ఇసుకంతా తోడేస్తున్నా.. ఇంకెన్నాళ్లు నిద్ర నటిస్తారు?
గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు.
ఇసుక తవ్వకాలకు నదీగర్భంలో వేసిన రోడ్లు
సీతానగరం: గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. తూర్పు, ఏలూరు జిల్లాలను సరిహద్దులుగా చెప్పుకుంటూ మునికూడలి గోదావరి నదిలో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వి రేయింబవళ్లు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇసుక తవ్వకాలపై కన్నెత్తిచూసేందుకు కూడా భయపడుతోంది. నిత్యం వందలాది లారీల్లో ఇసుక ఇతర జిల్లాలకు తరలిస్తున్నా దారిలో ఎటువంటి తనిఖీలు చేయడం లేదు. తెదేపా హయాంలో ఈ ప్రాంతంలో వేల మంది కూలీలు ఇసుక తవ్వకాలతో ఉపాధి ఉండేదని వైకాపా నాయకులు అడ్డగోలు తవ్వకాలకు యంత్రాలను దించారని కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని గనులశాఖకు సమాచార హక్కుచట్టం ద్వారా విన్నవించినా ప్రయోజనం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తుందో..రాదో తెలియదు దొరికిన కాడికి దోచుకోవాలనే రీతిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేసుకుంటూ పోతున్నారు వైకాపా నాయకులు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకతోపాటు వేలమంది కూలీలకు చేతినిండా రేవుల్లో పని కల్పిస్తామనే హామీ ఇసుకాసురులకు మింగుడు పడడం లేదు. ఇక సమయం లేదంటూ ఎక్కడపడితే అక్కడ గోదావరి తీరంలో యంత్రాలను దించేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎగువన అడ్డు వేయడం, గోదావరిలో నీటిఎద్దడి వల్ల వేసిన మేటలు తవ్వుకునేందుకు ఇసుకాసురులకు వరంగా మారిందంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద