ఇదేం ఉచితం.. జగనన్నా..!
విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు సీట్లు
‘అమ్మఒడి’ నుంచి ఫీజు వసూలు
న్యూస్టుడే, కాకినాడ నగరం: విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు. ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర సిలబస్ బోధించే ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈ చట్టం కింద చేరే పిల్లలకు బోధనా రుసుములు (ఫీజు) ప్రభుత్వమే చెల్లించాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో మార్గం సూచించింది. ‘అమ్మఒడి’ పథకం నుంచి ఫీజు తీసుకోవాలని సూచించింది. అర్బన్ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేల చొప్పున ఫీజుగా నిర్దేశించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. అయితే ‘అమ్మఒడి’ నిధులు వచ్చేలోగా ఆయా పాఠశాలలకు తల్లిదండ్రులే ఫీజు చెల్లించాలని విద్యా శాఖ అధికారులు పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఉచిత ప్రవేశాలని చెప్పి ఫీజు వసూలు చేస్తారా అని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
- కాకినాడ జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో 215 మందికి, 2023-24లో 1,141 మంది పిల్లలకు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
- ఈ చట్టం కింద పేద వర్గాలకు కేటాయించాల్సిన సీట్ల భర్తీపై మార్గర్శకాలున్నాయి. వాటి ప్రకారం అనాథలు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, నిరుపేద ఎస్సీ పిల్లలకు 10 శాతం, ఎస్టీ చిన్నారులకు 4 శాతం, బీసీ, మైనారిటీ, ఓసీ తదితర ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు 6 శాతం చొప్పున సీట్లకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఫీజు విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ఉచిత సీట్లని ప్రకటించినా ఆయా విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించే ‘అమ్మఒడి’ సాయం నుంచే ఫీజు వసూలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం వివాదాస్పదంగా మారింది. ఇలాగైతే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఏకరూప దుస్తులు, బూట్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు అమ్మఒడి సాయం కూడా అందేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకంలో చేరే పిల్లలకు తల్లి లేదా తండ్రి లేకపోవడం, కొందరికి ఇద్దరూ లేకపోవడం.. ఇద్దరూ ఉంటే వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, కొందరు సంరక్షుల వద్ద పెరగడం ఇవన్నీ ప్రతికూలతలుగా మారుతున్నాయి.
పాత బకాయిల వసూళ్లకే..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫీజుపై ఎలాంటి ఒత్తిడి లేదు. 2022-23 విద్యా సంవత్సరంలో చాలామంది ‘అమ్మఒడి’ సొమ్ము ఫీజుగా చెల్లించలేదు. ఈ కారణంగా ఆయా పాఠశాలల యజమానులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. పాత బకాయిలు చెల్లించాలని సూచిస్తున్నామే తప్ప ఎవరినీ ఒత్తిడికి గురిచేయడం లేదు.
పి.రమేష్, సమగ్ర శిక్ష ఇన్ఛార్జి ఏపీసీ, డీఈవో
తల్లిదండ్రులపై ఒత్తిడి..
ప్రభుత్వం ముందుగా ఉచిత సీట్లను ప్రకటించింది. తీరా ప్రవేశాలు కల్పించాక ‘అమ్మఒడి’ పథకంలో రూ.13 వేలు చొప్పున జమయ్యే నిధుల నుంచి కోత పెడుతోంది. అయితే చిన్నారుల తల్లి లేదా సంరక్షకుల ఖాతాలో జమవుతున్న ఈ సొమ్మును వారు తమ అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 215 మందికి ప్రవేశాలు కల్పించగా వీరిలో సగానికిపైగా విద్యార్థులకు ఫీజు జమకాలేదు. 2023-24 విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనుంది. వీరికి ఇంకా అమ్మఒడి పథకం డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. వచ్చే జూన్ నెలలో వచ్చే అవకాశముందని సమాచారం. ఈలోగా 2024-25 విద్యా సంవత్సరంలో 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేటు పాఠశాలల యజమానులు ఫీజు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా స్పందించడంతో ఫీజు బకాయిలు చెల్లించాలని తల్లిదండ్రులపై విద్యా శాఖ యంత్రాంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్ విజయం కోరుతూ.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
[ 01-06-2024]
ఎన్నికల్లో పవన్కల్యాణ్ గెలవాలని కోరుతూ తూర్పుగోదావరికి చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్ఎంపీ వైద్యం చేస్తుంటారు. -
ఏ కాలువ చూసినా మేటలు.. మైదానాలే
[ 01-06-2024]
రైతుల కష్టాలు పట్టించుకున్నది లేదు.. సాగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణపై ప్రణాళిక లేదు.. నిధులు విదిల్చిందీ లేదు.. వైకాపా ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఇది. రబీ పూర్తయిన తరువాత లాకులు, స్లూయిస్లు, ఇతర నిర్మాణాల నిర్వహణతో పాటు కాలువల్లో పూడికతీత చేపట్టాల్సి ఉన్నా విస్మరించింది. -
పింఛను సొమ్ముకు యాతన పడాల్సిందే..
