కలల వంతెన... జగన్ వంచన!
పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది.
పది గ్రామాల ప్రజలకు తప్పని నరకయాతన
సాకారమైతే వేలాదిమందికి రవాణా సౌకర్యం
సంకేపల్లె-బొందెలదిన్నె గ్రామాల మధ్యలో నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు
పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది. వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. కలల వారధి సాకారమైందని ఆయా గ్రామాల ప్రజలు ఆనందపడ్డారు. ఇంతలోనే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడం తదితర కారణాలతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. నేటికీ అతీగతీ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు వంతెన కలగానే మిగిలిపోయింది.
న్యూస్టుడే, కొండాపురం
కొండాపురం మండలం సంకేపల్లె-అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందెలదిన్నె గ్రామాల మధ్య పెన్నానదిపై గతంలో కాజ్వేను నిర్మించారు.నదికి వరదలొచ్చే సమయంలో కాజ్వేపై నీటి ప్రవాహం కొనసాగేది. దీంతో నది అవతలి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మండల కేంద్రానికి రావాలంటే అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లి అక్కడ నుంచి రావాల్సి వచ్చేది. దీంతో రానుపోను సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. ప్రజల కష్టాలను గుర్తించిన అప్పటి నేతలు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో స్పందించిన తెదేపా ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 2019లో రూ.34 కోట్లు మంజూరు చేస్తూ, అనుమతులిచ్చింది. వెంటనే ఆగమేఘాలపై అదే ఏడాది మార్చి ఏడో తేదీన పనులు ప్రారంభించారు. నదిలో పది శాతం పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతుండగా వరదనీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. 2023 సెప్టెంబరుకు నీరు తగ్గిపోయినా పనులు మాత్రం చేపట్టలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంతెన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు.
9 వేల మందికి ప్రయోజనం : పెన్నానదిపై వంతెన నిర్మిస్తే పది గ్రామాల్లోని 9 వేలమందికి ప్రయోజనం కలుగుతుంది. సంకేపల్లె, కోడూరు, సిరిగేపల్లె, దొబ్బుడుపల్లె, రాగికుంట, కొత్తపల్లె, మురగంపల్లె, చామలూరు, తిరుమలాయపల్లె, ఎర్రగుడి గ్రామాల ప్రజల రాకపోకలు సులభతరమవుతాయి. వంతెన నిర్మిస్తే దురాభారంతో పాటు ఆర్థికభారం తప్పుతుందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
వరదలొస్తే రాకపోకలు బంద్
పెన్నా నదిలో వరదలొస్తే రాకపోకలు నిలిచిపోతాయి. నీరు ప్రవహించే సమయంలో నది ఇవతల వైపు ఉన్న గ్రామాల్లోని ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. మండల కేంద్రానికి వెళ్లాలన్నా సుమారు 50 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రైతులు ఇలా అందరికీ ఇబ్బందే. వైకాపా పాలకులు అయిదేళ్లు కాలయాపన చేశారు. వంతెన పూర్తయితే పది గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది.
రామమునిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, టి.కోడూరు
వంతెన పూర్తికాకపోతే ఇబ్బందులే
పెన్నా నదిపై వంతెన పూర్తి చేస్తే పది గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. దూరాభారంతో పాటు ఆర్థికభారం తప్పుతుంది. పలుసార్లు అధికారులను వంతెనను పూర్తి చేయాలని కోరాం. వంతెన పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గడిచిన అయిదేళ్ల వైకాపా పాలనలో వంతెన నిర్మాణంపై పాలకుల చిన్నచూపు చూశారు.
రామశివారెడ్డి, సంకేపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటోత్సాహం!
[ 15-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
తెదేపా యువకులపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయొద్దని అడ్డుకున్నందుకు తెదేపా సానుభూతిపరులైన యువకులపై వైకాపా నాయకులు దాడులకు తెగబడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
వైకాపా నాయకుల ప్రలోభాలను తిప్పికొట్టాం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందులలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను వైకాపా నాయకులు ప్రలోభాలకు గురి చేశారని తెదేపా పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి బీటెక్ రవి ఆరోపించారు. -
అంతా రహస్యం!
[ 15-05-2024]
గుత్తేదారుల పరుగులు.... అందులోనూ వైకాపా కీలక నేతల అనుయాయుల్లో కదలికలు... ఇంజినీరింగ్ విభాగాల్లో గుసగుసలు... రహస్యంగా కదులుతున్న ఫైళ్లు... పెండింగ్ బిల్లుల అప్లోడింగ్... వరుస క్రమంలో కాకుండా అడ్డమార్గాల్లో బిల్లుల చెల్లింపులు.. -
చెప్పినట్లే చేశారు!
[ 15-05-2024]
ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే తాటతీస్తాం. పరిస్థితిని బట్టి అలాంటి వారిని తరిమితరిమి కొడతాం. ఈవీఎంలను ఎవరినీ తాకనీయం. తాకితే వారికి మూడినట్లే.. అల్లర్లకు పాల్పడినా, హింసకు పాల్పడినా నిందితులను జిల్లా బహిష్కరణ చేస్తాం. -
వైభవంగా త్రిశూల చక్రస్నానం
[ 15-05-2024]
పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం త్రిశూల చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రాధిపతి వైద్యనాథేశ్వరస్వామిని కామాక్షి అమ్మవారితో సహా పినాకినీ నదీతీరానికి తీసుకురాగా, -
అంజాద్బాషాకు ప్రజలే తగినశాస్తి చేస్తారు
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రంలోకి ఏ మగాడు వస్తాడో చూస్తాను అంటూ డిప్యూటీ సీఎం అంజాద్బాషా ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారని... ఆయన మగతనం రోడ్ల జంక్షన్లో చూపించుకోవాలని, -
అండగా ఉంటా...
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వెళ్లి ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు చిన్నయ్యకు అండగా ఉంటానని మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
[ 15-05-2024]
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఇటుక పెళ్లతో దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
సార్వత్రిక సమరం... కొనసాగిన పురుషాధిక్యం
[ 15-05-2024]
సార్వత్రిక సమరం ముగిసింది. మార్చి 16న ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పట్నుంచి రాజకీయ నాయకులు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదునుపెట్టారు. ఏప్రిల్ 18న నామినేషన్ల ఘట్టంతోనే ఎన్నికల ప్రచారానికి తెరలేచింది. -
మాదిగలు ఏజెంట్లుగా కూర్చోకూడదా?
[ 15-05-2024]
మాదిగలు ఏజెంటుగా కూర్చునే హక్కు లేదా అని ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, కె.ఎన్.రాజు ప్రశ్నించారు. కడప ప్రెస్క్లబ్లో మంగళవారం వారు మాట్లాడుతూ -
రాళ్లదాడి ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులు...కేసు నమోదు
[ 15-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప రెండో పట్టణ ఠాణా పరిధిలోని గౌస్నగర్లో సోమవారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఇరువర్గాలు మంగళవారం సీఐ ఇబ్రహీంకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
సామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ను ఓడించిన పంజాబ్
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్