9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు.
ఏడు గంటలూ సక్రమంగా ఇవ్వని దుస్థితి
అన్నదాతలను అష్టకష్టాలు పెట్టిన వైకాపా సర్కారు
ఇక నిన్ను నమ్మం పాలకా..
రైతులు రాత్రి పూట పొలానికి వెళ్లి పంటలకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పగటిపూటే వ్యవసాయ కనెక్షన్లు అన్నింటికీ నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తాం.
ప్రతిపక్ష నేతగా పలు సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీ
అనంతపురం (విద్యుత్తు), లేపాక్షి, న్యూస్టుడే: మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. అన్నదాతలను నిలువునా ముంచేశాడు. మళ్లీ ఓట్లు వేయాలంటూ రోడ్డెక్కి హామీలు గుప్పిస్తున్నాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు జగన్ సర్కారు ఏడు గంటల సరఫరా కూడా ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొంది. రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగు చేసిన పంటలకు తడులు అందించకపోవటంతో కళ్లముందే ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు కార్యాలయాలు, ఉపకేంద్రాల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. కరెంటు సరఫరా కోసం రైతులు తమ పొలాల్లో రాత్రి పూట పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరఫరాలోనూ అంతరాయాలు కలుగుతుండటంతో కంటికి నిద్ర లేకుండా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్చుతగ్గుల సరఫరాతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. మరమ్మతులు చేయించడానికి వ్యయప్రయాసలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు..
విడతల వారీగానే..
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పగటి పూట నిరంతరాయంగా తొమ్మిది గంటల సరఫరా కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సర్వీసులకు సరఫరా చేస్తున్న ఫీడర్లు 823 ఉండగా...ఒకే విడతలో ఏడు గంటల సరఫరా ఇచ్చినవి 182. దీని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇచ్చారు. రెండు విడతల్లో 621 ఫీడర్ల పరిధిలో ఉన్న సర్వీసులకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు ఒకసారి... రెండోసారి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6వరకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 20 ఫీడర్లలో ఉన్న 30 వేల సర్వీసులకు మూడు విడతల్లో విద్యుత్తు ఇస్తున్నారు. వ్యవసాయ సర్వీసులకు రెండు గంటల పాటు కోత పెట్టి.. గృహ, వాణిజ్య, పరిశ్రమలకు అందిస్తున్నారు.
కోతలతో రైతులకు ఉరి
అగళి: మండలంలోని పలు ఫీడర్లలో రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేకపోవడంతో బోరుబావుల్లో వచ్చే నీటితో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నిత్యం తొమ్మిది గంటల పగటిపూట విద్యుత్తు సరఫరా చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రగల్బాలు పలికింది. ఆచరించకపోవడంతో రైతులకు ఉరితాడైంది. మండలంలో కొమరేపల్లి, కదిరేపల్లి, కంబదపల్లి గ్రామాల్లో నిత్యం రెండు, మూడు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నారని, పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఇటీవల మధూడి విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ధర్నా చేశారు. ఇప్పటికే సాగు చేసిన 120 ఎకరాల్లో వక్క, మిరప, వేరుసెనగ, పూల తోటలు వాడిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కదిరేపల్లి వద్ద ఎండిపోయిన వక్క తోట
ఉమ్మడి జిల్లాలో ఇలా..
వ్యవసాయ కనెక్షన్లు : 3.10 లక్షలు
అన్ని కేటగిరీల కనెక్షన్లు : 14 లక్షలు
గతేడాది ఏప్రిల్లో విద్యుత్తు వినియోగం: 18.815 మిలియన్ యూనిట్లు
ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో వినియోగం : 19.304 మిలియన్ యూనిట్లు
వేరుసెనగ వాడిపోయింది
నేను సాగు చేసిన రెండు ఎకరాల వేరుసెనగ పంటతోపాటు, ఎకరం మిరప పంట పూర్తిగా వాడిపోయింది. నిత్యం ఇష్టానుసారంగా రెండు గంటలు కూడా విద్యుత్తు సరఫరా చేయడం లేదు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దాదాపు రూ.75 వేలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
నాగరాజు, రైతు, కొమరేపల్లి
అన్నీ ఉత్తి మాటలే..
లేపాక్షి: గలిబిపల్లికి చెందిన రాజన్న 3 ఎకరాల పొలంలో మొక్కజొన్న, మల్బరీ సాగు చేస్తున్నారు. ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సరఫరా ఇస్తున్నారు. ఈ లెక్కన రోజూ 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలకు నీరు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి. ఖరీఫ్లో మొక్కజొన్న పంటకు నీరుందక పంట దిగుబడి తగ్గిందని రైతు వాపోతున్నారు.
పంటలు ఎండుతున్నాయి
ఓబుళదేవరచెరువు: మండలంలోని కొండకమర్ల పంచాయతీ గంగిరెడ్డిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి రెండు ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. మందులు, ఎరువులకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. రోజుకు 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తేనే పంటకు నీరు అందుతుంది. ప్రభుత్వం పగటి పూటే 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. పగలు 4, రాత్రి 3 గంటలు మొత్తం కలిపి 7 గంటలే సరఫరా చేస్తున్నారు. అందులోనూ కోతలు విధిస్తుండటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తక్కువ సమయం కరెంటు సరఫరా చేయడంతో పంటకు పూర్తిగా నీరు అందక ఎండు ముఖం పడుతోంది. జగన్ ప్రభుత్వం తమను ఆదుకోలేకపోయిందని రైతు వాపోయారు. వేలకు వేలకు పెట్టుబడి పెట్టి విద్యుత్తు కోతలతో సకాలంలో పంటకు నీరందక నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత పెంపు
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్