్తిన ప్రతిసారీ ఇక్కడ ఏటి ఒడ్డున ఉన్న నివాసాలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతింటూనే ఉన్నాయి.
గత ప్రభుత్వంలోనే నరసరాంపేటకు రూ.21.87 కోట్లతో రక్షణ గోడ మంజూరైంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ప్రజలు ఇబ్బంది పడడానికి ఇప్పటి నేతలే కారణం.- బత్యాల చెంగల్రాయుడు,
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి
సుమారు 12 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ఇక్కడి నేత ఒకరు నరసరాంపేటకు రక్షణ గోడ నిర్మించలేకపోయారు. ఆ వైఫల్యాన్ని మా మీదకు తోసే ప్రయత్నం మంచిది కాదు. జగన్ ప్రభుత్వంలో రూ.37 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తాం.
- కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
పక్కా గృహాలకు ప్రణాళిక : నరసరాంపేటలో మొత్తం 21 నివాసాలు అత్యంత ప్రమాదకరమని గుర్తించాం. 16 కుటుంబాల వారికి ఇప్పటికే ఇంటి స్థలాలు మంజూరయ్యాయి. మరో అయిదుగురికి విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న కారణంతో జాగా మంజూరు కాలేదు. అందరికీ పక్కా గృహాలు కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాం. - రామమోహన్, తహసీల్దారు
రూ.37 కోట్లతో నివేదిక: రక్షణ గోడ నిర్మించడానికి రూ.37 కోట్లతో అంచనా నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. నిధులు, అనుమతులు రాగానే పనులు చేపడతాం. - చెంగల్రాయుడు, డీఈ, నీటిపారుదలశాఖ
సమస్యను విన్నవిస్తూనే ఉన్నాం
ఓట్లకు వచ్చిన ప్రతి నాయకుడికీ మా సమస్యలు విన్నవిస్తూనే ఉన్నాం. మాటలు చెప్పడం తప్ప రక్షణ గోడ నిర్మించలేదు. నీటి ఉద్ధృతికి మా రెండంతస్తుల భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. కట్టుబట్టలతో మిగిలాం. పిల్లా పాపలతో నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది.
- షేక్ నూర్జహాన్, ఆయేషా
మాటలతో సరిపెడుతున్నారు
వర్షం కురిసిన ప్రతిసారీ ఇక్కడ గండమే. ఇళ్లు కొద్దికొద్దిగా ఏట్లోకి జారిపోతుంటే ప్రాణాలు అరచేత పట్టుకుని వీధుల్లోనే ఉంటున్నాం. అందరం పేదవాళ్లం. ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకుని గోడ కట్టిస్తే ఏట్లోని నీళ్లు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు
- రామాంజులమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి