బందరు సాక్షిగా జగన్ అబద్ధాలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు.
కోనేరుసెంటరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు. రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన జగన్ ఉపన్యాసం పేలవంగా సాగింది. దాదాపు అరగంట ప్రసంగించిన ఆయన ప్రతి ఒక్కరినీ కలవరపర్చేలా చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సమర్థించుకునేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. కొందరు జగన్ రాకకు ముందే వెళ్లిపోగా మరికొందరు సీఎం మాట్లాడే వేళ వెనుదిరిగారు.
అంతా తానే చేశారట...
చర్రితలో ఎవరూ చేయలేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తనదే అని చెప్పుకొన్న జగన్ బందరు అభివృద్ధిని ప్రస్తావిస్తూ పోర్టు, హార్బర్, వైద్యకళాశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. బందరు పోర్టుతో పాటు గిలకలదిండి ఫిషింగ్ హార్బర్కు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అవసరమైన అడుగులు పడుతూనే ఉన్నాయి. జగన్ అధికారం చేపట్టే నాటికే నవయుగ సంస్థ పోర్టు పనులు ప్రారంభించగా, హార్బర్కు నిధులు మంజూరయ్యాయి. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోర్టు పనులను వేగంగా పూర్తిచేసి మళ్లీ ఎన్నికల లోపు ఓడను తీసుకువస్తామని హామీ ఇచ్చిన జగన్ రమారమి ఏడాది కిందట వరకూ పోర్టు పనుల వైపు కన్నెత్తి చూడలేదు. 2023 మేలో సీఎం స్వహస్తాలతో పోర్టు పనులకు శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకూ పురోగతి లేదు. ఇదే తీరున పనులు కొనసాగితే పోర్టు రెండు దశల పనులు పూర్తికావాలంటే మరో ఐదేళ్లూ చాలదు. ఏనాటి నుంచో ప్రతిపాదనల దశలో ఉన్న వైద్య కళాశాల, హార్బర్లకు రెండేళ్ల కిందట కేంద్రం అనుమతులు ఇచ్చింది. వీటికి కేంద్రం సమకూర్చాల్సిన 50 శాతం నిధుల విడుదల కూడా ఎంపీ బాలశౌరి చొరవతో దరి చేరగా పనులు ప్రారంభించారు. వైద్య కళాశాలకు భూముల కొనుగోలు విషయంలో రూ.6 కోట్ల అవినీతి జరిగిందన్న కాగ్ నివేదిక నేపథ్యంలో ఎట్టకేలకు పనులు చేపట్టారు. వైద్య విద్యార్థుల తొలి ఏడాది తరగతుల నిర్వహణకు అనువుగా పనులు పూర్తి చేసినా, ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. హార్బర్ విషయంలోనూ ఏళ్లు గడిచినా పురోగతి అంతంతే. వాస్తవం ఇలా ఉంటే రూ.వేల కోట్ల అంచనాలని పోర్టు, హార్బర్, వైద్యకళాశాల కేవలం తన వల్లే సాధ్యపడినట్లు జగన్ చెప్పుకొచ్చారు.
ప్రజలకు తప్పని అవస్థలు
మధ్యాహ్నం నుంచే రేవతి సెంటరు నుంచి కోనేరుసెంటరు వరకూ రెండు వరుసల రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. అనుసంధాన దారులకు బారికేడ్లను అడ్డుగా పెట్టడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలను నియంత్రించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలనూ మూయించి వేశారు. పోలీసుల అత్యుత్సాహంతో నాలుగు గంటల చుక్కలు చూపారు.
సొమ్మసిల్లిన మహిళలు..
నగరంలో ప్రతి డివిజన్, గ్రామాల నుంచి కార్పొరేటర్లు, పార్టీ ఇన్ఛార్జ్లు ఆటోలుపెట్టి కొందరికి రూ.300 ఇచ్చి సభకు జనాలను తీసుకువచ్చారు. విపరీతమైన ఉక్కపోతతో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరో వార్డు మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీస్ వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉక్కపోత తట్టుకోలేక సభకు ముందే కొందరు వెళ్లిపోయారు. జగన్ రాకముందు పేర్ని నాని, కిట్టూ ప్రసంగిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వప్నాలు చెదిరినా.. స్వప్నిల్ తీరింతే..!
[ 02-06-2024]
మేం కళ్లు మూసుకున్నాం.. మీరూ కళ్లు మూసుకోండి... జనం ఎలా చనిపోతే ఏంటి? అసలెందుకు ప్రాణాలు పోతున్నాయో? అంటోంది ఘనత వహించిన విజయవాడ నగర పాలక సంస్థ. నిద్రపోతున్నవాళ్లను లేపవచ్చేమోకానీ.. నటించేవాళ్లను ఏమాత్రం మేల్కొల్పలేము! -
ఉన్నారా...? కళ్లు మూసుకున్నారా?
[ 02-06-2024]
నగరంలో కలుషిత నీరు తాగి పదిమంది ప్రాణాలు కోల్పోవడానికి.. వందలాదిమంది ఆసుపత్రులపాలవడానికి కారణాలేమిటో కనుగొనేందుకు వీఎంసీ ఇంతవరకు ఓ విచారణ బృందాన్ని కూడా నియమించలేదు. -
భజే వాయుపుత్రం!
[ 02-06-2024]
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. స్మరణతో ఆలయాలు మార్మోగాయి. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంజనీపుత్రుడికి విశేష పూజలు నిర్వహించి.. ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. -
మట్టి తవ్వకాలపై ఎన్టీఆర్ కలెక్టర్ కన్నెర్ర
[ 02-06-2024]
‘మీకు ఎంత చెప్పినా చెవికి ఎక్కడం లేదా..? విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు. మీ ప్రాంతంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..!’ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. -
ఎన్నికల ఫలితాలు సకాలంలో ప్రకటించాలి
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు పటిష్ఠంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. -
తవ్వేకొద్దీ అక్రమాలు
[ 02-06-2024]
వ్యవసాయశాఖ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గోల్మాల్ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తితో పాటు వ్యవసాయశాఖ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగుచూస్తోంది. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
[ 02-06-2024]
ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయంలో రుత్వికులు పూజలు నిర్వహించారు. -
మా అవస్థలు పట్టవా?
[ 02-06-2024]
కాలువలపై సిమెంటు దిమ్మెలు బాగా దెబ్బతిన్నాయి. ఇనుప చువ్వలు సైతం బయట పడ్డాయి. కొన్నిచోట్ల పైకిలేచి ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. -
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రార్థ్ధనలు
[ 02-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని తెదేపా మహిళా నాయకులు శనివారం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. -
బాగుచేసేదెప్పుడో?
[ 02-06-2024]
భవానీపురం పరిధిలోని పలు రహదారులు అధ్వానంగా మారాయి. భారీ గోతులు పడటంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు