కలుస్తూ.. కలియతిరుగుతూ..
లోక్సభ ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఊళ్లను చుట్టేస్తున్నారు.
సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా..
జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు
ఈనాడు, నిజామాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఊళ్లను చుట్టేస్తున్నారు. ఘాటైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు పెద్దసంఖ్యలో ఓటు బ్యాంకును సాధించే వ్యూహాలకు పదును పెడుతున్నారు. కులాల వారీగా ఉన్న ఓట్ల పరిగణనలోకి తీసుకుంటూ.. ఆయా సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా వర్గానికి తోడ్పాటునందించిన విషయాలు చెబుతున్నారు. తమ పార్టీకి ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఇదే సందర్భంలో సదరు సామాజికవర్గానికి రానున్న రోజుల్లో ప్రయోజనం చేకూర్చే విషయాలపై హామీలు ఇస్తున్నారు.
గంపగుత్తగా ఒడిసిపట్టేందుకు..
నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీల ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉంటుంది. వీరిని తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు మూడు పార్టీలు చేస్తున్నాయి. ఒక సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో అదే కులానికి చెందిన నేతలను రంగంలోకి దింపుతున్నారు. వారు సదరు కుల పెద్దలతో సమావేశమవుతూ తమ పార్టీకి ఓట్లు వేయించాలని కోరుతున్నారు. తర్పల వారీగా సమావేశాలు నిర్వహించుకొని తమ పార్టీ సందేశాలను వివరించి ఓట్లు వేసేలా చూడాలని విన్నవిస్తున్నారు. సంఘం జిల్లా పెద్దలు ఇతర మండలాల వారిని కలవడానికి వెళ్లేందుకు వాహనాలు సమకూరుస్తున్నారు. చిన్నపాటి విందులూ ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యర్థి ఓట్లు చీల్చే ఎత్తుగడ
లక్షల్లో ఓట్లున్న రెండు బీసీ కులాలపై మూడు పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇందులో ఓ సామాజికవర్గం ఒక పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తోంది. మరో కులంలోనూ ఆ పార్టీకి పెద్దసంఖ్యలో ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇది గ్రహించిన ప్రత్యర్థి పార్టీలు ఆ రెండింటి ఓటు బ్యాంకును కొంత మేర తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇలా వ్యూహప్రతివ్యూహాలతో ప్రచారంలో జోరు పెంచాయి. ఈ ఎత్తుగడలు.. ఎంత వరకు ఫలిస్తాయనేది పోలింగ్ సరళి.. ఫలితాలు వెల్లడైన తర్వాత గానీ అంచనా దొరికే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల అంశం చుట్టే..
ప్రభావం చూపే రిజర్వేషన్ల అంశంపైనా చర్చ పెడుతున్నారు. తమ ప్రసంగాల్లో ఈ విషయాలనే ప్రస్తావిస్తున్నారు. ఒకపార్టీపై మరోపార్టీ నెపం వేస్తూ పరస్పరం విమర్శల దాడులు చేసుకుంటున్నాయి. మీ వల్లే ఆ వర్గానికి నష్టం జరిగిందని ఒకరంటే.. లేదూ మీ పార్టీ నిర్ణయాలతోనే ఆయా వర్గాలు నష్టపోతున్నాయంటూ మరొకరు వాదన చేస్తున్నారు. ఇలా ఒకే అంశంపై ప్రత్యర్థి పార్టీలన్ని మాట్లాడుతున్నా.. ప్రజలు ఎవరి వాదనను విశ్వసిస్తారు? ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా ప్రగతి సాగాలి
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలోనూ ప్రత్యేక ముద్ర కనిపించినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. నేటితో 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటోంది. -
ఉద్యమానికి ఊపిరై.. స్వరాష్ట్ర సాధకులై
[ 02-06-2024]
నిజాం చెర నుంచి విముక్తి కోసం జరిగిన విమోచనోద్యమంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు పోరాట పటిమతో ఉద్యమం చేపట్టారు. -
రాష్ట్ర గీతం సృష్టికి ఇందూరే స్ఫూర్తి
[ 02-06-2024]
రాష్ట్ర గీతంగా గుర్తించడం అందెశ్రీకి దక్కిన గౌరవం. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ ఊపిరిలూదితే.. మలి దశ పోరాటంలో అందరిలో స్ఫూర్తి నింపింది అందెశ్రీ గీతం.. -
తండా రోడ్డు తవ్వేశారు...
[ 02-06-2024]
రైతుల మధ్య ఏర్పడిన పంచాయితీ రోడ్డు తవ్వేయడానికి కారణమైంది. మంచిప్పకు చెందిన ఓ రైతు శివలాల్ తండాకు వెళ్లే రోడ్డును పొక్లెయిన్తో శనివారం తవ్వించేశారు. -
ఉపాధి కల్పిస్తానని మోసం
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన శనివారం వెలుగుచూసింది. -
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురి డిబార్
[ 02-06-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్లోని ఇందూరు ఉషోదయ, బోధన్లోని ఎస్వీ, ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. -
అక్రమ కుళాయిలపై కొరడా
[ 02-06-2024]
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అక్రమ కుళాయిలపై కొరడా ఝలిపించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు రంగం సిద్ధం చేశారు. -
కలెక్టరేట్లో వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఉదయం 8.45కు వినాయక్నగర్లోని అమరవీరుల
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్