తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిన జగన్
గోరంట్ల, న్యూస్టుడే: సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వేలాదిమంది గిరిజన విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువుకొనసాగించేలా చేస్తోంది. తెదేపా హయాంలో 2016లో గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్పు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది వసతి గృహాలు పాఠశాలలుగా రూపాంతరం చెందాయి. ఇందులో అనంతపురం జిల్లాలో 5, శ్రీసత్యసాయి జిల్లాలో 4 (గోరంట్ల, పెనుకొండ, కదిరిలో రెండు) ఉన్నాయి. 2016 - 17 విద్యా సంవత్సరంలో ఒక్కో తరగతికి 40 మంది విద్యార్థుల ప్రకారం 120 మందితో 3, 4, 5 తరగతులతో గురుకుల పాఠశాలల ప్రారంభించారు. మరో అడుగు ముందుకేసి నూతన భవనాలు నిర్మించడానికి స్థలాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసింది. అంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ గురుకులాలకు గ్రహణం పట్టింది. అయిదేళ్లు దాటుతున్నా అది వీడలేదు. ఇంతవరకు భవన నిర్మాణాలు స్థలాల ఎంపిక ప్రక్రియ దాటలేదు. దీంతో అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది.
ఒక్క అడుగూ ముందుకు పడలే..
- గోరంట్ల మండలంలో 2018లో తెదేపా హయాంలో పాలసముద్రం రెవెన్యూ గ్రామపరిధిలో 44వ నంబరు జాతీయ రహదారికి ఆనుకుని సర్వేనంబరు 129 - 2బీలో అయిదెకరాల స్థలాన్ని కేటాయించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. ఆ తరువాత వైకాపా అధికారంలోకి రావడంతో ఇంతవరకు ఈ ఊసేలేదు. ఆ స్థలాన్ని ఇతరత్రా కార్యక్రమాలకు మార్చాలన్న ప్రయత్నాలు జరిగాయి.
- పెనుకొండలో వైద్య కళాశాలకు ఎంపిక చేసిన చోటే గిరిజన గురుకుల బాలికల పాఠశాల నిర్మాణానికి అయిదెకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అయిదేళ్లు దాటినా ఇంతవరకు భవనం నిర్మించాలన్న ఆలోచన ఈ పాలకులకు రాలేదు. ప్రస్తుతం పాత వసతి గృహంలోనే అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు.
- కదిరి బాలురు, బాలికలకు రెండు గురుకులాలు మంజూరయ్యాయి. ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గిరిజన బాలుర వసతి గృహంలో పాఠశాల నడుస్తోంది. వర్షాకాలంలో భవనంలోకి నీరొచ్చి తీవ్ర ఇబ్బంది అవుతుండటంతో సమీపంలోనే మైనార్టీల కోసం నిర్మించిన వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ చిన్నచిన్న గదులు కావడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాలికల పాఠశాలను తాత్కాలికంగా మరో భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. రెండింటికీ స్థలాలు గుర్తించారు. కానీ, భవన నిర్మాణాలు మాత్రం జరగలేదు.
అక్కడే చదువు.. భోజనం
దశాబ్దాల కిందట నిర్మించిన వసతి గృహాల్లోనే చదువుకోవాలి. అక్కడే భోజనం చేయాలి. అదే స్థలంలో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెగ్యులర్ పోస్టులు అసలు మంజూరు కాలేదు. కేవలం పొరుగుసేవల కింద నియమించిన సిబ్బందితో బోధన కొనసాగుతోంది. వారికి కూడా తక్కువ వేతనాలు ఇస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో మూడు నుంచి పది వరకు ఎనిమిది తరగతుల్లో 320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్