వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా
ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు.
ఇంటింటి ప్రచారానికి పంపుతున్న అధికార పార్టీ
గుడ్లవల్లేరు, న్యూస్టుడే: ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. ఇప్పటివరకూ తెదేపా, జనసేన అధినేతలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా వాలంటీర్లు తమ సొంతవారేనని వైకాపా నాయకత్వం నేరుగా ప్రకటించినట్లయ్యింది. గుడ్లవల్లేరు మండలంలోని 22 పంచాతీల్లో మొత్తం 300 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వారిలో అంగలూరులో 6, డోకిపర్రు1లో 15, 2లో 13, గుడ్లవల్లేరు1లో 20, 2లో 18, శేరిదగ్గుమిల్లిలో 10, శేరికల్వపూడిలో 10, వడ్లమన్నాడులో 8, వేమవరంలో 5, విన్నకోటలో 14, పురిటిపాడులో 3 వంతున మొత్తం 122 మంది రాజీనామా చేసినట్లు వైకాపా ఎంపీపీ కొడాలి సురేశ్ మండల పరిషత్తు కార్యాలయం అధికారిక వాట్సాప్గ్రూప్లో వెల్లడించారు. స్థానిక మండల వైకాపా కార్యాలయం నుంచి పలువురు నాయకులు వాలంటీర్లకు ఫోన్లు చేసి రాజీనామాలు చేసి రావాలని ఒత్తిడి తెచ్చారు. వచ్చిన వారికి ఎంపీ, ఎమ్మెల్యేల గుర్తులకు ఓటేసే విధానం తెలిపే కరపత్రాలను అందించి వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. దీంతో వారంతా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆదివారమే అంగలూరులో ఈ వాలంటీర్లు రాజీనామా చేయకుండానే నేరుగా గ్రామస్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయడం గమనార్హం. అలాగే మహిళా వాలంటీర్ల భర్తలు పలువురు వాలంటీర్లతో కలిసి ప్రభుత్వ లబ్ధి అందించే క్రమంలో పాల్గొన్నారు. సోమవారం పలువురు మహిళా వాలంటీర్ల భర్తలను వైకాపా పోలింగ్బూత్ ఏజెంట్లుగా నియమించారు. రేపు వారు పోలింగ్ రోజున ఓటేయడానికి వచ్చే ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉందని తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి ద్వారా వారి పరిధిలోని ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోందని తెదేపా, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
[ 02-06-2024]
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. -
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
[ 02-06-2024]
ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
[ 02-06-2024]
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి (భాజపా) సి.ఎం.రమేశ్ అన్నారు. -
స్వప్నాలు చెదిరినా.. స్వప్నిల్ తీరింతే..!
[ 02-06-2024]
మేం కళ్లు మూసుకున్నాం.. మీరూ కళ్లు మూసుకోండి... జనం ఎలా చనిపోతే ఏంటి? అసలెందుకు ప్రాణాలు పోతున్నాయో? అంటోంది ఘనత వహించిన విజయవాడ నగర పాలక సంస్థ. నిద్రపోతున్నవాళ్లను లేపవచ్చేమోకానీ.. నటించేవాళ్లను ఏమాత్రం మేల్కొల్పలేము! -
ఉన్నారా...? కళ్లు మూసుకున్నారా?
[ 02-06-2024]
నగరంలో కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోవడానికి.. వందలాదిమంది ఆసుపత్రులపాలవడానికి కారణాలేమిటో కనుగొనేందుకు వీఎంసీ ఇంతవరకు ఓ విచారణ బృందాన్ని కూడా నియమించలేదు. -
భజే వాయుపుత్రం!
[ 02-06-2024]
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. స్మరణతో ఆలయాలు మార్మోగాయి. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంజనీపుత్రుడికి విశేష పూజలు నిర్వహించి.. ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. -
మట్టి తవ్వకాలపై ఎన్టీఆర్ కలెక్టర్ కన్నెర్ర
[ 02-06-2024]
‘మీకు ఎంత చెప్పినా చెవికి ఎక్కడం లేదా..? విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు. మీ ప్రాంతంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!’ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. -
ఎన్నికల ఫలితాలు సకాలంలో ప్రకటించాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు పటిష్ఠంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
[ 02-06-2024]
వ్యవసాయశాఖ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గోల్మాల్ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తితో పాటు వ్యవసాయశాఖ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగుచూస్తోంది. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
[ 02-06-2024]
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయంలో రుత్వికులు పూజలు నిర్వహించారు. -
మా అవస్థలు పట్టవా?
[ 02-06-2024]
కాలువలపై సిమెంటు దిమ్మెలు బాగా దెబ్బతిన్నాయి. ఇనుప చువ్వలు సైతం బయట పడ్డాయి. కొన్నిచోట్ల పైకిలేచి ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. -
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రార్థ్ధనలు
[ 02-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని తెదేపా మహిళా నాయకులు శనివారం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. -
బాగుచేసేదెప్పుడో?
[ 02-06-2024]
భవానీపురం పరిధిలోని పలు రహదారులు అధ్వానంగా మారాయి. భారీ గోతులు పడటంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు