ఆ నాలుగూ ఇక్కడే. అధికారులకు సవాలే
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం.
లక్షమందికిపైగా ఎన్నికల ఉద్యోగులు.. సిబ్బంది
రాజధానిలోనే అతిపెద్ద లోక్సభ నియోజక వర్గాలు
ఈనాడు, హైదరాబాద్
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఎన్నికల అధికారులు నిద్రాహారాలు లేకుండా పోలింగ్ కేంద్రాలు.. ఈవీఎంలను సిద్ధం చేస్తున్నారు. అధికసంఖ్యలో ఓటర్లతోపాటు అభ్యర్థులు కూడా ఎక్కువమంది పోటీచేస్తుండడంతో ఈవీఎంలు కూడా అదనంగా సమకూర్చుకుంటున్నారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా కొనసాగేందుకు వీలుగా లక్షమందికిపైగా ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
అత్యధిక ఓటర్లు వరుసగా..
మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలో మొత్తం 37.80లక్షల మంది ఓటర్లున్నారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గంగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. రెండో స్థానంలో చేవెళ్ల 29.39లక్షలు, మూడో స్థానంలో హైదరాబాద్ 22.17లక్షలు, నాలుగో స్థానంలో సికింద్రాబాద్ 21.20లక్షలు లోక్సభ నియోజకవర్గాలున్నాయి.
- రాష్ట్రంలోని 17నియోజవర్గాల్లో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లుండగా.. ఇందులో 1.10కోట్ల మంది ఓటర్లు హైదరాబాద్ పరిధిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్య 19.45లక్షలు కాగా.. రాష్ట్రంలోని 13 లోక్సభ నియోజవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలోనూ స్త్రీ, పురుష ఓటర్లు కలిపినా 19.45లక్షల మంది లేరు.
- హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం స్టాండ్బైగా 30శాతం మందిని వేర్వేరు విభాగాలు, శాఖల నుంచి తీసుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా అనారోగ్య సమస్యలున్నవారు చివరి నిముషంలో ఎన్నికల విధులకు గైర్హాజరైనా సరిపోతుందున్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- రాష్ట్రంలోనే అత్యధికంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 46మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజవర్గ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే అధికంగా మహిళా ఓటర్లున్నారు.
ఓటర్లు ఇక్కడ.. ఇలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్