తరుణీ శరణం..!
పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.
మహిళా సంఘాల మద్దతుకు నేతల ప్రయత్నాలు
మండల సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం
చెన్నూరు పట్టణం, న్యూస్టుడే: పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా పొదుపు చేయడం.. రుణాలు స్వీకరించడం.. వాయిదాలు చెల్లించడం నెలనెలా సమావేశాలు నిర్వహించడం నిరంతరం చేస్తుంటారు. ఇంతవరకే వీరి పాత్ర పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లోనూ వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకుంటే విజయం సాధించడం తథ్యమని రాజకీయ పార్టీల నేతలు భావిస్తుంటారు. అందుకే ఆ దిశగా పావులు కదుపుతుంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వీరివైపు చూస్తున్నాయి.. తరుణుల కరుణ కోసం నేతలు రహస్య మంతనాలు మొదలుపెట్టారు. సంఘాల ప్రతినిధులతో మాటమంతీ చేస్తున్నారు. కరుణించాలని వేడుకుంటున్నారు..
మీ మద్దతు కావాలని..
గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. ఇలా ఒక్కో మండలంలో సుమారు 5వేల నుంచి 10వేల మంది సభ్యులు ఉన్నారు. పురపాలికల్లో కూడా అదే స్థాయిలో ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు దృష్టిసారించారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా వ్యూహాలను పన్నుతున్నారు. సంఘాల్లో కీలకంగా వ్యవహరించే వారి సహకారంతో సభ్యుల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓట్లను పొందేందుకు అన్నింటికీ సిద్ధపడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉన్న నాయకులను రంగంలోకి దింపుతున్నారు. విజయం సాధిస్తే సంఘాల అభివృద్ధికి కృషిచేస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు.. సంఘాల సభ్యులను ఒప్పిస్తే ఆ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ తమకే వస్తాయని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలు పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 23,01,424 మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో 11,72,832 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,878 గ్రామైక్య సంఘాలు, 67,644 స్వయం సహాయ సంఘాలు, 7,20,115 మంది సభ్యులు కొనసాగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్మల్ లో ఘనంగా ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, అధికారులు అమరవీరుల స్తూపానికి జ్యోతి వెలిగించి, పూలు జల్లి నివాళులర్పించారు. -
కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ అవతరణ వేడుకలు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షి షా జాతీయ జెండా ఎగురవేయగా.. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఒకే రకం విత్తనాలు వాడొద్దు
[ 02-06-2024]
రైతులు ఒకేరకం విత్తనాలు వాడొద్దని, అన్ని రకాల విత్తనాలు సాగులో వినియోగించాలని ఏఈవో సాయి ప్రసాద్ తెలిపారు. -
తాంసిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
మండలంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
రైతులకు పత్తి విత్తనాల పంపిణీ
[ 02-06-2024]
మండల కేంద్రంలో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాశి -659 పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. -
పాలన చేరువ.. కావాలి చొరవ
[ 02-06-2024]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయ్యింది. ఈ పదేళ్ల కాలంలో జిల్లా రూపురేఖలు మారినా ఇంకా సౌకర్యాల కోసం విషయంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
అభివృద్ధి పథం.. ఆశల సమాహారం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటి(జూన్ 2)తో పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. -
ఒకే విత్తనంపై ఆధారపడొద్దు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. ఒకే రకమైన విత్తనానికి డిమాండ్ కనిపిస్తోంది. డీలర్ల మాయాజాలం అంతుచిక్కడం లేదు. -
భీం స్ఫూర్తి.. వెలగాలి ప్రగతి దీప్తి!
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పది వసంతాలు పూర్తి చేసుకుని నేటితో 11వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కుమురం భీం స్ఫూర్తితో కొత్త జిల్లా ఆవిర్భవించింది. -
భగ్గుమన్న భానుడు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
హత్య చేసి.. కాల్చేశారు..
[ 02-06-2024]
గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద