పుత్రోత్సాహం ముందు ఓడిన సిద్ధాంతం
సురేష్ రౌత్రాయ్. ఈయన రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులు. అయిదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన సొంతం. కాంగ్రెస్తో తన జీవితం పెనవేసుకుందని, ఆ పార్టీకే తాను అంకితమని పదేపదే చెప్పిన సురేష్ ఖుర్దా జిల్లా జట్నీ నుంచి అసెంబ్లీకి అయిదుసార్లు ఎన్నికయ్యారు.
భువనేశ్వర్లో కొడుకుని గెలిపించడానికి సురేష్ ఆరాటం
షోకాజ్ నోటీసు జారీ చేసిన పీసీసీ
తండ్రి సురేష్, మేయర్ సులోచనతో మన్మధ్ ప్రచారం
భువనేశ్వర్, న్యూస్టుడే: సురేష్ రౌత్రాయ్. ఈయన రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులు. అయిదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన సొంతం. కాంగ్రెస్తో తన జీవితం పెనవేసుకుందని, ఆ పార్టీకే తాను అంకితమని పదేపదే చెప్పిన సురేష్ ఖుర్దా జిల్లా జట్నీ నుంచి అసెంబ్లీకి అయిదుసార్లు ఎన్నికయ్యారు. మంత్రిగానూ విధులు నిర్వహించారు. విపక్షాలకు, ప్రసార సాధనాలకు సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఆయన తన వయసు ఎనిమిది పదులు దాటిందని, తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, విద్యావంతులైన ఇద్దరు కుమారుల్ని ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులుగా చేసి వారి తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఒక ప్రైవేటు విమానయాన సంస్థలో కెప్టెన్గా పనిచేసి ఇటీవల ఉద్యోగం వదులుకుని వచ్చిన ఆయన చిన్నకుమారుడు మన్మధ్ తండ్రి మాట వినలేదు. కాంగ్రెస్లో చేరడానికి ససేమిరా అన్న ఆయన బిజదలో చేరారు. అసెంబ్లీ టికెట్టు ఆశించిన మన్మధ్కు నవీన్ ఏకంగా భువనేశ్వర్ లోక్సభ సీటు కేటాయించారు.
కొడుకును ఎలా విస్మరిస్తారు?
చిన్నకొడుకు మాట వినకుండా తన మనసుకు గాయం చేసినట్లు విలేకరుల వద్ద ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సురేష్ తాను చేసేదేమీ లేదని, కుమారుడు మేజర్ కావడంతో ఆయన అభిరుచికి గౌరవించక తప్పడం లేదన్నారు. మన్మధ్ భువనేశ్వర్ లోక్సభ అభ్యర్థి అయినా తాను ప్రచారం చేయనని, కాంగ్రెస్ అభ్యర్థులకే అండగా ఉంటానన్నారు. కుమారుడు ప్రచారం ప్రారంభించిన తర్వాత ఉండలేకపోయిన సురేష్ కుమారునికి బాసటగా నిలిచారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని చాలాసార్లు చెప్పిన ఆయన కుమారుని వెంట తిరగడం ఉన్నతాశయాలు గల యువనేతగా ఓటర్లకు వివరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పీసీసీ నేతలు సురేష్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వివరణ అడిగారు. దీనిపై విలేకరులు ఆదివారం భువనేశ్వర్లో సురేష్ను అడగ్గా, తాను తప్పేమీ చేయలేదని, కొడుకు ఉత్తముడని చెప్పడం బిజద తరఫున ప్రచారం చేయడం తప్పు కాదని సమర్థించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
[ 01-06-2024]
గజపతి జిల్లా గుమ్మ ఫండి ఠాణా పరిధిలోని జంగలో గ్రామ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. -
అనారోగ్యంతో ప్రముఖ కళాకారుడు కన్నుమూత
[ 01-06-2024]
ప్రాచీన తోలు బొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు పద్మశ్రీ మాగుని చరణ్ కువాన్ (88) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
పోలింగ్ కేంద్రంలో ఇద్దరి మృతి
[ 01-06-2024]
జాజ్పూర్ జిల్లా బింజారపూర్ అసెంబ్లీ పరిధిలోని 157వ నంబరు పోలింగ్కేంద్రం బూత్ లెవల్ అధికారి మనోరంజన్ స్పృహతప్పి కింద పడిపోయారు. -
నేడు ఆఖరి విడత ఎన్నికలు
[ 01-06-2024]
చివరి విడత(నాలుగు) పోలింగ్కు అంతా సిద్ధమైంది. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. -
18కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
[ 01-06-2024]
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలోని రవుర్కెలా ప్రభుత్వాసుపత్రిలో 12 మంది వడదెబ్బతో మృతి చెందడం ఉలికిపాటుకు గురి చేసింది. -
పొట్టంగిపైనే అందరి దృష్టి
[ 01-06-2024]
కొరాపుట్ జిల్లా పొట్టంగి నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. -
రాష్ట్రం అగ్ని గుండం
[ 01-06-2024]
భానుడి విశ్వరూపానికి రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో వడ గాడ్పులు, పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉత్తర కోస్తా తీర జిల్లాల్లో పెరిగిన ఉక్కపోత మూలంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
ప్రాణాలతో ‘సెల్’గాటం
[ 01-06-2024]
రాష్ట్రంలో చరవాణి వినియోగిస్తూ వాహనాలు నడపడం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
పైసలిస్తేనే ప్రసవం
[ 01-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా పేదలకు సొమ్ము చెల్లించక తప్పడంలేదు. -
వ్యర్థాలతో వినూత్న ఆవిష్కరణ
[ 01-06-2024]
పలు వినూత్న కళాకృతుల తయారీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన బ్రహ్మపురలోని ప్రభుత్వ పరిశ్రమల శిక్షణా కేంద్రం (ఐటీఐ) మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం