అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వడిగేపల్లి ప్రచారంలో ప్రసంగిస్తున్న సవిత
గోరంట్ల, న్యూస్టుడే: మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తామన్నారు. మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రచారం సాగింది. మండల కన్వీనర్ సోమశేఖర్, రెండు పంచాయతీల నాయకులు మనోహర్, జయచంద్ర, మూర్తి, సర్పంచి నరసింహమూర్తి, చంద్రశేఖర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. చివరిలో దేవులచెరువులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.
సోమందేపల్లి : సోమందేపల్లి, మాగేచెరువు పంచాయతీ కొత్తపల్లిలో చేనేత నాయకుడు సీసీ హరి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ, సర్పంచి నరసింహులు ప్రచారం చేశారు.
పరిగి : విట్టాపల్లిలో తెదేపా మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.హనుమయ్య, నాగరాజు, బలరాం, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రొళ్ల: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పింఛను అందిస్తామని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎంఎస్ రాజు తెలిపారు. శనివారం రొళ్ల మండలంలోని హులికుంట, గుడ్డుగుర్కి, దొడ్డేరి, కాకి, రత్నగిరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత ఎంఎస్ రాజు పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర టీఎన్టీయూ కార్యదర్శి గురుమూర్తి, వక్కలిగ సాధికార కన్వీనర్ పాండురంగప్ప, కన్వీనర్ దాసిరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, ఆనంద్, పాండురంగప్ప, రాజకుమార్, మూర్తి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : మద్దనకుంటలో తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మద్దనకుంటకు చెందిన ఈరక్యాతప్ప, హనుమంతరాయప్ప, ఈరన్న, నాగరాజు తదితరులు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. అగళి : మండలంలోని అగళి, ఎంఎం.పాళ్యం గ్రామాల్లో ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు ఉమేశ్ తెదేపా తరఫున ప్రచారం చేశారు.
హిందూపురం అర్బన్ : ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీకే పార్థసారథికి ఓట్లు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ చంద్రమోహన్ యాదవ్, బూత్ఇన్ఛార్జి రామిరెడ్డి, మిథిలేశ్, సుధాకర్రెడ్డిలు కోరారు. శనివారం పురపాలక సంఘం పరిధిలోని మోతుకపల్లిలో వీరు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చి పథకాలు తీసుకొచ్చారన్నారు.
కేక్ కోసి రాజుకు తినిపిస్తున్న వక్కలిగ సాధికార కన్వీనర్ పాండురంగప్ప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 01-06-2024]
సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠకు తెర లేచింది. గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. -
నిఘా నీడలో తాడిపత్రి
[ 01-06-2024]
తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కౌంటింగ్ వేళ.. భద్రత కట్టుదిట్టం
[ 01-06-2024]
కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా జరిగేలా కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. -
మళ్లీ పింఛను ఇబ్బందులు తప్పవా?
[ 01-06-2024]
పింఛన్ లబ్ధిదారులకు జూన్లోనూ కష్టాలు తప్పేలా లేవు. రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం అయ్యాయి. -
వచ్చేది మా పార్టీయే.. తెదేపా కార్యకర్తలను చంపుతా
[ 01-06-2024]
మళ్లీ వచ్చేది మా పార్టీనే.. తెదేపా కార్యకర్తలను చంపుతా అంటూ ఓ వైకాపా కార్యకర్త మద్యం మత్తులో వేటకొడవలితో వీరంగం సృష్టించాడు. -
కబ్జాలు కనిపించవా..?
[ 01-06-2024]
మున్సిపల్ స్థలాల ఆక్రమణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. -
4 మార్కులు లెక్కించడం మరిచారు!
[ 01-06-2024]
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. అనంతపురం నగరానికి చెందిన విద్యార్థిని షేక్. -
దళిత మహిళ భూమి వైకాపా నాయకుడి పేరున మార్పు
[ 01-06-2024]
మండలంలోని పందిపర్తికి చెందిన పేద దళిత మహిళ గంగరత్న పేరుతో ఉన్న 3.81 ఎకరాల అసైన్డ్ భూమిని వైకాపా నాయకుడు సజ్జారెడ్డి పేరున ఎలా రికార్డులు మార్చారని తహసీల్దార్ అంజనాదేవిని దళిత నాయకులు నిలదీశారు. -
నిక్కచ్చిగా పనిచేస్తే ముచ్చెమటలెందుకు?
[ 01-06-2024]
ఐదేళ్లపాటు పోలీసులను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి.. ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. -
ఎరవేసి.. హతమార్చారు
[ 01-06-2024]
ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్కుమార్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. -
తొలి ఫలితం.. పుట్టపర్తి, మడకశిర
[ 01-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. -
కుళాయిల్లో గరళం!
[ 01-06-2024]
జీవకోటికి జలమే ప్రాణాధారం. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగంలో నిర్లక్ష్యం ఆవహించింది. జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, ధర్మవరం పట్టణాలకు చిత్రావతి రిజర్వాయరు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదే
[ 01-06-2024]
రాష్ట్రలో రైతన్నల ఆత్మహత్యల పాపం జగన్ సర్కారుదేనని ధర్మవరం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM