ఒక్కరితో బోధనెలా మామయ్యా!
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
విద్యకు భరోసా ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో 924 ఏకోపాధ్యాయ పాఠశాలలు
- కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
- జమ్మిపాళెంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 21 మందిచదువుతున్నారు. ఇక్కడా ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారు.
న్యూస్టుడే, నెల్లూరు(విద్య)
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు చాలనే సీఎం జగన్ ధోరణి విద్యా వ్యవస్థను తుంగలో తొక్కేలా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో జీవో 117 తెచ్చి పాఠశాలలను విలీనం చేయడంతో స్థానికంగా ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారిందంటున్నారు. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందదనే భావన వ్యక్తమవుతోంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అవసరమని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రాథమిక స్థాయిలో పాఠశాలకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడిని నియమించి చేతులు దులుపుకొంటోంది. ఆయా పాఠశాలల్లో తరగతులు ఎన్ని ఉన్నా.. ఒకరే అన్నీ తానై బోధన చేయాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులు బోధిస్తూ అలసి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏకోపాధ్యాయ బడిలో ఏదైనా అత్యవసరమై సెలవు పెట్టాల్సి వస్తే సమీప పాఠశాలల నుంచి మరో మాస్టారుని పంపాల్సి వస్తోంది. ఖాళీ పోస్టులు భర్తీ కాక ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది.
కుంటుపడుతున్న బోధన
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నా...క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. చాలా బడుల్లో ఒక్కరే ఉన్నారు. ఈ ఒక్కరికీ బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 924 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరు చొప్పున ఉపాధ్యాయులున్నారు. సింగిల్ టీచర్స్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అత్యవసరంగా సెలవు పెట్టాలంటే కష్టతరం అవుతోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సెలవు పెడుతున్న ఉపాధ్యాయుల స్థానంలో బోధనకు క్లస్టర్ రీసోర్స్ మానిటరింగ్ టీచర్స్ (సీఆర్ఎంటీ), పలువురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమిస్తున్నారు.
ఉపాధ్యాయులపై ఒత్తిడి
ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిపై ఒత్తిడి ఎక్కువవుతోంది. పలురకాల యూప్ల్లోకి సమాచారం అప్లోడ్ చేయాలి. ఒకవేళ నాడు- నేడు కార్యక్రమంలో పనులు చేస్తుంటే వాటిని పర్యవేక్షించాలి. ఉదయాన్నే మరుగుదొడ్లను ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల హాజరు వివరాలు ఉదయం పది గంటల్లోపు ఇవ్వకపోతే ఆ ప్రభావం మధ్యాహ్న భోజన పథకంపై పడుతోంది. నాడు- నేడుకు ఎంపికైతే పనుల వివరాలను అప్లోడ్ చేయాలి. సచివాలయ సిబ్బంది పర్యవేక్షించి సీఆర్యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు.ఈ యాప్ సాంకేతిక సమస్యతో ఉపాధ్యాయులకు అదనపు భారం అవుతోంది. రాష్ట్రస్థాయి యాప్లకు తోడు జిల్లాస్థాయిలో మరికొన్ని యాప్ల్లో వివరాలు అప్లోడ్ చేయాలి.
పాఠశాలల్లో పిల్లల్ని చేర్చడం లేదు
రమేష్, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల బోధన కుంటు పడుతోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు
[ 02-06-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
గంటల వ్యవధిలో దంపతుల మృతి
[ 02-06-2024]
ఏ కష్టం వచ్చినా కలసి ఉంటామని మనువాడేటప్పుడు బాస చేసుకున్న ఆ దంపతులు ఒక్కటిగానే ఇహం వీడి పరం చేరారు. భార్య కన్నుమూతతో కలత చెందిన భర్త కూడా ఆమె మృతదేహంపై రోదిస్తూ తుది శ్వాస విడిచారు. -
సోమశిల.. సాగుకెలా?
[ 02-06-2024]
ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు 115 ఎంఎల్డీ నీటిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సోమశిల జలాశయం నీటి కేటాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పరిశ్రమల రాకతో ప్రగతికి బాటలు పడతాయని ఓ వర్గం అంటుండగా- ఈ ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితులు.. -
భజే వాయుపుత్రం
[ 02-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అంజనీ సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో సామూహిక లక్ష మల్లెలార్చన నిర్వహించగా.. -
జమకాని సొమ్ము... జవాబు చెప్పేవారు లేరు!
[ 02-06-2024]
జూన్ నెలకూ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా- ఈసారి పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత మధ్య బ్యాంకుల వద్దకు చేరిన లబ్ధిదారులు.. -
కలగానే సొంత భవనాలు
[ 02-06-2024]
సంగంలోని ప్రభుత్వ ఆశ్రమ ఐటీఐకి సొంత భవనాలు కలగానే మిగిలాయి. ఏళ్లుగా పరాయి పంచనే తరగతులు నిర్వహిస్తున్నా.. ఐటీఐకి కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేసి ప్రయత్నాలు చేస్తున్నా.. అదే సమయంలో గ్రావెల్ దొంగలు గుల్ల చేస్తున్నా.. -
నిబంధనలకు నీళ్లు
[ 02-06-2024]
జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. మట్టి తరలింపులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా తీసుకెళుతున్నారు. -
అతివేగంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
[ 02-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామాక్షి ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు