గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది.
పల్లెల్లో ప్రచార హోరు
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. రెండు మూడు రోజుల నుంచి అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఓటర్ను కలుసుకుని తమ పార్టీకే పట్టం కట్టాలని వేడుకుంటున్నారు. పోలింగ్కు మరో వారం రోజులే గడువు ఉండడంతో పార్టీలు దూకుడు పెంచాయి. ఒక వైపు ఆయా పార్టీల అగ్రనేతల పర్యటనలు కొనసాగిస్తూనే ఇంకోవైపు క్షేత్రస్థాయి ప్రచారం వైపు దృష్టి సారించాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని జహీరాబాద్, నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో బూత్స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
10 మందికి అవకాశం
భాజపా, కాంగ్రెస్, భారాస పార్టీలు ఇప్పుడు ప్రచార బాధ్యతలను బూత్స్థాయి కార్యకర్తలపై ఉంచారు. మూడు పార్టీల్లోనూ క్రియాశీలకంగా పనిచేసేవారికి బూత్స్థాయి కమిటీల్లో అవకాశం కల్పించారు. ఈ కమిటీలు రెండు మూడు రోజుల నుంచి పల్లెల్లో ఇంటింటా తిరిగి తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒక్కో కమిటీలో పది మంది కార్యకర్తలు ఉంటున్నారు. నిత్యం వీరు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు.
ఎవరి లెక్కలు వారివే
రెండు లోక్సభ నియోజకవర్గాల్లో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిల్లో ఆయా పార్టీలు ఓట్ల లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ మండలంలో తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రత్యర్థి పార్టీకి ఎన్ని వస్తాయి వంటి విషయాలను గణాంకాలు వేసుకుంటున్నాయి. మొత్తంగా విజయావకాశాలు తమకే ఉన్నాయంటూ ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశాయి.
చేరికలపై నజర్..
ప్రత్యర్థి పార్టీలను బలహీన పర్చేందుకు ఆయా పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, భాజపాల్లోకి వలసలు పెరిగాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి ద్వితీయశ్రేణి నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లోని మాజీ సర్పంచులు, తాజా మాజీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తాజా మాజీలు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు పార్టీలు మారారు. కులసంఘాల నేతలను కూడా ఆయా పార్టీల్లోకి చేర్చుకుంటున్నారు. పోలింగ్ తేదీ సమీపించడంతో ఆయా సామాజికవర్గాల ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆయా కులసంఘాలకు ఏమేమి పనులు చేస్తారో వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరు నిండదు.. దాహం తీరదు!
[ 01-06-2024]
కామారెడ్డి జిల్లా పెద్దకోడప్గల్ మండలంలోని అంజనీ గ్రామంలో పశువుల దాహార్తి కోసం నిర్మించిన నీటి తొట్టి నాచుతో నిండుకు పోయింది. -
చోరీలు చేస్తున్న ముఠా అరెస్ట్
[ 01-06-2024]
నవరంగ్పూర్ జిల్లాలో జరిగిన చోరీ కేసులో పోలీసులు శనివారం ఓ ముఠాసు అరెస్ట్ చేశారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
[ 01-06-2024]
ఆర్య క్షత్రీయ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూ వేణుగోపాలరావు అన్నారు. -
త్రిలింగ రామేశ్వరుడ్ని దర్శించుకున్న నూతన ఎంపీపీ
[ 01-06-2024]
మండలంలోని తాండూరు గ్రామంలో ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన త్రిలింగ రామేశ్వరుడ్ని నాగిరెడ్డిపేట మండలం నూతన ఇన్ఛార్జ్ ఎంపీపీ వినీత దంపతులు శనివారం దర్శించుకున్నారు. -
ధాన్యం బదిలీ ఒప్పందాలపై ఉదాసీనత
[ 01-06-2024]
మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించారు. కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగివ్వాల్సిన గడువు ముగిసినా పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. -
మహిళల అభ్యున్నతికి బాటలు
[ 01-06-2024]
మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ఎరువుల అమ్మకాల్లో గోల్మాల్
[ 01-06-2024]
జిల్లాలోనే అతి పెద్ద సహకార సంఘంగా పేరొందిన మాక్లూర్లో.. అవినీతి అక్రమాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. -
కళ తప్పిన డిచ్పల్లి టీటీడీసీ
[ 01-06-2024]
డిచ్పల్లిలోని టీటీడీసీ భవనాన్ని(సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం) 2003లో నిర్మించారు. -
ఆహారశుద్ధి కేంద్రాలు.. ఉపాధికి బాటలు
[ 01-06-2024]
జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నప్పటికీ కార్యాచరణ అంతంత మాత్రంగానే ఉంది. -
బస్తాల్లో కోత.. మిగిలింది వ్యథ
[ 01-06-2024]
ఆరుగాలం కష్టపడిన రైతులకు నిరాశే మిగులుతోంది. వారి కష్టాన్ని కొందరు మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. -
శాశ్వత ఉద్యోగులతో ఆస్తి పన్ను వసూలు
[ 01-06-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్ల విధానంలో మార్పులు చేపట్టారు. ఇదివరకు తాత్కాలిక సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి నిర్మాణాల కొలతలు స్వీకరించి ఆన్లైన్లో తప్పుగా నమోదు చేసేవారు. -
సంతకాలు లేకుండానే రూ.8.50 లక్షల చెల్లింపులు
[ 01-06-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉపాధి పనులు క్షేత్ర సహాయకులు, సాంకేతిక సిబ్బంది, ఆ శాఖ అధికారులకు వరంగా మారాయి. -
ఇందూరు గడ్డ పెట్టిన భిక్ష
[ 01-06-2024]
‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్రగీతంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం తనకు లభించిన గౌరవమని, ఇందూరు గడ్డ పెట్టిన భిక్ష అని ప్రముఖ కవి అందెశ్రీ అన్నారు. -
సరకు సర్కారుకు తెలిసేలా..
[ 01-06-2024]
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. -
ఆలయాల్లో వరుస చోరీలు
[ 01-06-2024]
ఆలయాల్లో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పట్టణాలు, గ్రామ శివారు మందిరాల్లో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. -
చోరీకి యత్నించిన నిందితుడిపై దాడి: మృతి
[ 01-06-2024]
ఓ నివాసంలో చోరీకి యత్నించిన నిందితుడిపై సదరు ఇంటి వారు దాడి చేయడంతో అతను మృతి చెందిన ఘటన వర్ని మండలంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్జాయ్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం