పటిష్ఠ యంత్రాంగం.. పక్కా వ్యూహం
పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది.
ఎన్నికల నియమావళి అమలుకు నిఘా
ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్న కాల్ సెంటర్ సిబ్బంది
వికారాబాద్, న్యూస్టుడే: పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేలా నిఘా ఏర్పాటు చేసింది. నిబంధనల ఉల్లంఘనలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై ‘న్యూస్టుడే’ కథనం.
మద్యం పంపిణీ చేసినా..
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు మద్యం పంపిణీకి యత్నిస్తారు. అనుమతి లేకుండా, పరిమితికి మించి మద్యం నిల్వ చేసినా, విక్రయించినా ఓటర్లకు పంపిణీ చేసినా శిక్షార్హులవుతారు. ఇందులో పట్టుబడితే ఎక్సైజ్ చట్టం-1968 ప్రకారం ఆరుమాసాల నుంచి ఏడాది జైలు, రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మద్యం పంపిణీపై జిల్లా ఆబ్కారీ అధికారి ఫోన్ నం. 8712658729కు చేసి ఫిర్యాదు చేయవచ్చు.
గెలవాలని కానుకలిస్తారు
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో అభ్యర్థులు తమ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఓటర్లకు కానుకలు పంపిస్తుంటారు. చీరలు, కుక్కర్లు, క్రికెట్ కిట్లు, ఫోన్లు ఇలా ఏదీ ఇచ్చినా ఐపీసీ సెక్షన్ 171(ఈ) ప్రకారం ఏడాది జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కానుకలపై ఆయా మండలాల సహాయ ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ, తహసీల్దార్లకు లేదా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఫోన్ నం.08416-357507కు ఫిర్యాదు చేయవచ్చు.
ఓటర్లను బెదిరిస్తే.. కంట్రోల్ రూమ్కు..
అభ్యర్థులు కొన్నిసార్లు ఓటర్లను బెదిరిస్తారు. ఇలా చేస్తే ఐపీసీ సెక్షన్ 171 (సి) ప్రకారం ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆయా పోలీస్ఠాణాల నిలయాధికారులకు, ఎన్నికల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్కు ఫిర్యాదు చేస్తే స్పందిస్తారు. చర్యలు తీసుకుంటారు.
సందేహాల నివృత్తికి..
సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1950 టోల్ఫ్రీ సంఖ్యకు ఫోన్ చేయాలి. ఓటర్ల జాబితాలో పేర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు. అనుమతి లేకుండా గోడ పత్రికలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, ప్రచారం చేయడం తదితరాలపై ఫిర్యాదులు చేయాలి. ఇప్పటివరకు 115 అందగా, స్పందించి పరిష్కరించారు.
100 నిమిషాల్లోపే పరిష్కారం
ప్రచార సమయం, కోడ్ ఉల్లంఘన, నియమావళి అమలుపై సి- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోపు సమస్యను పరిష్కరించే బాధ్యతను ఫ్లయింగ్ స్క్వాడ్ తీసుకుంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కు రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులను సైతం పరిష్కరిస్తారు. ఇప్పటి వరకు 18 ఫిర్యాదులు అందగా, అన్నీ పరిష్కరించారు. ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదుచేసే అవకాశాన్ని కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్