[ 01-06-2024]
పింఛను కోసం ఈసారీ లబ్ధిదారులు అవస్థలు పడాల్సిన పరిస్థితే. అసలే రోహిణీ కార్తె.. ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఉండగా.. ఇలాంటి తరుణంలో బ్యాంకుల వరకు వెళ్లి పింఛను డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం మళ్లీ కల్పించింది. -
నిన్న కందిపప్పు.. నేడు గోధుమ పిండి
[ 01-06-2024]
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై అందించే నిత్యావసర సరకులను కుదించుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత నెలకు గోధుమ పిండిలోనూ కోత పెట్టింది. రేషన్లో ఇచ్చేది నాలుగు రకాల సరకులే అయినప్పటికీ వాటిలో బియ్యం మినహా మిగతావి అరకొరగానే సరఫరా చేస్తూ వచ్చింది. -
ఫలితం.. ఉత్కంఠభరితం
[ 01-06-2024]
ఓటరు తీర్పు వెల్లడయ్యే రోజు సమీపిస్తోంది.. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతోపాటు.. ఓటేసినవారిలో సైతం ఉత్కంఠ నెలకొంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. ఈనెల 4న ఓట్ల లెక్కింపు- ఫలితాల వెల్లడి ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. -
నాణ్యతకు నీళ్లొదిలేశారు..
[ 01-06-2024]
నాసిరకం నీటిని విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై ఎట్టకేలకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉమ్మడి జిల్లాలో ప్రమాణాలకు తిలోదకాలిస్తూ జోరుగా నీటి వ్యాపారం సాగిస్తున్న వైనంపై మే 27న ‘ఊరూవాడ జలమాఫియా’ శీర్షికన ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. -
విద్యుత్తు కోతలపై కదం తొక్కిన జనం
[ 01-06-2024]
ఓ పక్క భానుడి భగభగలతో జనం అల్లాడుతుంటే మరోపక్క విద్యుత్తు కోతలతో విలవిల్లాడుతున్నారు. విద్యుత్తు కోతలపై జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలు కదం తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలంలో చాలా గ్రామాలకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరఫరా నిలిచిపోయింది. -
మండుటెండకు మరెందరు బలికావాలో..?
[ 01-06-2024]
ప్రతి నెలా ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా.. పింఛను డబ్బుతో మందులు, నిత్యావసరాలు కొనుక్కోవాలని ఆశగా ఎదురుచూసే పండుటాకులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. సామాజిక భద్రతా పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలుగా లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
చౌకబారు మాటలు.. పేదల కడుపుమాడ్చే చేతలు
[ 01-06-2024]
పేదల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని గొప్పలు చెప్పుకొన్న జగన్మోహన్రెడ్డి సర్కారు పేదలకు అందించే నిత్యావసరాల్లో కోతలు విధిస్తూ వారిపై ఆర్థిక భారం మోపింది. -
పొగాకు వినియోగం క్యాన్సర్కు కారకం
[ 01-06-2024]
ఏటా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పొగాకు వినియోగదారులే ఉంటున్నారని డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి తెలిపారు. శుక్రవారం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పొగాకు వినియోగ వ్యతిరేక దినం నిర్వహించారు. -
గోధుమపిండికి ఎగనామం
[ 01-06-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాలన ముగింపు దశకు వచ్చినా రేషన్ సరకుల పంపిణీలో కోతలు విధిస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో చౌక దుకాణాల ద్వారా 14 సరకులను పంపిణీ చేయగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక మూడు సరకులకే పరిమితం చేశారు. -
నిప్పులుచెరిగే ఎండలో బ్యాంకులకు వెళ్లాల్సిందే..!
[ 01-06-2024]
రోహిణ కార్తెతో ఎండలు మండుతున్నాయి. కాకినాడ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్న సమయాల్లో వృద్ధులు, నడివయస్కులు, దివ్యాంగులు పింఛను కోసం ఇంటి నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. -
తెలుగుతల్లి.. తల్లడిల్లి..
[ 01-06-2024]
పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. మహామహులకు విద్యనందించిన ఈ సాహిత్య పీఠం ఉనికిని కాపాడుకోవడానికి నానాపాట్లు పడుతోంది. -
ఉష్.. ఉక్కిరిబిక్కిరి
[ 01-06-2024]
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కబోతతో ప్రజల ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి 7 దాటినా వేడి గాలులు వీస్తునే ఉన్నాయి. చిన్నారులు, వృద్ధులతోపాటు బయట తిరిగేవారు డీహైడ్రేషన్, వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్