logo

సింహ వాహనంపై సీతాపతి

ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు.

Published : 20 Apr 2024 04:34 IST

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేసి అలంకరించారు. శ్రీవారి సేవకుల కోలాటం ప్రదర్శనలు, భజనలు విశేషంగా అలరించాయి. ఒంటిమిట్ట పురవీధుల్లో గ్రామోత్సవం కనులపండువగా సాగింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని