సీఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త
సీˆఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని భారాస పెద్దపల్లి ఎంపీˆ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్
బెల్లపల్లిలో మాట్లాడుతున్న భారాస ఎంపీˆ అభ్యర్థి ఈశ్వర్
బెల్లంపల్లి పట్టణం, న్యూస్టుడే: సీˆఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని భారాస పెద్దపల్లి ఎంపీˆ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈశ్వర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీని గెలిపించాలని కోరారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోటీశ్వరుల కుటుంబం గెలిస్తే ప్రజల కోసం చేసేది ఏమీ ఉండదన్నారు. ఒకే ఇంట్లో ముగ్గురికి పదవులు ఇవ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కుటుంబ పాలనంటూ కేసీˆఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు చేస్తున్నది ఏమిటన్నారు. ప్రజలంతా కార్మికుడిగా పనిచేసిన వ్యక్తిని ఎంపీˆగా గెలిపించాలన్నారు. కార్పొరేట్ శక్తులను గెలిపిస్తే ప్రజలకు ఏమీ చేయలేరన్నారు. కాంటాచౌరస్తా, బజార్ఏరియాల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, తెబొగకాసం నాయకులు శ్రీనివాస్, సంపత్, రమేష్ పాల్గొన్నారు.
‘కుటుంబ పాలనే కొనసాగాలా?’
భీమారంలో మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్
భీమారం, న్యూస్టుడే: 40 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కుటుంబ హక్కుగా వారసుల పాలనే కొనసాగాలా? లేక స్థానికంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతను గెలిపించుకోవాలో ప్రజలు నిర్ణయించుకోవాలని పెద్దపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ ఓట్లు, సీట్లు ఈ ప్రాంతంలో గెలిచి ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టి నియోజకవర్గాలకు సెలవు దినాల్లో మాత్రమే వచ్చిపోయే వివేక్ కుటుంబం వంటి నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం నేర్పించాలన్నారు. తాతల నుంచి పదవులు అనుభవిస్తున్న వారి కుటుంబాల స్థితులు మార్చుకున్నారే కానీ స్థానిక ప్రజల స్థితిగతులను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. సింగరేణి సంస్థ, జైపూర్ పవర్ ప్లాంట్ను ఆదుకున్నామని చెప్పే నాయకులు స్థానికుల ఉద్యోగావకాశాలు, డిపెండెంట్ ఉద్యోగాల కోసం కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో కనీసం ఒక్కసారైనా నియోజకవర్గంలో కనిపించారా వారికి ఎన్నికలు తప్ప ప్రజల బాగోగులు పట్టవన్నారు. భారాస పాలనలో ప్రజలు పడరాని పాట్లు పడ్డారని పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మండలాధ్యక్షుడు బోర్లకుంట శంకర్, ప్రధాన కార్యదర్శులు వెల్పుల రాజేష్, మాడెం శ్రీనివాస్, విజయ, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాలకు న్యాయం
మందమర్రిలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
రామకృష్ణాపూర్, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. సోమవారం మందమర్రి కేకే5 గనిపై ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ప్రసాద్తో కలిసి ద్వార సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల భారాస పాలనలో ఇసుక దందాలు, భూకబ్జాలు చేశారని ఎంపీ అభ్యర్థి ఆరోపించారు. భారాస అధినేత కేసీఆర్, ఎంపీలు సింగరేణి కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. భారాస హయాంలో కొత్త గనులు, ప్రభుత్వ సంస్థలు ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. మందమర్రిలో తోళ్ల పరిశ్రమ పునఃప్రారంభించి 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఉపాధిహామీ కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉపాధిహామీ కూలి రూ.400 అందజేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్మల్ లో ఘనంగా ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, అధికారులు అమరవీరుల స్తూపానికి జ్యోతి వెలిగించి, పూలు జల్లి నివాళులర్పించారు. -
కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ అవతరణ వేడుకలు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షి షా జాతీయ జెండా ఎగురవేయగా.. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఒకే రకం విత్తనాలు వాడొద్దు
[ 02-06-2024]
రైతులు ఒకేరకం విత్తనాలు వాడొద్దని, అన్ని రకాల విత్తనాలు సాగులో వినియోగించాలని ఏఈవో సాయి ప్రసాద్ తెలిపారు. -
తాంసిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
మండలంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
రైతులకు పత్తి విత్తనాల పంపిణీ
[ 02-06-2024]
మండల కేంద్రంలో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాశి -659 పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. -
పాలన చేరువ.. కావాలి చొరవ
[ 02-06-2024]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయ్యింది. ఈ పదేళ్ల కాలంలో జిల్లా రూపురేఖలు మారినా ఇంకా సౌకర్యాల కోసం విషయంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
అభివృద్ధి పథం.. ఆశల సమాహారం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటి(జూన్ 2)తో పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. -
ఒకే విత్తనంపై ఆధారపడొద్దు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. ఒకే రకమైన విత్తనానికి డిమాండ్ కనిపిస్తోంది. డీలర్ల మాయాజాలం అంతుచిక్కడం లేదు. -
భీం స్ఫూర్తి.. వెలగాలి ప్రగతి దీప్తి!
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పది వసంతాలు పూర్తి చేసుకుని నేటితో 11వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కుమురం భీం స్ఫూర్తితో కొత్త జిల్లా ఆవిర్భవించింది. -
భగ్గుమన్న భానుడు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
హత్య చేసి.. కాల్చేశారు..
[ 02-06-2024]
గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
ఏపీలో కూటమిదే విజయం: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల