పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు.
ఎస్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. ఈశ్వర్ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ పేర్ని, ఆయన కుమారుడు కిట్టూ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏపార్టీలో ఉన్నా నియోజకవర్గంలో ఏ ఒక్కరినీ ఎదగనీయకుండా చేసి కుటుంబ వారసత్వానికే పెద్దపీట వేసుకుంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని టిక్టాక్స్టార్గా పేరు తెచ్చుకున్న కుమారుడు కిట్టూను రంగంలోకి దింపారనీ, గంజాయిబ్యాచ్ను వెంటేసుకుని తిరిగే ఆయనకు ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టదన్నారు.
పోర్టు నిర్మించాకే ఓటు అడుగుతానని చెప్పి..
మచిలీపట్నంలో అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి రూ.5 కోట్లు నిధులు మంజూరైతే అవి ఏమయ్యాయో తెలియకుండా చేశారన్నారు. పోర్టు నిర్మించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానంటూ హామీ ఇచ్చి మళ్లీ ఓటు రాజకీయం కోసం పోర్టు పనులు 10 శాతం కూడా పూర్తిచేయకుండా ఎలా ప్రజలకు ముఖం చూపిస్తున్నారో చెప్పాలన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో అకృత్యాలు, అరాచకాలు, దోపిడీలు, బెదిరింపులు, హత్యలకు గురవుతూ రాజ్యాంగ కల్పించిన హక్కులను కూడా దూరం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎస్ఎస్డీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్షిండే మాట్లాడుతూ పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గం అభివృద్ధికి ఏమి చేయలేదన్నారు. ఎస్ఎస్డీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
జగన్కు ఓటేస్తే ఐదేళ్లు మళ్లీ నరకం
పెడన, న్యూస్టుడే: వైకాపాకు ఓటేస్తే రానున్న ఐదేళ్లు ప్రజలు మరింత నరకం చవిచూడక తప్పదని సమతా సైనిక్ దళ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు పేర్కొన్నారు.. ఆదివారం పెడనలో పర్యటించిన ఆయన ఎస్సీ కాలనీలకు వెళ్లి ప్రజలను చైతన్యపర్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటేయవద్దని ఆపార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచించారు. అనంతరం స్థానిక వీరభద్రపురం కర్ణభక్త కల్యాణ మంటపంలో విలేకర్లతో మాట్లాడారు. జగనన్న కాలనీల పేరిట ఎస్సీలకు చెందిన 12వేల ఎకరాల భూముల్ని బలవంతంగా ప్రభుత్వం తీసుకుందని తద్వారా ఎస్సీలు ఉపాధిని కోల్పోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ షిండే, స్థానిక నేతలు కమ్మగంటి వెంకటేశ్వరరావు, బొడ్డు చినబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వప్నాలు చెదిరినా.. స్వప్నిల్ తీరింతే..!
[ 02-06-2024]
మేం కళ్లు మూసుకున్నాం.. మీరూ కళ్లు మూసుకోండి... జనం ఎలా చనిపోతే ఏంటి? అసలెందుకు ప్రాణాలు పోతున్నాయో? అంటోంది ఘనత వహించిన విజయవాడ నగర పాలక సంస్థ. నిద్రపోతున్నవాళ్లను లేపవచ్చేమోకానీ.. నటించేవాళ్లను ఏమాత్రం మేల్కొల్పలేము! -
ఉన్నారా...? కళ్లు మూసుకున్నారా?
[ 02-06-2024]
నగరంలో కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోవడానికి.. వందలాదిమంది ఆసుపత్రులపాలవడానికి కారణాలేమిటో కనుగొనేందుకు వీఎంసీ ఇంతవరకు ఓ విచారణ బృందాన్ని కూడా నియమించలేదు. -
భజే వాయుపుత్రం!
[ 02-06-2024]
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. స్మరణతో ఆలయాలు మార్మోగాయి. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంజనీపుత్రుడికి విశేష పూజలు నిర్వహించి.. ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. -
మట్టి తవ్వకాలపై ఎన్టీఆర్ కలెక్టర్ కన్నెర్ర
[ 02-06-2024]
‘మీకు ఎంత చెప్పినా చెవికి ఎక్కడం లేదా..? విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు. మీ ప్రాంతంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!’ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. -
ఎన్నికల ఫలితాలు సకాలంలో ప్రకటించాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు పటిష్ఠంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
[ 02-06-2024]
వ్యవసాయశాఖ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గోల్మాల్ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తితో పాటు వ్యవసాయశాఖ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగుచూస్తోంది. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
[ 02-06-2024]
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయంలో రుత్వికులు పూజలు నిర్వహించారు. -
మా అవస్థలు పట్టవా?
[ 02-06-2024]
కాలువలపై సిమెంటు దిమ్మెలు బాగా దెబ్బతిన్నాయి. ఇనుప చువ్వలు సైతం బయట పడ్డాయి. కొన్నిచోట్ల పైకిలేచి ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. -
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రార్థ్ధనలు
[ 02-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని తెదేపా మహిళా నాయకులు శనివారం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. -
బాగుచేసేదెప్పుడో?
[ 02-06-2024]
భవానీపురం పరిధిలోని పలు రహదారులు అధ్వానంగా మారాయి. భారీ గోతులు పడటంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్