నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది.
కార్నర్ మీటింగ్లో గులాబీ దళపతి కేసీఆర్
ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, హాజరైన ప్రజలు
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్ : ‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ పార్క్ చౌరస్తాలో జరిపిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. ఆరు గ్యారంటీలంటూ హామీలిచ్చిన కాంగ్రెస్..వాటిని అమలు చేయటం లేదని మండిపడ్డారు. అవి అమలు కావాలంటే.. ప్రభుత్వం మెడలు వంచి .పోరాటం చేసేందుకు భారాస అభ్యర్థిని గెలిపించాలన్నారు నిజామాబాద్లో గత ఎన్నికల్లో భాజపా ఎంపీని గెలిపించారని..ఆయన వల్ల ఇక్కడ ఏం లాభం జరగలేదని విమర్శించారు. తమది సెక్యులర్ విధానమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 20 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయని.. ముస్లింలు ఆ పార్టీకి ఓటేస్తే భాజపా లాభపడుతుందన్నారు. పులిలాంటి గోవర్ధన్ను గెలిపించాలని చెప్పారు. తెల్లారితే విద్వేషాలు రెచ్చగొట్టే భాజపాకు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. బస్సుయాత్రగా నిజామాబాద్కు చేరుకున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద మహిళలు మంగళహారులతో స్వాగతం చెప్పారు. పాత కలెక్టరేట్ కూడలి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు సాగింది. బస్సులో నుంచే కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం నెహ్రూ పార్క్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. కేసీఆర్ తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసంగించారు.
జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం
జగిత్యాల : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాల రోడ్షోలో పాల్గొన్న భారాస అధినేత కేసీఆర్ రాత్రి ఎమ్మెల్సీ ఎల్.రమణ నివాసంలో బస చేశారు. సోమవారం రోజంతా అక్కడే ఉన్న కేసీఆర్ నాయకులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం.సంజయ్కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీమంత్రి జి.రాజేశంగౌడ్, తదితరులతో మాట్లాడారు. ప్రచారం తీరు, గెలుపు అంశాలపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరపాలక కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. -
ఉద్యమస్ఫూర్తి.. చైతన్యకీర్తి
[ 02-06-2024]
పల్లె గొంతెత్తింది.. పట్నం కదిలింది.. రోడ్లు స్తంభించాయి.. వంటావార్పులకు దారులే అడ్డాగా మారాయి. -
జై బోలో హనుమాన్కీ
[ 02-06-2024]
‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామా.. రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్కీ..’ నినాదాలతో అంజన్న క్షేత్రం మారుమోగింది. -
బడిబాటకు వేళాయె!
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. -
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ
[ 02-06-2024]
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ గని ఏర్పాటు చేయనున్నారు. -
మూత ‘బడి’కి మోక్షం!
[ 02-06-2024]
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరిలోనే విద్యాశాఖను ఆదేశించారు. -
సాంకేతిక కోర్సులు.. ఉపాధికి బాటలు
[ 02-06-2024]
వారంతా పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పాఠాలను ఉపాధి, ఉద్యోగాలుగా మలుచుకోవడానికి వచ్చిన అభ్యర్థులు. -
పుస్తక పఠనం.. బాలల వికాసం
[ 02-06-2024]
నేటికాలం పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్పితే కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వంటి ఆలోచింపజేసే పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు