నీరందించాలని నిరసన
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు..
న్యూస్టుడే, మదనపల్లె గ్రామీణ: ‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. మాగోడు ఎవరికి తెలియజేయాలి’ అని మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని ఇందిరమ్మకాలనీ, వైయస్ఆర్ కాలనీ వాసులు ఆదివారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. సుమారు 15 ఏళ్ల కిందట వైయస్ఆర్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల పట్టాలిచ్చారు. నాలుగేళ్ల నుంచి నీటి సమస్య నెలకొంది. పైపులైను ద్వారా అస్తవ్యస్తంగా నీటి సరఫరా చేస్తున్నారు. అయిదేళ్ల పాటు అధికార పార్టీకి పాలకులు, ఎమ్మెల్యేకు అంతర్గత విభేదాలతో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారు. దీంతో వినియోగానికి ప్రైవేటు ట్యాంకులను ఆశ్రయించి రూ.600తో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. సమస్య పరిష్కారం కాకుంటే జాతీయరహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నీటి సమస్యపై నిరసన వ్యక్తం చేస్తున్న అమ్మచెరువుమిట్ట ఇందిరమ్మ కాలనీ వాసులను చిత్రంలో చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటోత్సాహం!
[ 15-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. -
తెదేపా యువకులపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయొద్దని అడ్డుకున్నందుకు తెదేపా సానుభూతిపరులైన యువకులపై వైకాపా నాయకులు దాడులకు తెగబడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -
వైకాపా నాయకుల ప్రలోభాలను తిప్పికొట్టాం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందులలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను వైకాపా నాయకులు ప్రలోభాలకు గురి చేశారని తెదేపా పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి బీటెక్ రవి ఆరోపించారు. -
అంతా రహస్యం!
[ 15-05-2024]
గుత్తేదారుల పరుగులు.... అందులోనూ వైకాపా కీలక నేతల అనుయాయుల్లో కదలికలు... ఇంజినీరింగ్ విభాగాల్లో గుసగుసలు... రహస్యంగా కదులుతున్న ఫైళ్లు... పెండింగ్ బిల్లుల అప్లోడింగ్... వరుస క్రమంలో కాకుండా అడ్డమార్గాల్లో బిల్లుల చెల్లింపులు.. -
చెప్పినట్లే చేశారు!
[ 15-05-2024]
ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే తాటతీస్తాం. పరిస్థితిని బట్టి అలాంటి వారిని తరిమితరిమి కొడతాం. ఈవీఎంలను ఎవరినీ తాకనీయం. తాకితే వారికి మూడినట్లే.. అల్లర్లకు పాల్పడినా, హింసకు పాల్పడినా నిందితులను జిల్లా బహిష్కరణ చేస్తాం. -
వైభవంగా త్రిశూల చక్రస్నానం
[ 15-05-2024]
పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం త్రిశూల చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రాధిపతి వైద్యనాథేశ్వరస్వామిని కామాక్షి అమ్మవారితో సహా పినాకినీ నదీతీరానికి తీసుకురాగా, -
అంజాద్బాషాకు ప్రజలే తగినశాస్తి చేస్తారు
[ 15-05-2024]
పోలింగ్ కేంద్రంలోకి ఏ మగాడు వస్తాడో చూస్తాను అంటూ డిప్యూటీ సీఎం అంజాద్బాషా ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారని... ఆయన మగతనం రోడ్ల జంక్షన్లో చూపించుకోవాలని, -
అండగా ఉంటా...
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వెళ్లి ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు చిన్నయ్యకు అండగా ఉంటానని మైదుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
[ 15-05-2024]
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఇటుక పెళ్లతో దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
సార్వత్రిక సమరం... కొనసాగిన పురుషాధిక్యం
[ 15-05-2024]
సార్వత్రిక సమరం ముగిసింది. మార్చి 16న ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పట్నుంచి రాజకీయ నాయకులు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదునుపెట్టారు. ఏప్రిల్ 18న నామినేషన్ల ఘట్టంతోనే ఎన్నికల ప్రచారానికి తెరలేచింది. -
మాదిగలు ఏజెంట్లుగా కూర్చోకూడదా?
[ 15-05-2024]
మాదిగలు ఏజెంటుగా కూర్చునే హక్కు లేదా అని ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, కె.ఎన్.రాజు ప్రశ్నించారు. కడప ప్రెస్క్లబ్లో మంగళవారం వారు మాట్లాడుతూ -
రాళ్లదాడి ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులు...కేసు నమోదు
[ 15-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప రెండో పట్టణ ఠాణా పరిధిలోని గౌస్నగర్లో సోమవారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఇరువర్గాలు మంగళవారం సీఐ ఇబ్రహీంకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?