‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు.
కొల్లిపర, న్యూస్టుడే : మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. తెదేపా ప్రకటించిన సూపర్- 6 సంక్షేమ పథకాలను వివరించారు. వైకాపాకు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు అభివృద్ధిలో వెనకబడ్డామని చెప్పారు. మరోసారి ఆ పొరపాటు చేయవద్దని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షులు భీమవరపు కోటిరెడ్డి, వంగా సాంబిరెడ్డి, మాజీ సర్పంచి యోగానంద ఛటర్జి తదితరులు పాల్గొన్నారు.
బుర్రిపాలేన్ని నమూనాగా తీర్చిదిద్దుతాం
తెనాలి టౌన్: ఘన కీర్తి సొంతం చేసుకున్న బుర్రిపాలెం గ్రామాన్ని నమూనాగా తీర్చిదిద్దుతామని, గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం అయిన నేపథ్యంలో ఇద్దరం కలిసి ప్రణాళిక రూపొందించుకొని అమలు చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని బుర్రిపాలెంలో సోమవారం ఆయన పర్యటించి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంగలకుదురులో డాక్టర్ నాదెండ్ల మనోహరం ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని నమూనా బ్యాలట్ పేపర్ చూపిస్తూ ప్రచారం చేశారు.నాదెండ్ల మిథుల్ సంగంజాగర్లమూడిలో టీ గ్లాసులు చూపిస్తూ తమ గుర్తును జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అన్నాబత్తుని జయలక్ష్మి, పెమ్మసాని రాజ్యలక్ష్మి, వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, కనగాల శ్రీనివాసరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
50 ఏళ్లకే పింఛను
పెదకాకాని, న్యూస్టుడే : మండల పరిధిలోని నంబూరులో సోమవారం నిర్వహించిన ప్రచారంలో తెదేపా కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సతీమణి జ్యోతిర్మయి పాల్గొన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
[ 02-06-2024]
పార్టీలకతీతంగా ప్రజా తీర్పును గౌరవించాలని జనసేన పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి (జనసేన) నాదెండ్ల మనోహర్ అన్నారు. -
భద్రత కట్టుదిట్టం..!
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
జీఎంసీ స్థలంలో ప్రహరీ నిర్మాణంపై వివాదం
[ 02-06-2024]
నగరపాలక సంస్థకు చెందిన ట్యాంక్ పోరంబోకు స్థలంలో ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మాణం చేపట్టగా.. -
పనులు పూర్తి చేయండి... లేదంటే సొమ్ములిచ్చేయండి
[ 02-06-2024]
పాఠశాల ప్రధానోపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బడి ఖాతాలో డబ్బులు ఉంటే వాటిని వినియోగించి పాఠశాలల్లో ఉన్న అసంపూర్తి పనులు పూర్తి చేసుకోండి. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కలెక్టర్
[ 02-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 4న జిల్లాలోని ఏడు అసెంబ్లీ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు నిర్వహించే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి చెప్పారు. -
‘ఎన్డీయే కూటమిదే విజయం’
[ 02-06-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు సూచిస్తున్నాయని రాజధాని రైతులు తెలిపారు. -
కాసులు రాల్చక.. కాలువలు కానక..
[ 02-06-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువల మరమ్మతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
ప్రత్యర్థుల హత్య.. శవాలు మాయం
[ 02-06-2024]
గురజాల మండలం దైదలో 1997లో జరిగిన హత్యలో హతుడు తగుళ్ల పిచ్చయ్యను ముక్కలుగా నరికి కృష్ణానదిలో వేసిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు