ఎన్ని విచిత్రాలో..
ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి.
ఓటర్ల జాబితా అస్తవ్యస్తం
మాచవరం, న్యూస్టుడే
ఓటర్ల జాబితాలో చనిపోయిన వ్యక్తి పేరు
ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి. ప్రస్తుతం వరుస క్రమం తప్పడంతో ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జాబితా మొత్తం పరిశీలిస్తే తప్ప.. ఓటు ఉన్న విషయం తెలియని దుస్థితి. ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారు.
ఇంటి నంబరు, చిరునామాలు లేవు
మాచవరానికి చెందిన ఓటర్ల జాబితాలోని 161 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తే.. తొలిపేరుకు డోర్ నంబరే లేదు. అలా వరుసగా 28 పేర్లకు అడ్రసు లేదు. తరువాత 1-1 డోర్ నంబరుతో 11 మంది పేర్లు నమోదయ్యాయి. వీరందరూ వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. ఓటర్ల జాబితాలోని వరుస క్రమాన్ని పరిశీలిసే ఎన్నో విచిత్రాలు కనిపించాయి. 2-104 ఇంటి నంబరు తర్వాత 2-105 వరుస క్రమం రావాలి. కానీ 2-156 డోర్ నంబరులోని ఓటర్లు కనిపిస్తున్నారు. అదే విధంగా 3-15 తరువాత 3-101 ప్రచురితమైంది. ఈ ఒక్క పోలింగ్ కేంద్రమే కాకుండా, మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. తల్లిదండ్రుల ఓట్లు ఒకచోట ఉంటే, పిల్లలవి మరో చోట ఉన్నాయి. గ్రామ ఓటర్ల జాబితా అంతా పరిశీలిస్తే కానీ, అసలు ఓటు ఉందో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉంది.
* మాచవరానికి చెందిన ఓ యువకుడికి 18 ఏళ్లు నిండటంతో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నాడు. బీఎల్వో, తహసీల్దారు కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగడంతో ఓటు హక్కు లభించింది. తీరా చూస్తే వేరొక చోట నమోదై ఉంది. ఈ విధంగా వచ్చిన చేర్పులన్నీ ఏదో ఒక పోలింగ్ కేంద్రంలోని చివరి పేజీలో ప్రచురిస్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులతోపాటు కాకుండా విడిగా నమోదవుతున్నాయి.
మరణాల సంగతి దేవుడెరుగు..
సాధారణంగా ప్రతి గ్రామంలో ఏటా కొంతమంది వివిధ కారణాలతో చనిపోతూ ఉంటారు. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి. ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా సవరణ చేసిన ప్రతిసారీ అవే పేర్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మాచవరంలో దాదాపు 254 మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఇందులో పదేళ్ల కిందట చనిపోయిన వారి పేర్లు ఉండటం గమనార్హం. ఓ గ్రామంలోనే ఇన్ని ఓట్లు ఉంటే, నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శాఖల మధ్య సమన్వయలోపం ఉందనడానికి ఇదో ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు
[ 31-05-2024]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. -
ఠారెత్తిస్తున్న ఎండలు
[ 31-05-2024]
రోహిణి కార్తెలో రోళ్లు బద్ధలవుతాయనేది నానుడి. అందుకు అనుగుణంగానే ఎండలు మండిపోతున్నాయి. మొన్నటివరకు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు నమోదవగా బుధ, గురువారాల్లో 44, 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. -
ముద్రణలోనే పాఠ్య పుస్తకాలు!
[ 31-05-2024]
వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ తేదీలోగా ఇండెంట్ మేరకు పాఠ్యపుస్తకాలను పంపడం అసాధ్యమని విద్యాశాఖ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. -
కూలేలా ఉంది.. కళ్లు తెరవండి!
[ 31-05-2024]
తెనాలిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి దయనీయంగా ఉంది. పురుషుల సర్జికల్ వార్డు ఎదురుగా పేషెంట్లు, బంధువులు కూర్చునే చోట భవనం స్లాబు పెచ్చులూడి పడుతున్నాయి. -
సెంటు భూమి స్థలాల్లో మట్టి తవ్వకాలు
[ 31-05-2024]
అడిగేవారు లేరు.. నిలదీసేవారు అసలే లేరు. ఇంకేముంది మట్టి అక్రమార్కులు తమ ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. రాజధాని గ్రామమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సెంటు భూమి స్థలాల్లో మూడు రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. -
పత్తి విత్తనంపై పెత్తనం
[ 31-05-2024]
ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఆసక్తి చూపుతున్న విత్తనాల కొరత ఉందంటూ గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)కి మించి కొందరు వ్యాపారులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
రెచ్చగొట్టే పోస్టులు పెడితే అడ్మిన్లదే బాధ్యత
[ 31-05-2024]
వాట్సప్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు, ఫొటోలు పోస్టు చేస్తే గ్రూప్ అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ తుషార్ దూడి గురువారం తెలిపారు. -
మహాకవీ మన్నించు!
[ 31-05-2024]
గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు. మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు. జనులంతా ఒకటే కుటుంబం, జగమంతా ఒకటే నిలయం’ అని ఆదర్శ సమాజాన్ని ఆకాంక్షించారు గుర్రం జాషువా. -
అన్నం వేళకు వస్తామన్నారు.. అనంత లోకాలకు చేరారు
[ 31-05-2024]
జిల్లా కేంద్రం బాపట్ల పట్టణ శివారున నల్లమడ వాగులో బుధవారం గల్లంతైన హైదరాబాద్ వాసులు వడ్లకొండ కిరణ్, బండా నందు మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. -
అనుచరులు విహారాలకు.. కార్యకర్తలు జైళ్లకు
[ 31-05-2024]
జెండా మోసినందుకు తమను జైళ్లకు పంపిస్తారా? అనుచరులను కాపాడుకుని వేసవి విడిది కేంద్రాలకు పంపుతారా? అంటూ కార్యకర్తలు రగిలిపోతున్నారు. -
కౌలు కురదదాయే
[ 31-05-2024]
బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి, యుద్ధనపూడి మండలం కోనూరు గ్రామాల్లో గతేడాది మిర్చి కౌలు ధరలు ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు కుదిరాయి. -
కట్నం కోసం ఒళ్లంతా కొరికేశాడు
[ 31-05-2024]
అదనపు కట్నం కోసం ఒళ్లంతా కొరికేసిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. కానూరు సనత్నగర్కు చెందిన షేక్ ముస్కాన్కు, గుంటూరుకు చెందిన షేక్ మహ్మద్ రఫీకి ఏడాది కిందట వివాహం జరిగింది. -
కారుతో ఢీకొట్టి.. హతమార్చి..
[ 31-05-2024]
తన భార్యతో సన్నిహితంగా మెలిగాడనే కారణంతో ఓ వ్యక్తి కారుతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కిందపడిన ఒకరిపై కారు ఎక్కించాడు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. -
క్షయ నుంచి రక్షణకు బీసీజీ టీకా
[ 31-05-2024]
క్షయ వ్యాధి నుంచి రక్షించుకునేందుకు అడల్ట్ బీసీజీ టీకా దోహదం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు
-
ఈ ప్లేయర్లు యమ డేంజర్ బాసూ..!
-
సినిమా థియేటర్లలో లోక్సభ ఎన్నికల ఫలితాలు.. ఎక్కడో తెలుసా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
గంటలతరబడి విమానం ఆలస్యం.. ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు
-
రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ మూవీ మెప్పించిందా?