తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు.
నందిగామ, న్యూస్టుడే : నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. మరోవైపు వైకాపా అభ్యర్థి జగన్మోహనరావు సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్కుమార్ని మాత్రం కేంద్రం ఆవరణలోకి వదిలిపెట్టారు. ఆయన తన అనుచరులతో వచ్చి హల్చల్ చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు. వివరాల్లోకి వెళ్తే... ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాకాని వెంకటరత్నం కళాశాల ఆవరణలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఓటింగ్ ఉండదని ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, పార్టీల ప్రతినిధులకు చెప్పారు. కొంత మంది ఉద్యోగులు ఇళ్లకు వెళ్లారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓపీవోలు, బీఎల్వోలు ఎక్కువ మంది వచ్చినట్లు ఆర్వో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఓటింగ్ పెట్టాలని ఆయన ఆదేశించారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకు ఓటింగ్ ప్రారంభించారు. అప్పుడే పార్టీల నాయకులకు సమాచారం ఇవ్వగా.. హడావుడిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. మొదటి అంతస్తులో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దివ్యాంగులు, కొందరు ఉద్యోగులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడినట్లు ఓ దివ్యాంగ ఉపాధ్యాయుడు వాపోయారు.
పరిశీలనకు సౌమ్య రాక
ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు తెదేపా అభ్యర్థిని తంగిరాల సౌమ్య రాగా.. వైకాపా ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. వెంటనే ఆర్వో వచ్చి ఆమెను పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించారు. అభ్యర్థిగా పోలింగ్ కేంద్రంలోకి తాను రావొచ్చని ఆమె చెప్పినా ఆర్వో పట్టించుకోలేదు. రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తరువాత న్యాయవాదులతో తెదేపా నాయకులు మాట్లాడి అభ్యర్థికి అనుమతి ఉంటుందని ఆర్వోకు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఆర్వో వచ్చి ఆమెను కేంద్రంలోకి అనుమతించారు. ఆర్వో ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాయకులు చెప్పారు. పోలింగ్ జరుగుతుండగా వైకాపా ప్రచార వాహనాల మైకులు హోరెత్తాయి.
వైకాపా ఎమ్మెల్సీకి అనుమతి...
వైకాపా అభ్యర్థి జగన్మోహనరావు సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్కుమార్ తన అనుచరులతో రాగా.. పోలింగ్ కేంద్రం ఆవరణలోకి అనుమతించారు. తెదేపాతో సహా మిగిలిన వారిని మాత్రం కేంద్రం ఆవరణలోకి పోలీసులు అనుమతించ లేదు. ఎమ్మెల్సీతో పాటు వచ్చిన నాయకులు సీఎం జగన్ సిద్ధం బ్యాడ్జీలు ధరించి వచ్చి మరీ హల్చల్ చేశారు. పోలీసులు ఎమ్మెల్సీకి అనుకూలంగా వ్యవహరించారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులను వైకాపా ఏజెంట్లు ప్రలోభాలకు గురి చేశారు. దీనిపై ఆర్వో మాట్లాడుతూ.. ‘పోలింగ్ కేంద్రం ఆవరణలోకి ఎవరికీ అనుమతి లేదు. ఎమ్మెల్సీ వచ్చిన విషయం తెలియగానే పోలీసులకు చెప్పి బయటకు పంపించాను’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిలేడీ.. కొలువులు పేరుతో బురిడీ
[ 18-06-2024]
నిరుద్యోగులే ఆమె లక్ష్యం. తీయని మాటలు చెప్పి విదేశాలకు పంపిస్తానంటూ డబ్బులు గుంజుకుని మోసం చేయడం ఆమె వృత్తి. మోసపోయామని తెలుసుకొని తిరిగి డబ్బులు అడిగిన బాధితులను బెదిరించడం ఆమె నైజం. -
గుల్ల చేసినోళ్లు.. గుట్టు తేల్చాల్సిందే!
[ 18-06-2024]
జగనన్న కాలనీల పేరు చెప్పి.. కొండలు కొల్లగొట్టారు.. అటవీ భూములు తవ్వారు.. ప్రభుత్వ, అసైన్డ్ భూములు తవ్వారు.. పోలవరం కట్టలను కరిగించేశారు.. ఆఖరికి చెరువులనూ ఊడ్చేశారు.. ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లలో జరిగిన మట్టి దందా ఇది. -
నీతులు వల్లించి.. నిధులు మళ్లించి!
[ 18-06-2024]
విజయవాడ నగరంలో చినుకు పడితే చాలు రహదారులన్నీ చెరువులైపోతున్నాయ్. ఓ మోస్తరు వాన పడితే.. కాలనీలు సైతం నీట మునుగుతున్నాయి. ఓ గంట గట్టిగా కుండపోత వర్షం కురిస్తే.. నగరమే అతలాకుతలం అయిపోతోంది. -
తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు
[ 18-06-2024]
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. -
కొత్త ఆటోనగర్లో హోంమంత్రి కార్యాలయం
[ 18-06-2024]
కానూరు కొత్త ఆటోనగర్ రెండో రోడ్డులో ఉన్న పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కుమార్ కార్యాలయంలో రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
గోవధను అడ్డుకున్న స్వచ్ఛంద సంస్థ
[ 18-06-2024]
స్థానిక 6వ వార్డులోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో సోమవారం ఉదయం గోవధ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మచిలీపట్నం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ ఎగెనెస్ట్ యానిమల్స్ సొసైటీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. -
అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తాం
[ 18-06-2024]
అన్న క్యాంటీన్లలను తిరిగి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. -
స్వయంభూ.. సర్దుకోవడమే
[ 18-06-2024]
విజయవాడలో ఉత్పత్తి అవుతున్న చెత్త తరలించేందుకు కార్పొరేషన్ అడక్కపోయినా.. ప్రభుత్వం అంటగట్టిన సీఎన్జీ వాహనాలకు త్వరలో బ్రేక్ పడనుంది. -
ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు
[ 18-06-2024]
విజయవాడ పాయకాపురం, శాంతినగర్లో వైకాపా నాయకుడు నందెపు జగదీష్ శిరోముండనం చేయించుకుని, అర్ధనగ్న ప్రదర్శనతో సోమవారం హడావుడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. -
పోలవరంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ
[ 18-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ద్వారా అన్నదాతల సమస్యల పరిష్కారంపై ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ విశదమైందని తెదేపా రైతు సంఘాల రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. -
కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
[ 18-06-2024]
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఏపీ రైతు సంఘం కమిటీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడ దాసరి భవన్లో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. -
20 నుంచి ఐటీఐల్లో ప్రవేశాల కౌన్సెలింగ్
[ 18-06-2024]
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 20, 21, 22 తేదీల్లో జనరల్ పూల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. -
తడి.. పొడి.. లక్ష్యం తిరగబడి
[ 18-06-2024]
గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఆర్థిక వనరులు మెరుగపర్చాలన్న లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలను ఆతరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
-
పిల్లలకు హెల్దీ లంచ్బాక్స్.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!
-
లంచమిస్తే మాత్రం అరుస్తావేంటి!.. వీఆర్వో, రైతు సంభాషణ వైరల్
-
కేజీహెచ్ ఐసీయూలో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ..
-
ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు
-
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం