హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులతో ప్రచారం
మార్కాపురంలో వైకాపా బరితెగింపు
కళాశాల యూనిఫాంలో వైకాపా ర్యాలీకి హాజరైన విద్యార్థులు
మార్కాపురం నేరవిభాగం, న్యూస్టుడే: అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురం పట్టణంలో అధికార వైకాపా ఆధ్వర్యంలో ఐటీ వింగ్ నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదమైంది. ర్యాలీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసినా స్పందన కరవైంది. దీంతో వైకాపా నేతలకు చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను దీనికి తరలించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.షంషీర్ అలీబేగ్, యర్రగొండపాలెం పరిశీలికులు వెన్నా హనుమారెడ్డిలకు చెందిన ఏ1 గ్లోబల్, ఇందిరా ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులను బస్సుల్లో అక్కడికి తరలించారు. కళాశాల యూనిఫాంలతోనే వారు పార్టీ జెండాలు, ప్ల కార్డులను పట్టుకుని దీనంగా పార్టీ శ్రేణుల్ని అనుసరించారు. పార్టీ పాటలు, డీజే శబ్ధాలతో ప్రధాన రహదారిపై నేతలు నానాయాగీ సృష్టించారు. ర్యాలీలో మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ అలీబేగ్, రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మన్ జంకె వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత జరిగినా అధికారులెవరూ దీన్ని నిరోధించలేదు. ర్యాలీతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహన దారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం తమ కళాశాలలకు సెలవులు ఇవ్వకుండా ఓట్లు వేసిన తరువాతనే ఊర్లకు వెళ్లాలని హుకుం జారీ చేశారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో నిలిచిన ట్రాఫిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15,87,681 మంది మదిలో ఏముందో!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మే 13న ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. తామెవరికి జైకొట్టిందీ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలుండగా, వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లున్నారు. -
పులొస్తుంది.. వేటాడుతుంది
[ 03-06-2024]
పులుల సంరక్షణ కేంద్రాల్లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఒకటి. విస్తీర్ణంలో ఇది దేశంలోని యాభై మూడింటిలోనే పెద్దది. జిల్లాలో మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని పెద్దదోర్నాల, కొర్రప్రోలు, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, నెక్కంటి, వీపీ సౌత్, మార్కాపురం రేంజ్లలో విస్తరించి ఉంది. -
వై.పాలెం పోలీసులా! చెవిరెడ్డి తొత్తులా!!
[ 03-06-2024]
యర్రగొండపాలెం ఆర్వోగా శ్రీలేఖ బాధ్యతలు చేపట్టింది మొదలు నిజాయతీగా వ్యవహరించారు. అధికార యంత్రాంగం నుంచి సహాయ నిరాకరణ ఎదురైనా తన విధులు తాను నిర్వర్తించారు. -
రానున్న ఫలితాల్లో కూటమి ప్రభంజనం
[ 03-06-2024]
మే 13న నాటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెదేపా కూటమి తరఫున నిలిచారు. ఆ విషయాన్నే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ వెల్లడించాయి. మంగళవారం వెలువడే అసలైన ఫలితాలూ అదే చెప్పనున్నాయి. -
తపాలా ఓట్లపై వైకాపా కుయుక్తులు
[ 03-06-2024]
‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైకాపా కుయుక్తులు పన్నుతోంది. లెక్కింపు సమయంలో ఆ పార్టీ ఏజెంట్లు గొడవలకు దిగే అవకాశం ఉంది. -
నడిబొడ్డున కబ్జా దుకాణం
[ 03-06-2024]
యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. పట్టణం నడిబొడ్డున చిన్న జాగాలో పాగా వేసి దుకాణం తెరుస్తున్నారు. దాన్ని అద్దెకిచ్చి వేల రూపాయలు దండుకుంటున్నారు. -
ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు
[ 03-06-2024]
ఈ నెల 4న రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
పశ్చిమంలో కుండపోత
[ 03-06-2024]
నిప్పుల కుంపటిలా మారిన పశ్చిమంపై వరుణుడు కరుణ చూపాడు. సెగలు కక్కుతున్న కనిగిరి, కంభం, బేస్తవారపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. -
వరుస చోరీలతో బెంబేలు
[ 03-06-2024]
పట్టపగలే దొంగతనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. పోలీసుల నిఘా లోపంతో చోరులు పేట్రేగిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. గత కొంతకాలంగా జిల్లా శివార్లలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. -
కొత్తపాలెంలో రూ.4 లక్షల సొత్తు చోరీ
[ 03-06-2024]
శనివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన సొత్తు చోరీకి గురైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. -
కుమారుడ్ని తుపాకీతో కాల్చిచంపిన కానిస్టేబుల్ అరెస్టు
[ 03-06-2024]
క్షణికావేశంతో కుమారుడ్ని తన సర్వీసు రివాల్వర్తో కాల్చిచంపిన కానిస్టేబుల్ను ఆదివారం అరెస్టు చేశారు. భాగ్యనగర్ నాలుగోలైన్లోని ఈవీఎం, వీవీప్యాడ్ల రిజర్వ్డ్ గోదాం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్బాబు
తాజా వార్తలు (Latest News)
-
ఒమన్పై నమీబియా ‘సూపర్’ ఓవర్ విక్టరీ
-
‘దేవర’ వర్సెస్ ‘వేట్టయాన్’.. ఎన్టీఆర్తో పోటీకి సిద్ధమైన రజనీకాంత్!
-
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
పిన్నెల్లికి సుప్రీం షాక్.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు
-
రూ.1,000లోపే ఓటీటీ, డీటీహెచ్, 3.3TB డేటాతో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు
-
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి